సీఎం రేవంత్ రెడ్డి.. భూపాలపల్లి జిల్లాలో పర్యటిస్తున్నారు. కాళేశ్వరం చేరుకున్నారు సీఎం రేవంత్.. ముందుగా కాళేశ్వర ముక్తేశ్వరస్వామిని దర్శించుకున్నారు. అక్కడ్నుంచి మేడిగడ్డకు చేరుకుని మేడిగడ్డ బ్యారేజ్‌ని పరిశీలించారు. అక్కడే ఇరిగేషన్‌ అధికారులతో సమీక్ష నిర్వహించి.. ప్రాజెక్ట్ మరమ్మత్తు పనులపై చర్చించారు. ఆ తరువాత కాటారం మండలం నస్తూర్‌పల్లి వేదికగా రెండో విడత రైతు భరోసా నిధులు విడుదల చేస్తారు సీఎం రేవంత్.. ఈ సందర్భంగా అక్కడ జరిగే బహిరంగ సభలో మాట్లాడనున్నారు.