శ్రీవారి సన్నిధిలో తలనీలాలు అర్పించి మొక్కులు తీర్చుకోవడం భక్తులకు తెలిసిన నిలువు దోపిడీ. కానీ, ఇప్పుడు కలియుగ దైవాన్ని దర్శించుకోవాలన్న తపనతో వచ్చే భక్తులు.. విమాన మెట్లెక్కకముందే ఆర్థికంగా నిలువు దోపిడీకి గురవుతున్నారు. కళ్లలో స్వామివారి రూపం ఉన్నా.. జేబులు గుల్ల చేస్తున్న విమాన చార్జీలు భక్తుల కళ్లలో నీళ్లు తెప్పిస్తున్నాయి.