24815 articles


చిన్న నీటిపారుదల రంగంలో చేపట్టాల్సిన సంస్కరణలు, చెరువుల పరిరక్షణ, నీటి వనరుల సమర్థ వినియోగంపై ప్రభుత్వానికి రైతు కమిషన్ పలు కీలక సూచనలు చేసింది. రాష్ట్రంలో చెరువుల పునరుద్ధరణ, చిన్న నీటిపారుదల వ్యవస్థను బలోపేతం చేయడం ద్వారా నీటి భద్రత, వ్యవసాయ స్థిరీకరణ, గ్రామీణ జీవనోపాధులను మెరుగుపరచవచ్చని వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ పేర్కొంది. నీటి వినియోగ సామర్థ్యాన్ని పెంచే సాంకేతిక యూనిట్లతో ప్రత్యేక చిన్న నీటిపారుదల వ్యవస్థను తిరిగి ఏర్పాటు చేయాలని కమిషన్ సూచించింది. చిన్న, పెద్ద నీటిపారుదల వనరులను అనుసంధానం చేస్తూ కమాండ్ ఏరియా ఆధారిత నిర్వహణ వ్యవస్థలను ఏర్పాటు చేయాలని నివేదికలో పేర్కొంది. చెరువుల పరిరక్షణ కోసం ప్రత్యేకంగా చిన్న నీటిపారుదల చట్టాన్ని రూపొందించాల్సిన అవసరం ఉందని కమిషన్ తెలిపింది. చెరువుల పుల్ ట్యాంక్ లెవల్ (ఎఫ్టిఎల్) సరిహద్దులను తక్షణమే గుర్తించి, ఆక్రమణలను తొలగించి చెరువులను పరిరక్షించాలని ప్రభుత్వానికి సూచించింది. రాష్ట్రంలో నీటి భద్రతతో పాటు వ్యవసాయాన్ని స్థిరీకరించేందుకు, గ్రామీణ ప్రాంతాల్లో జీవనోపాధులను మెరుగుపరిచేందుకు చెరువుల పునరుద్ధరణ అత్యంత కీలకమని కమిషన్ అభిప్రాయపడింది

తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ మండలం దోసకాయలపల్లి గ్రామంలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ శాఖ (జీఎస్ హెచ్) హాస్టల్లో సుమారు 40 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. విద్యార్థులు ఉదయం టిఫిన్గా బజ్జీలు తిన్న తర్వాత వాంతులు, కడుపునొప్పి, విరేచనాల లక్షణాలతో తీవ్ర ఇబ్బంది పడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే అధికారులు హాస్టల్లోనే విద్యార్థులకు ప్రాథమిక చికిత్స అందించారు. మెరుగైన వైద్యం కోసం కొందరు విద్యార్థులను రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.


కీవ్: ఉక్రెయిన్ రాజధాని కీవ్కు సమీపంలోని బుచ్ జిల్లాపై రష్యా జరిపిన దాడిలో కనీసం 37 మంది మృతి చెందినట్టు అధికారులు శనివారంనాడు తెలిపారు. ఈ దాడిలో కనీసం 50 నివాస భవనాలు దెబ్బతిన్నాయని, భారీగా మంటలు చెలరేగి ఇళ్లు, ఓ రెస్టారెంట్కు వ్యాపించాయని స్థానిక ప్రాంతీయ సైనిక పరిపాలన అధిపతి టిముర్ త్కాచెంకో తెలిపారు. శుక్రవరాం రాత్రి 8 గంటల తర్వాత ఈ దాడి జరిగినట్టు అధికారులు చెబుతున్నరు. దాడి ఘటనను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఒక ప్రకటనలో ధ్రువీకరించారు. మైలా గ్రామంలోని ఓ గోదాముపై దాడి జరిగిందని, అనంతరం అక్కడ భారీ పేలుడు చోటుచేసుకుందని చెప్పారు. గోదాము గురించి పూర్తి వివరాలను ఆయన వెల్లడించనప్పటికీ ఇళ్లు, ఇతర నివాస ప్రాంతాలకు సమీపంలో మందుగుండు సామగ్రిని నిల్వ చేయకూడదనే నిబంధనలు అమల్లో ఉన్నట్టు చెప్పారు. రష్యా దాడిలో వృద్ధులు, వికలాంగుల కోసం నిర్వహిస్తున్న సంరక్షణ కేంద్రం, నివాస భవనాలు దెబ్బతిన్నాయని, ఇప్పటికే 370 మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు తెలిపారు.కాగా, రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ దీనిపై మాట్లాడుతూ, మైలా ప్రాంతంలోని గోదాములు దీర్ఘశ్రేణి డ్రోన్లకు సంబంధించిన విడిభాగాలు,




మధ్య నేపాల్లోని పలు గ్రామాల్లో వరదల తీవ్రత స్పష్టంగా కనిపిస్తోంది. కొన్ని చోట్ల భవనాలు అడుగుల మేర బురదలో కూరుకుపోయాయి. వాహనాలు సగం వరకు మునిగిపోయాయి. రహదారులు, ఇతర మౌలిక సదుపాయాలు నీరు, శిథిలాల ప్రవాహంలో కొట్టుకుపోయాయి.ప్రాణాలతో బయటపడిన వారికి ఇప్పుడు ముందున్న తక్షణ సవాళ్లు- తలదాచుకునేందుకు సురక్షిత స్థలం వెతుక్కోవడం, వైద్యసాయం పొందడం, శిథిలాల్లో నుంచి తమకు ఉపయోగపడే వస్తువులను వెలికితీయడం. నువాకోట్ జిల్లాలోని దేవీఘాట్ గ్రామంలో ప్రజలు దట్టమైన బురద, శిథిలాల మధ్య తమ వస్తువుల కోసం వెతుకుతున్నారు. ధ్వంసమైన ఇళ్లు, నేలకూలిన విద్యుత్ స్తంభాలు, బురదలో కూరుకుపోయిన వాహనాలు కనిపిస్తున్నాయి.


రాష్ట్రంలో ఎప్సెట్ కౌన్సెలింగ్లో భాగంగా ఇంటర్ బైపిసి విద్యార్థులకు ఫార్మసీ కళాశాలల్లో ప్రవేశాలకు సంబంధించిన కౌన్సెలింగ్ షెడ్యుల్ విడుదలయ్యింది. రెండు విడతల్లో ప్రవేశాల ప్రక్రియ నిర్వహించనున్నారు. మొదటి విడత కౌన్సెలింగ్లో భాగంగా సెప్టెంబర్ 12 నుంచి 16 వరకు ఆన్లైన్ స్లాట్ బుకింగ్కు అవకాశం కల్పించారు. 15 నుంచి 17 వరకు మొదటి సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించనునున్నట్లు ఎప్సెట్ ప్రవేశాల కమిటీ కన్వీనర్ శ్రీదేవసేన తెలిపారు. సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తి చేసుకున్న విద్యార్థులు వచ్చే నెల 16 నుంచి 18 వరకు వెబ్ ఆప్షన్ల నమోదు చేసుకోవాల్సి ఉంటుందని అన్నారు. సెప్టెంబర్ 21వ తేదీన మొదటి విడత సీట్లు కేటాయించనున్నట్లు వెల్లడించారు. సీట్లు పొందిన విద్యార్థులు సెప్టెంబర్ 21,22 తేదీలలో ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలని పేర్కొన్నారు. రెండో విడత కౌన్సెలింగ్ సెప్టెంబర్ 25 నుంచి మొదలవుతుంది. వచ్చే నెల 25న సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించి 26,27 తేదీలలో వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశం కల్పించారు. సెప్టెంబర్ 29న రెండో విడత ఇంజినీరింగ్ సీట్ల కేటాయించనున్నారు. సీట్లు పొందిన విద్యార్థులు ఆన్లైన్ రిపోర్టిం

హైదరాబాద్: ‘మొగలిరేకులు’ సీరియల్తో నటిగా పరిచయమై మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి శిరీష. ఆమె ఇటీవల మళ్లీ పెళ్లి చేసుకున్నారు. యాంకర్ కమ్ నటుడు మహేంద్రతో కొత్త జీవితం ప్రారంభించారు. ఈ శుభవార్తని ఆమె సోషల్మీడియా ద్వారా పంచుకున్నారు. గత కొన్నిరోజులుగా వీళ్ల వివాహం గురించి రూమర్స్ వచ్చాయి. ఇవి నిజమా కాదా అని అంతా అనుకునేలోపు వీళ్లిద్దరు ఒకటయ్యారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పుట్టి పెరిగిన శిరీషకు ఇద్దరు అక్కా చెల్లెళ్లు. వీరు కూడా సీరియల్స్ చేశారు. కానీ శిరీష అక్కలను మించి క్రేజ్ అందుకుంది. మొగలిరేకులు తర్వాత రాములమ్మ, స్వాతి చినుకులు, మనసు మమత, చెల్లెలి కాపురం, కలవారి కోడలు కనకమహాలక్ష్మి, త్రిశూలం తదితర సీరియల్స్లోనూ నటించారు. గతంలోఈమె నవీన్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకోగా వీళ్లకు కొడుకు పుట్టాడు. కానీ, రెండేళ్ల క్రితం తన భర్తతో విడిపోతున్నట్లు శిరీష ప్రకటించారు. శిరీష వివాహం చేసుకున్న మహేంద్ర విషయానికొస్తే ఆర్జెగా కెరీర్ ప్రారంభించాడు. ఆ తర్వాత ‘ఇంటింటి రామాయణం’, ‘మగువ ఓ మగువ’ సీరియల్స్లో సహాయ పాత్రలు చేశాడు.

హైదరాబాద్ః 22ఏ జీవోపై రాష్ట్ర శాసనమండలి (కౌన్సిల్) చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. 22ఏను రద్దు చేయాలని గుత్తా సుఖేందర్ అన్నారు. శనివారం మీడియా ప్రతినిధులతో ఆయన ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ.. 22ఏ బిఆర్ఎస్ హయాంలోనూ ఉందన్నారు. ఉచితాలు కూడా తగ్గించాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. అర్హులైన లబ్ధిదారులకు పథకాలు కొనసాగించాలని ఆయన సూచించారు. తాను గతంలో బిపిఎల్, ఏపిఎల్పై సూచనలు చేశానని.. అయితే ఎవరూ పట్టించుకోలేదని గుత్తా చెప్పారు. ఉద్యమకారులకు న్యాయం చేయాలని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు జి. చిన్నా రెడ్డి బహిరంగంగా మాట్లాడకుంటే ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. యువకుడు, ఉత్సాహవంతుడైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అందరూ సహకరించాలని, ప్రతినిత్యం ఏదో రకమైన ఆటంకాలు ఎదురైతే చికాకు కలుగుతుంది కాబట్టి సిఎంను పని చేయనీయాలని గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు.

ఖాట్మండూ: ఒకవైపు నేపాల్ దేశాన్ని వరదలు అతలాకుతలంగా చేయగా, మరోవైపు సందిట్లో సడేమియా అన్నట్టు కొందరు దీన్ని అవకాశంగా చేసుకుని దొరికిన వస్తువులను దొరికినట్టు చక్కబెట్టేస్తున్నారు. తాజాగా వరదల ఉద్ధృతికి కొట్టుకువచ్చిన ఒక బ్యాంకు సేఫ్టీ లాకర్ను స్థానికులు కొందరు పగలగొట్టి అందులోని భారీ మొత్తంలో నగదును అపహరించారు. ఇందుకు పాల్పడిన 29 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి రూ.92 లక్షల పైచిలుకు నేపాలీ రూపాయలను (భారత కరెన్సీలో సుమారు రూ.57 లక్షలు) స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం, రసువా జిల్లాలోని భోటేకోషి ప్రాంతంలో సంభవించిన వరద ఉద్ధృతికి ఒక బ్యాంకుకు చెందిన సేఫ్టీ లాకర్ కొట్టుకుపోయింది. దాధింగ్లోని గల్చీ గ్రామీణ మున్సిపాలిటీ 4వ వార్డులోని బెల్ఖుఖోలాలో ఈ సేఫ్ లభించింది. స్థానికులు కొందరు సేఫ్ను పగులగొట్టి నగదును పంచుకున్నట్టు సమాచారం అందడంతో పోలీసలు రంగప్రవేశం చేసారు. ప్రాథమిక విచారణ అనంతరం సోదాలు జరిపిన నగదును స్వాధీనం చేసుకున్నారు. అదుపులోనికి తీసుకున్న వారిలో ఎక్కువమంది గల్చీ-4లోని మస్తర్ ప్రాంతానికి చెందిన వారున్నారు. వీరి వయసు 19 నుంచి 49 సంవత్సరాల మధ్య ఉంది. క



అమరావతి: వైద్యవిద్య కోర్పుల ఫీజులను ఎపి ప్రభుత్వం ప్రకటించింది. ఎంబిబిఎస్, బిడిఎస్ కోర్సుల ఫీజులను 10 శాతం పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పిజి కోర్సుల ఫీజును 15 శాతం పెంచింది. ఈ మేరకు ఎపి వైద్యారోగ్యశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 2026-27 ఏడాదికి పెంచిన ఫీజులు వర్తించనున్నాయి. ఎంబిబిఎస్ కన్వీనర్ కోటా ఫీజు రూ.18,150, మేనేజ్మెంట్ కోటా రూ.14.52 లక్షలు, ఎన్నారై కోటా రూ.43.56 లక్షలుగా ఉండనుంది. ఇక బిడిఎస్ కన్వీనర్ కోటా రూ.15,730, మేనేజ్మెంట్ కోటా రూ.4.84 లక్షలు, ఎన్నారై కోటా రూ.14.52 లక్షలుగా ఉండనుంది. వైద్య విద్య పిజి కోర్సుల కన్వీనర్ కోటా రూ.5.71 లక్షలు, మేనేజ్మెంట్ కోటా రూ.11.42 లక్షలు, ఎన్నారై కోటా రూ.66.12 లక్షలుగా ఉండనుంది. సూపర్ స్పెషాలిటీ కోర్సుల ఫీజు రూ.19.38 లక్షలుగా ఉండనుంది.

ఖాట్మండూ: నేపాల్ భీకర వరదల్లో మృతుల సంఖ్య శనివారం 626కు చేరింది. ఇప్పటి వరకూ 2,500 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించగా, 2,400 మందికి పైగా గల్లంతైనట్టు అధికారులు తెలిపారు. వీలైనంత మందిని రక్షించేందుకు యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. నేపాల్-టిబెట్ సరిహద్దు సమీపంలో గత బుధవారం హిమనదం కూలిపోవడంతో మంచు, రాళ్లు భారీగా విరుచుకుపడి, వరద నీరు, బురద, శిథిలాలు దిగువ ప్రాంతాలకు దూసుకెళ్లడంతో మధ్య నేపాల్లో దారుణ విధ్వంసం చోటుచేసుకుంది. ఊళ్లకు ఊళ్లు, వాహనాలు, రహదారులు, వంతనలు కొట్టుకుపోయాయి. జలవిద్యుత్ ప్రాజెక్టులు దెబ్బతిన్నాయి.నేషనల్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ అండ్ మేనేజిమెంట్ అథారిటీ తాజా గణాంకాల ప్రకారం నేపాల్లో 626 మంది మృతి చెందారు. చైనా వైపు ఏడుగురు మరణించినట్టు టిబెట్ ఎమర్జెన్సీ మేనేజిమెంట్ డిపార్ె్ట్మంట్ వెల్లడించింది. 5,000 మంది నేపాల్ సైనికులు సహా 11,000 మంది భద్రతా సిబ్బంది గాలింపు, సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. నేపాల్ ఆర్మీ ప్రజాసంబంధాల డైరెక్టరేట్ ప్రకారం, ఇప్పటి వరకూ 2,465 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వీరిలో 163 మంది విదేశీయులు ఉన్నారు. ఈ విదేశీయుల్లో 113 మం


కోల్కతా: పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై కోల్కతా పోలీసులు కేసు నమోదు చేశారు. శుక్రవారం (ఆగస్టు 28) జరిగిన తృణమూల్ ఛత్ర పరిషత్ (TMCP) ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమంలో హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించినందుకు మమతాతోపాటు టిఎంసి సమావేశ నిర్వాహకులపై హేస్టింగ్స్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ (FIR) నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. "కోర్టు ఆదేశాలను ఉల్లంఘించినట్లు ఆరోపిస్తూ ఈ ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగిందని... ఈ ఉల్లంఘనకు పాల్పడిన వారందరి పాత్రను దర్యాప్తు సమయంలో పరిశీలిస్తాము" అని పేర్కొన్నారు.కాగా, అంతకుముందు శుక్రవారం, కోల్కతాలోని కామాక్ స్ట్రీట్లోని పార్టీకి చెందిన 'అనధికార' బిల్ బోర్డు విషయంలో చర్యలు తీసుకుంటున్న పోలీసులపై దాడి చేసి, వారి విధులకు ఆటంకం కలిగించినందుకు టిఎంసి నాయకులు అభిషేక్ బెనర్జీ, డెరెక్ ఓ'బ్రియన్, ఇతరులపై పోలీసులు కేసు నమోదు చేశారు.


