
3369 వార్తలు
నవతెలంగాణ-హైదరాబాద్ : దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్న 2026 అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ప్రక్రియకు రంగం సిద్ధమైంది. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాల్లోని మొత్తం 824 నియోజకవర్గాల్లో నమోదైన ఓట్ల లెక్కింపు మే 4వ తేదీ సోమవారం రోజు ఉదయం 8 గంటల నుంచి ప్రారంభం కానుంది. సాయంత్రం 4 గంటల కల్లా ఏ రాష్ట్రంలో ఎవరిది గెలుపనేది పూర్తిగా తెలిసిపోతుంది. తొలి గంటలో పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తారు. ఆ తర్వాత ఈవీఎంల లెక్కింపు […] The post రేపు ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు.. appeared first on Navatelangana.
నవతెలంగాణ-హైదరాబాద్ : కామారెడ్డి పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 12 షాపులు దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సింది. The post కామారెడ్డిలో అగ్నిప్రమాదం..షాపులు దగ్ధం appeared first on Navatelangana.
నవతెలంగాణ-హైదరాబాద్ : ఇరాన్పై దాడులను మళ్లీ ప్రారంభించే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. ఇరాన్ దురుసుగా ప్రవర్తిస్తే యుద్ధం పునఃప్రారంభిస్తామని స్పష్టం చేశారు. అక్కడ మిగిలిన క్షిపణి సామర్థ్యాలను లక్ష్యంగా చేసుకోవాలని కోరుకుంటున్నామని, ఇరాన్ నేతలు ఒప్పందం చేసుకోవాలని అనుకుంటున్నారని తెలిపారు. కాగా, యుద్ధాన్ని ముగించేందుకు అమెరికాకు ఇరాన్ 14 అంశాలతో ప్రతిపాదన పంపింది. The post దురుసుగా ప్రవర్తిస్తే ఇరాన్పై మళ్లీ దాడులు: ట్రంప్ హెచ్చరిక appeared first on Navatelangana.
నవతెలంగాణ-హైదరాబాద్ : దేశ రాజధాని ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. తూర్పు ఢిల్లీలోని షాహదరా జిల్లా వివేక్ విహార్ ఫేజ్-1లో ఉన్న ఓ నాలుగు అంతస్తుల నివాస భవనంలో ఈరోజు తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు గాయపడ్డారు. పోలీసులు, అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, ఈరోజు తెల్లవారుజామున భవనంలో మంటలు చెలరేగినట్లు సమాచారం అందింది. వెంటనే 14 ఫైర్ ఇంజన్లు ఘటనా స్థలానికి […] The post ఘోర అగ్నిప్రమాదం.. 9 మంది మృతి appeared first on Navatelangana.

మహబూబ్నగర్: ప్రేమ జంటను బెదిరించి ప్రియుడే ముందే బాలికపై ఇద్దరు యువకులు సామూహిక అత్యాచారం చేసిన సంఘటన మహబూబ్నగర్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... వికారాబాద్ జిల్లాకు చెందిన ఓ యువకుడు, బాలిక(17)ను తీసుకొని మహబూబ్నగర్ జిల్లా హన్వాడ మండలంలోని పిల్లిగుండుతండా శివారులోని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లాడు. ప్రేమ జంటను కూలీ పనులు చేస్తున్న అశోక్ కుమార్(26), లక్ష్మణ్(25) గమనించి వారిని బెదిరించారు. డబ్బులు ఇవ్వాలని ప్రేమ జంటను బెదిరించడంతో తమ వద్ద లేవని చెప్పడంతో స్నేహితుడి ద్వారా రూ. 6500 ఫోన్ పే చేయించుకున్నారు. యువకుడి ముందే బాలికపై లక్ష్మణ్, అశోక్ సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఇంటికి వెళ్లిన తరువాత బాలిక జరిగిన విషయం తల్లికి చెప్పడంతో స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు పోక్సో యాక్టు కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.

ఒకప్పుడు రాజ్యాలను పాలించి, యుద్ధరంగాల్లో వీరత్వం ప్రదర్శించి చరిత్రలో స్థానం సంపాదించిన ముదిరాజ్ జాతి, నేడు తన అస్తిత్వంకోసం సంఖ్యాబలంలోనే సింహభాగం కోల్పోతూ విలపిస్తోంది. ‘ముదిరాజ్’ అంటే రాజసం అనే గర్వం రక్తంలో ఉన్నా, వాస్తవ జీవితం పేదరికం, విద్యా విహీనత, ఉద్యోగ వంచన, శ్రమ దోపిడీల మధ్య నలిగిపోతోంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన సమగ్ర కులాలవారీ జనాభా సర్వే (SEEEPC) నివేదిక ఈ సామాజిక విషాదాన్ని అధికారికంగా ధ్రువీకరించింది. రాష్ట్రంలోని 242 కులాలలో అత్యధిక జనాభా సంఖ్యలో ఒకటైన ముదిరాజ్ సమాజం (ముదిరాజ్, ముత్రాసి, తెనుగొల్లు) దాదాపు 26.39 లక్షల మంది (7.4 శాతం) ఉన్నారు. బిసిలలో అతిపెద్ద సమూహం కావడం విశేషం.కానీ, సమ్మిళిత వెనకబాటుతన సూచీ (Composite Backwardness Index CBI)లో వారి స్కోరు 94 పాయింట్లు. రాష్ట్ర సగటు 81 పాయింట్లు అయితే, ఎస్సిలు 96, ఎస్టిలు 95 పాయింట్లతో సమానంగా లేదా దగ్గరగా ఉండటం ఆందోళనకరం. ఈ సూచీ 42 ప్రధాన అంశాల ఆధారంగా తయారైంది. ఇందులో ఎక్కువ స్కోరు ఎక్కువ వెనకబాటుతనాన్ని సూచిస్తుంది. తెలంగాణ కులగణన నివేదిక 135 కులాలు రాష్ట్ర సగటు కంటే ఎక్కువ వెనకబడి ఉన్నట్లు చె









ఢిల్లీ: ఇంట్లో ఎసి పేలడంతో తొమ్మిది మంది మృతి చెందిన సంఘటన ఢిల్లీలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... వివేక్ విహార్లో ఆదివారం వేకువజామున ఎసి పేలడంలో మంటలు వ్యాపించాయి. భారీ ఎత్తున మంటలు చెలరేగడంతో పాటు పొగ ఎక్కువగా రావడంతో ఊపిరాడక తొమ్మిది మంది మృతి చెందారు. స్థానికుల సమాచారం మేరకు సిబ్బంది 12 అగ్నిమాపక యంత్రాలతో ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పేశారు. పోలీసులు తొమ్మిది మృతదేహాలను గుర్తించామని చెప్పారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని స్థానిక మీడియా వెల్లడించారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని వివిధ ఆస్పత్రులకు తరలిస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.


విలనిజం అయినా, క్యారెక్టర్ రోల్ అయినా.. తనదైన పవర్ఫుల్ నటనతో స్క్రీన్పై మ్యాజిక్ చేసే నటి వరలక్ష్మి శరత్కుమార్. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ టాలీవుడ్లో వర్సటైల్ హీరోగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు నవీన్ చంద్ర. ఇప్పుడు వీరిద్దరూ కలిసి ఓ సరికొత్త, భిన్నమైన కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. వీరిద్దరి క్రేజీ కాంబినేషన్లో డైరెక్ట్ సంజీవ్ మేగోటి తెరకెక్కించిన తాజా చిత్రం ‘పోలీస్ కంప్లైంట్’. ఎంఎస్కే ప్రమిద శ్రీ ఫిలిమ్స్ బ్యానర్పై బాలకృష్ణ మహారాణా నిర్మిస్తున్న ఈ మూవీ మే 22న గ్రాండ్గా థియేటర్లలో విడుదల కాబోతోంది. ఈ సినిమాలో మ్రో కీల్క పాత్ల్రో న్టించిన కృష్ణసాయి బర్త్ డే సందర్భంగా అభిమాన నటుడు సూప్ స్టార్ కృష్ణపై ఈ సినిమాలో చేసిన స్పెష్ల్ సాంగ్ను విడుదల చేశారు.ఈ సందర్భంగా దర్శకుడు సంజీవ్ మేగోటి మాట్లాడుతూ ‘ వరలక్ష్మి శరత్కుమార్ , నవీన్ చంద్ర చంద్ర క్రేజీ కాంబినేష్న్ అంద్రిని ఆక్ట్టుకుంటుంది. ’చైన్ రియాక్షన్ ఆఫ్ కర్మ’ అనే కాన్సెప్ట్ ఆధారంగా తెరకెక్కిస్తున్నాం. ఇదొక అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్. దీనికి హారర్ థ్రిల్లర్ అంశాలను జోడించి మునుపెన్నడూ చూడని కొత


నందమూరి నటసింహం బాలకృష్ణ తన కెరీర్ 111వ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. హిట్ దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్న ఈ సినిమా తాజాగా మొదలైంది. అయితే ఈ సినిమాలో బాలయ్య సరసన హీరోయిన్ గా ఎవరు నటిస్తున్నారు అనేది సస్పెన్స్ గా మారింది. మొదట కోలీవుడ్ స్టార్ హీరోయిన్ నయనతార ఈ సినిమా కోసం ఫిక్స్ అయ్యింది కానీ తర్వాత మరో స్టార్ బ్యూటీ కాజల్ అగర్వాల్ పేరు కూడా వచ్చింది. ఇప్పుడు ఫైనల్ గా మేకర్స్ కాజల్ తోనే ముందుకు వెళుతున్నట్టు తెలిసింది. కాజల్ తో మొదటి షెడ్యూల్ కూడా ఇప్పుడు మొదలు కానుండగా ఆమె ఈ షెడ్యూల్ కోసం ఈ నెల మొత్తం కేటాయించిదట.గతంలో ’భగవంత్ కేసరి’లో బాలయ్యతో కలిసి నటించిన కాజల్, మరోసారి ఆయన సరసన నటిస్తోంది.

బెంగళూరు: భార్య మరో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకోవడంతో ఇద్దరు పిల్లలను చంపి అనంతరం భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన కర్నాటక రాష్ట్రం తుమకూరు ప్రాంతంలో కునిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... అలకెరే గ్రామంలో శివణ్ణ, కావ్య అనే దంపతులు నివసిస్తున్నారు. ఈ దంపతులకు జీవన్(10), ప్రణీశ్(05) అనే కుమారులు ఉన్నారు. శివణ్ణ మల్లేశ్వర దేవాలయంలో పూజారిగా ఉంటూ ఓ ఫ్యాక్టరీలో పని చేస్తున్నాడు. ముగనపురా హేమంత్తో కావ్య అక్రమ సంబంధం పెట్టుకుంది. దీంతో దంపతుల మధ్య గత కొన్ని రోజుల నుంచి గొడవలు జరుగుతున్నాయి. ఘర్షణలు తారా స్థాయికి చేరుకోవడంతో కావ్య తన పిల్లలను తీసుకొని పుట్టింటికి కురుడిహళ్లికి వెళ్లిపోయింది. దీంతో శివణ్ణ తన అత్తగారింటికి వెళ్లి పిల్లలను తీసుకొని తన సొంతూరుకు వచ్చాడు. పిల్లలను ఇద్దరిని చంపి అనంతరం అతడు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి భార్యతో సహా ఆమె ప్రియుడును అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.
నవతెలంగాణ-హైదరాబాద్ : హర్మూజ్ జలసంధిపై తమకు పూర్తి నియంత్రణ ఉందని, తమ అనుమతి లేకుండా స్నేహపూర్వక లేదా శత్రు దేశాలకు చెందిన ఏ నౌక కూడా ఆ మార్గం గుండా ప్రయాణించలేదని ఇరాన్ ఆర్మీ స్పష్టం చేసింది. ఈ జలసంధిని నియంత్రించడం తమకు ఉన్న సహజమైన హక్కు అని ఇరాన్ ఆర్మీ ప్రతినిధి మహమ్మద్ అక్రమినియా అన్నారు. ప్రస్తుతం ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC), దేశ సైన్యం సంయుక్తంగా హర్మూజ్ జలసంధిని పూర్తిస్థాయిలో నియంత్రిస్తున్నాయని […] The post అనుమతి లేకుండా ఒక్క నౌక కూడా హర్మూజ్ దాటదు: ఇరాన్ appeared first on Navatelangana.

ఢిల్లీ: భార్య వేధింపులు తట్టుకోలేక జడ్జి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఢిల్లీలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... అమన్ కుమార్ శర్మ(30) అనే వ్యక్తి జిల్లా కోర్టులో ప్రధాన న్యాయమూర్తిగా సేవలందిస్తున్నాడు. అమన్ ఓ యువతిని పెళ్లి చేసుకున్నాడు. అతడి భార్య న్యాయాధికారి కావడం గమనార్హం. దంపతుల మధ్య గత కొన్ని రోజుల నుంచి గొడవలు జరుగుతున్నాయి. కోడలి సోదరి అయిన ఐఎఎస్ అధికారి జోక్యం చేసుకోవడంతో గొడవలు తారాస్థాయికి చేరుకున్నాయి. భార్య, ఆమె సోదరి వేధింపులు తట్టుకోలేక తన కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని అమన్ తండ్రి తెలిపాడు. భార్య వేధింపులు ఎక్కువగా కావడంతో అమన్ ఆత్మహత్యకు ప్రధాన కారణమని అతడు కుటుంబ సభ్యులు ఆరోపణలు చేశారు.
నవతెలంగాణ-హైదరాబాద్ : టెక్సాస్లోని అమరిల్లో నగరంలో కాల్పుల కలకలం చోటుచేసుకుంది. శనివారం తెల్లవారుజామున సుమారు 2 గంటల ప్రాంతంలో వెస్ట్మిన్స్టర్ అపార్ట్మెంట్ కాంప్లెక్స్లో జరుగుతున్న ఒక వేడుక రక్తసిక్తమైంది. అపార్ట్మెంట్లో పార్టీ జరుగుతుండగా గుర్తుతెలియని వ్యక్తులు లోపలికి చొరబడి విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ హింసాత్మక ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానిక నివేదికల ప్రకారం.. డజన్ల కొద్దీ కాల్పులు జరగడంతో ఆ ప్రాంతమంతా భయానక వాతావరణం నెలకొంది. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన […] The post టెక్సాస్లో కాల్పుల కలకలం..ఇద్దరు మృతి! appeared first on Navatelangana.