
1646 వార్తలు

Petrol, Diesel Prices: గ్లోబల్ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరల పెరుగుదల నేపథ్యంలో మున్ముందు దేశవ్యాప్తంగా ధరల పెంపు ఉండే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే ప్రైవేట్ కంపెనీలు ధరలు సవరించగా, ప్రభుత్వ రంగ సంస్థలు కూడా అదే బాటలో నడిచే సూచనలు ఉన్నాయి..

ఓ ఆడియో లాంచ్ కార్యక్రమంలో దర్శకుడు పూరి జగన్నాథ్ హాస్యనటుడు అలీతో తనకున్న దశాబ్దాల అనుబంధాన్ని వివరించారు. కష్టాల్లో తాను ఎదుర్కొన్న ఆర్థిక ఇబ్బందుల సమయంలో అలీ అండగా నిలిచిన విధానాన్ని గుర్తుచేసుకున్నారు. కేవలం సినిమా నటుడిగా కాకుండా, మనుషుల కోసం నిలబడే నిజమైన హీరో అలీ అని పూరి కొనియాడారు.

మనం చాలా సార్లు పోలీస్ అధికారులను చూసుంటాం. అలానే ఆర్మి అధికారులను కూడా చూసి ఉంటాం. కానీ మీరెప్పుడైనా వాళ్ల యూనిఫామ్లపై ఉంటే గుర్తులను గమనించారా? సరిగ్గా గమనిస్తే.. ఈ అధికారుల భుజం వద్ద ఒక తాడు ఉంటుంది. ఇంతకూ యూనిఫామ్కు ఆ తాడు ఎందుకు ఉంటుంది. దాన్ని ఏమంటారు. అది ఏం పనిచేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.

Bank Holidays in May 2026: బ్యాంక్ శాఖలు మూతపడినప్పటికీ.. నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, యూపీఐ (UPI) సేవలు 24 గంటలూ అందుబాటులో ఉంటాయి. ఏదైనా ముఖ్యమైన బ్యాంకు పని ఉంటే చివరి నిమిషం వరకు ఆగకుండా, కనీసం ఒక వారం ముందే పూర్తి చేసుకోవడం..
Punjab Kings Records: ఈ ఏడాది ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్, సన్రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లపై విజయం సాధించింది. కోల్కతా నైట్ రైడర్స్తో జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. దీంతో పంజాబ్ తొలి 6 మ్యాచ్ల నుంచి మొత్తం 11 పాయింట్లు సాధించింది.

TVS Jupiter: తాజా గణాంకాల ప్రకారం, 2026 మార్చి నెలలో మొత్తం 1,24,771 యూనిట్ల TVS Jupiter స్కూటర్లు అమ్ముడయ్యాయి. గత ఏడాది మార్చి 2025లో ఈ సంఖ్య 1,05,834 యూనిట్లుగా ఉండగా, ఈసారి దాదాపు 18,937 యూనిట్లు అదనంగా అమ్ముడవడం గమనార్హం..

నెల రోజుల క్రితం పశ్చిమాసియాలో చెలరేగిన మంటలు ఇప్పుడు తెలుగురాష్ట్రాల సెగలు పుట్టిస్తున్నాయి. అమెరికా- ఇజ్రయెల్- ఇరాన్ యుద్ధం కారణంగా గల్ఫ్ దేశాల నుంచి రావాల్సిన చమురు సరఫరా నిచిలిపోవడంతో భారత్ సహా అనేక దేశాల్లో ఇందన కొతర ఏర్పడింది. అది ఇప్పుడు పతాక స్థాయికి చేరడంతో తెలుగురాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లోని పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. తాజాగా కర్నూలు జిల్లా ఎమ్మిగనూర్లో ఇదే పరిస్థితి నెలకొంది. ఇందనం లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ఓ అంగకుడు రాత్రిపూట కోడి గుడ్ల లోడ్తో వచ్చి కేవలం రూ.2లకే గుడ్డు అమ్ముతున్నట్లు ప్రకటించాడు. దీంతో ఆఫర్ నచ్చిన జనాలు తక్కువ ధరకే గుడ్లు లభిస్తుండటంతో కొనేందుకు ఆసక్తి చూపారు. స్థానికులు ఎగబడిమరీ కొంటుంటే కొందరికి ఎందుకో అనుమానం వచ్చి ఓ గుడ్డును పగలగొట్టి చూశారు..

Gold, Silver Prices: అంతర్జాతీయ పరిణామాలు, డాలర్ విలువపై ఆధారపడి ధరలు రోజులో ఎప్పుడైనా మారవచ్చు. కొనుగోలు చేసే ముందు స్థానిక జ్యువెలరీ షాపులో ఒకసారి సరిచూసుకోవడం మంచిది. గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు ఈరోజు బంగారం కొనాలనుకుంటే హాల్మార్క్ (BIS Hallmark) ఉన్న నగలను

హైవేలపై ప్రయాణించే వాహనదారులకు ఎన్హెచ్ఏఐ అదిరిపోయే శుభవార్త చెప్పింది. హైవేపై పెట్రోల్ బంకులు, హోటల్లు, ఎక్కడున్నాయో తెలుసుకునేందుకు వీలుగా రహదారిపై ప్రత్యేక క్యూఆర్ స్కాన్ బోర్డులను ఏర్పాటు చేయనుంది. జస్ట్ ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే చాలూ అన్ని వివరాలు తెలిసేలా ఏర్పాట్లు చేసింది. కొత్తగా జాతీయ రహదారిపై ప్రయాణించే వారికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది.

ఆరోగ్యంగా ఉండాలన్నా, ఫిట్నెస్ను కాపాడుకోవాలన్నా వ్యాయామం తప్పనిసరి. అయితే చాలామందిలో ఉండే పెద్ద సందేహం ఏంటంటే.. అసలు నడక మంచిదా? లేక పరుగు మంచిదా? అని. మీరు బరువు తగ్గాలనుకుంటున్నారా లేదా గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలనుకుంటున్నారా? మీ గోల్ను బట్టి ఏది బెటరో తెలుస్తుంది.

రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీజీ పాలిసెట్-2026 దరఖాస్తు గడువు ఈ రోజుతో (ఏప్రిల్ 20) ముగియనుంది. పాలిసెట్కు ఇంకా దరఖాస్తు చేసుకోని విద్యార్థులు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా ఏప్రిల్ 20 ముగింపు గడువులోపు తమ దరఖాస్తులను సమర్పించాలని..

ఈ పాట మొదలైన క్షణం నుంచే ఒక ప్రశాంతమైన భావన మనసులోకి జారుకుంటుంది. ప్రేమ అంటే గోల కాదు.. అది ఓ నిశ్శబ్దమైన అనుభూతి అని చెప్పినట్టు ఉంటుంది. ప్రతి లైన్లో ఒక సాఫ్ట్ ఎమోషన్.. ప్రతి నోట్లో ఒక సున్నితమైన ఫీలింగ్.

మన దేశంలో ఫర్నీచర్ వ్యాపారం వేగంగా అభివృద్ధి చెందుతోంది. గృహ, ఆఫీసు నిర్మాణాల పెరుగుదలతో డిమాండ్ అధికంగా ఉంది. రూ.5-20 లక్షల పెట్టుబడితో ప్రారంభించవచ్చు, ఆన్లైన్ విక్రయాలు కీలక పాత్ర పోషిస్తాయి. 20-40 శాతం లాభాల మార్జిన్తో ఇది స్థిరమైన ఆదాయ వనరుగా మారే అవకాశం ఉంది.

రైతన్నలకు రేవంత్ సర్కార్ మరో శుభవార్త చెప్పనుంది. పెట్టుబడి సాయం కింద అందిస్తున్న రైతు భరోసా రెండో విడత నిధులను ఇవాళ ప్రభుత్వం విడుదల చేయనుంది.భూపాలపల్లి జిల్లా కాటారంలో జరిగే బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి బటన్ నొక్కి ఈ నిధులను విడుదల చేయనున్నారు. రెండో విడతలో మొత్తం 45లక్షల మంది రైతుల ఖాతాల్లో సుమారు రూ.5,653 కోట్లను జమ చేయనున్నారు.

భార్య భర్తల మధ్య కీచులాటలు షరా మామూలే. ఎడ్డెమంటే తెడ్డెమనే ధోరని గొడవలకు కారణమవుతుంటాయి. సర్దుకుపోయేతత్వం ఏ ఒక్కరికీ లోపించినా ఆ కాపురం ఆల్లకల్లోలమే. తాజాగా ఓ జంట గొడవపడ్డారు. అందుకు కారణం వంటింట్లో స్టౌపై పెట్టిన పాలు పొంగడం. అంతే.. గొడవ మొదలైంది. కోపంతో ఊగిపోయిన భర్త ఇంట్లోకి వెళ్లి ఫ్యాన్ కు ఉరిపెట్టుకున్నాడు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

ఎయిర్ కూలర్లో కనిపించిన బుజ్జి వుల్ఫ్ స్నేక్ కథ ఇది. వేసవిలో కూలర్ను సర్వీసింగ్ చేసే క్రమంలో పామును గుర్తించారు. ఇది విషరహితమైనప్పటికీ, సాధారణంగా కట్లపాముగా భావిస్తుంటారు. ఇలాంటి పాములు కనిపించినప్పుడు వెంటనే స్నేక్ క్యాచర్స్కు సమాచారం ఇవ్వాలి .. ..

Car Loan: మీరు కారు లోన్ కోసం చూస్తున్నట్లయితే తక్కువ వడ్డీకి అందించే బ్యాంకులు కూడా ఉన్నాయి. అది కూడా మీరు రూ.5 లక్షల వరకు కారు లోన్ తీసుకుంటే నెలకు ఎంత ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది? పూర్తి వివరాలు తెలుసుకుందాం.

ఉద్యోగం కోల్పోయినా లేదా విరామం తీసుకున్నా పీఎఫ్ వడ్డీ ఆగదని చాలామందికి తెలియదు. మీ ఈపీఎఫ్ ఖాతాలో కొత్త చెల్లింపులు లేకున్నా, జమ అయిన డబ్బుపై వడ్డీ కొనసాగుతుంది. ఇది చక్రవడ్డీతో వృద్ధి చెందుతుంది. అత్యవసరమైతే తప్ప వెంటనే విత్డ్రా చేయకూడదు. 58 ఏళ్ల వరకు వడ్డీ లభిస్తుంది.

హైదరాబాద్లోని మెట్రో ప్రయాణికులకు ప్రభుత్వం త్వరలోనే అదిరిపోయే గుడ్న్యూస్ చెప్పే అవకాశం ఉంది. ఎందుకంటే ఇకపై తెల్లవారుజామున 5 గంటల నుంచే ప్రయాణికులకు మెట్రో సేవలను అందుబాటులోకి తీసుకురానున్నట్టు తెలుస్తోంది. ప్రయాణికుల అవసరాల దృష్యా 5గంటల నుంచే మెట్రోలను నడపాలని దక్షిణమధ్య రైల్వే జీఎం సంజయ్ కుమారు తాజాగా తెలంగాణ సీఎస్కు విజ్ఞప్తి చేశారు. ఆయన దీనిని పరిశీలించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

JEE Main 2026 Session 2 Score Card Download: జేఈఈ మెయిన్ 2026 సెషన్ 2 ఫలితాలు ఈ రోజు (ఏప్రిల్ 20న) విడుదల కానున్నాయి. ఈ మేరకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసింది. తొలుత జేఈఈ మెయిన్ పేపర్ 1 ఫలితాలు వెల్లించనుంది. ఈ పరీక్షకు సంబంధించిన స్కోర్కార్డు సోమవారం అధికారిక వెబ్సైట్లో అందుబాటులో..

ప్రతి బంధం ప్రారంభంలో చాలా జంటలు తమ బంధం గురించి పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకుంటారు. అస్సలు గొడవ పడకూడదని, ఎప్పుడూ ఒకరినొకరు అర్థం చేసుకోవాలని, పర్ఫెక్ట్ పార్టనర్స్గా ఉండాలని కోరుకుంటారు. కానీ వాస్తవం ఏమిటంటే, ప్రపంచంలో పర్ఫెక్ట్ రిలేషన్ షిప్స్ ఉండవు. మీ బంధం మరింత ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలంటే పరిపూర్ణత కోసం కాకుండా, ఎదుగుదల కోసం ప్రయత్నించాలి.

ప్రస్తుత కాలంలో బంధాల విషయంలో ఒక కొత్త ట్రెండ్ వినిపిస్తోంది, అదే 'సిట్యుయేషన్షిప్' . ఇద్దరు వ్యక్తులు జంటలాగే ఉంటారు కానీ, వారి మధ్య ఎటువంటి క్లారిటీ ఉండదు, బాధ్యత ఉండదు, కనీసం ఒక పేరు కూడా ఉండదు. ఇది మొదట్లో ఎంతో ఉత్సాహంగా అనిపించినా, కాలక్రమేణా తీవ్రమైన అయోమయం, మానసిక అలసట ఇంకా ఒత్తిడికి దారితీస్తుంది. అందుకే ఈ ఏడాది చాలా మంది సింగిల్స్ ఇటువంటి అస్పష్టమైన బంధాల నుండి బయటకు వచ్చి 'సెల్ఫ్ రిఫ్లెక్షన్' (స్వయం సమీక్ష) వైపు అడుగులు వేస్తున్నారు.