24410 articles

ప్రతి ఏటా 5 బిలియన్ డాలర్ల ద్వైపాక్షిక వాణిజ్యం గనుల తవ్వకం, రక్షణ, వ్యవసాయ, ఔషధ, డిజిటల్ రంగాల్లో విస్తృత సహకారం భారత్ ఉజ్బెకిస్తాన్ మధ్య కీలక ఒప్పందాలు ద్వైపాక్షిక బంధం బలోపేతానికి నిర్ణయం ప్రధాని మోడీకి ఉజ్బెకిస్తాన్ అత్యున్నత పురస్కారం ప్రదానం కిర్గిజిస్తాన్ చేరుకున్న ప్రధాని నేడు, రేపు ఎస్సిఓ శిఖరాగ్ర సదస్సుతాష్కెంట్: భారత్ ఉజ్బెకిస్థాన్ తమ ద్వైపాక్షిక సంబంధాలను సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి పెంచాలని ఆదివారం నిర్ణయించాయి. అలాగే 2030 నాటికి ఏటా 5 బిలియన్ డాలర్ల ద్వైపాక్షిక వాణిజ్యాన్ని సాధించాలనే లక్ష్యాన్ని ని ర్దేశించుకున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఉజ్బెకిస్థాన్ అధ్యక్షుడు షవ్కత్ మిర్జియోయెవ్ మ ధ్య జరిగిన చర్చల అనంతరం ఈ నిర్ణయాలు వె లువడ్డాయి. పౌర అణు ఇంధన రంగంలో సహకారానికి అనుగుణంగా.. ఉజ్బెకిస్థాన్ నుంచి భా రత్కు దీర్ఘకాలికంగా యురేనియం సరఫరా చేసే లా ఒక వ్యవస్థను ఏర్పాటు చేయడానికి కూడా ఇరు దేశాలు అంగీకరించాయి. మోదీమిర్జియోయెవ్ చర్చల్లో వాణిజ్యం, పెట్టుబడులు, మౌలిక సదుపాయాలు, కీలక ఖనిజాలు, గనుల తవ్వకం, రక్షణ, భద్రత, వ్యవసాయం, ఔషధాలు, ఆరోగ్యం, సమాచార సాంక

తెలంగాణలో భారీ వర్షాలు: బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి, ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా నేడు (సోమవారం) మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆదిలాబాద్, కొమురం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు పడతాయని, మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు జల్లులు కురవొచ్చని పేర్కొంది. హైదరాబాద్లో సాయంత్రం వేళల్లో వర్షాలు పడే అవకాశం ఉందంది. The post తెలంగాణలో నేడు భారీ వర్షాలు appeared first on Navatelangana.




భారత్లో వాళ్లు ఉండొద్దు అనుకునే వాళ్లు హిందువే కాదు దేశం అన్ని మతాలు, వర్గాలకు చెందింది సేవా కార్యక్రమాల్లో మేం ఎవరిపట్లా వివక్ష చూపం న్యూయార్క్ మాడిసన్ స్కేర్ ప్రసంగంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ వ్యాఖ్యలున్యూయార్క్: భారత్లో ముస్లింలు ఉండకూడదని భావించే వాళ్లు హిందువులే కాదని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. వాళ్లు లేకుండా హిందూ రాజ్యమే లేదు అని అన్నా రు. న్యూయార్క్లోని మాడిసన్ స్వేర్ గార్డెన్లో శనివారం జరిగిన ‘వన్ వరల్డ్: వన్ హ్యుమానిటీ ఫెయిత్ లీడర్స్ సమ్మిట్’ లో ఆయన ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్లో అన్ని మతాలు, వర్గాలకు చెందిన ప్రజలు కలిసి జీవిస్తున్నారని భగవత్ పేర్కొన్నారు. సంప్రదాయబద్ధంగా భారత్ అందరికీ ఆశ్రయం కల్పించిందని చెప్పారు. ప్రపంచంలో సురక్షితమైన ప్రదేశం దొరకని వారు భారత్కు వచ్చి ఇక్కడ తమకంటూ స్థానం ఏర్పరచుకున్నారని వివరించారు. ప్రపంచ మానవాళి అంతా ఒక్కటేనన్న జ్ఞానం తమకు ఉందని, వైవిధ్యాలు ఉన్నప్పటికీ మనమంతా ఒక్కటేననే విషయాన్ని ప్రపంచవ్యాప్తంగా అందరికీ చెప్పడం బాధ్యతగా భావిస్తున్నాం అన్నారు. ‘మీరు హిందూ సంస్థ. హిందూ రాష్ట్రం గురించి మాట్లాడుతున్నారు. మ


రాష్ట్రంలో రేవంత్ సర్కార్ కొలువుదీరి రేపటికి వెయ్యి రోజులు కొత్త బాటలో సంక్షేమం, సామాజిక న్యాయం పెట్టుబడులు, మౌలిక వసతులపై ప్రభుత్వం దృష్టి రైతులు, మహిళలు, యువతకు ప్రాధాన్యం రూ.5.75లక్షల కోట్ల పెట్టుబడి ఒప్పందాలు వైద్య రంగంలో విస్తరణ హైదరాబాద్ కేంద్రంగా భారీ అభివృద్ధి ప్రణాళికలు 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థే లక్షం రాష్ట్ర ప్రభుత్వం ప్రకటనమన తెలంగాణ/హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సా రథ్యంలో ప్రజా ప్రభుత్వం సెప్టెంబర్1వ తేదీ నాటికి విజయవంతంగా వెయ్యి రోజుల పాలనను పూర్తి చేసుకుంది. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలనను పునర్నిర్మించడం, సం క్షేమాన్ని విస్తరించడం, సామాజిక న్యాయానికి ప్రాధాన్యం ఇ వ్వడం, రైతులు-,మహిళలు, -యువతకు భరోసా కల్పించడం, పెట్టుబడులను ఆకర్షించడం, ప్రపంచస్థాయి మౌలిక వసతుల నిర్మాణంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ కాలంలో చేపట్టిన వివిధ కార్యక్రమాలతో తెలంగాణ అభివృద్ధికి కొత్త దిశ ఏర్పడిందని ప్రభుత్వం ఒక ప్రకటనలో పేర్కొంది. రూ.4.18 లక్షల తలసరి ఆదాయం 2025- 26లో తెలంగాణ తలసరి ఆదాయం రూ.4,18,931కు చేరిందని ప్రభుత్వం పేర్కొంది. దేశ

ఇంటికి రాలేక.. శిబిరాల్లో ఉండలేక నేపాలీల యాతన తాత్కాలిక శిబిరాల్లో సౌకర్యాల లేమి మళ్లీ వరద హెచ్చరికలతో నిత్యావసరాలతో ఎత్తైన ప్రాంతాలకు తరలుతున్న ప్రజలు 788కి చేరిన మృతుల సంఖ్య గుర్తుపట్టలేని స్థితిలో మృతదేహాలు డిఎన్ఏ నమూనాలు సేకరించి సామూహిక ఖననాలు ఇప్పటికీ జాడలేని 300 మందికిపైగా భారతీయులు జలవిద్యుత్ ప్రాజెక్టుల్లో చిక్కుకున్న 500 మంది కార్మికులు రక్షించేందుకు నిపుణుల సాయంతో చర్యలు 3 రోజుల తరువాత శిథిలాల్లోంచి బయటపడ్డ ఆరేళ్ల బాలికఖాట్మండూ: నేపాల్లో ఆకస్మిక వరదల ప్రభా వం ఇంకా కొనసాగుతోంది. ఈ విపత్తులో మృతుల సంఖ్య ఆదివారంనాడు 788కి చేరిం ది. మరో 2,502 మంది గల్లంతయ్యారు. వీరి లో 320 మంది విదేశీయులు ఉన్నారు. భోటెకోషి నదిలో నీటిమట్టం మరోసారి పెరిగినట్లు నేపాల్ విపత్తుల విభాగం హెచ్చరించింది. ‘వరద ప్రభావిత భోటెకోషి నదిలో నీటిమట్టం కొంత మేర పెరిగింది. సంబంధిత అధికారు లు, ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవా లి‘ అని పేర్కొంది. మరింత సమాచారం అంది న తర్వాత పరిస్థితిపై తాజా వివరాలు వెల్లడిస్తామని తెలిపింది. మరోవైపు నేపాల్ వరదల నేపథ్యంలో 275 మందికిపైగా భారతీయులు, భారత సంతతికి చెందిన

రూ.500 కోట్ల భూమిని రూ.87కోట్లకే కట్టబెట్టే కుట్ర ప్రభుత్వ సంస్థ ఆయిల్ ఫెడ్ అదే మొత్తం చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నా.. ప్రైవేట్ వ్యక్తులకు ఇస్తున్నారు ఖరీదైన ప్రభుత్వ భూములను కమీషన్ల కోసం కారుచౌకగా అప్పగిస్తారా? మీ ప్రభుత్వం రియల్ ఎస్టేట్ ఏజెన్సీగా మారిపోయింది సిఎం రేవంత్కు బిఆర్ఎస్ నేత హరీశ్ బహిరంగ లేఖమన తెలంగాణ/హైదరాబాద్: నగరం నడిబొడ్డు న మరో భారీ భూ కుంభకోణానికి కాంగ్రెస్ సర్కా ర్ తెరలేపిందని మాజీ మంత్రి, బిఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీష్రావు సంచలన ఆరోపణలు చేశారు. ఆర్టిసి క్రాస్ రోడ్, అజామాబాద్లో తె లంగాణ ఆయిల్ఫెడ్కు చెందిన రూ.500 కోట్ల వి లువైన ప్రభుత్వ భూములను రేవంత్ సర్కార్ కేవలం రూ.87 కోట్లకే ఓ ప్రైవేట్ వ్యక్తికి కట్టబెట్టే భారీ కుట్ర పన్నుతోందని ఆరోపించారు. ఈ మేర కు ఆదివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హరీష్రావు బహిరంగ లేఖ రాశారు. నగరం నడిబొడ్డున ఉన్న ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టడానికి ప్రభుత్వం సిద్ధమైందని ఆయన లేఖలో పేర్కొన్నారు. కాంగ్రెస్ తన నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని లేకుంటే తాము పోరాటానికి దిగుతామని హెచ్చరించారు. దశాబ్దాలుగా ప్రభ

మన తెలంగాణ/వికారాబాద్ బ్యూరో: బుల్లెట్ ట్రైన్ల రాకతో తెలంగాణ గేమ్ చేం జర్గా మారబోతుందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్రెడ్డి అన్నారు. ఆదివారం వికారాబాద్ రైల్వే స్టేషన్ పనులను పరిశీలించారు. అంతకుముందు చే వెళ్లలో నేషనల్ హైవే పనులను పురోగతిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం వికారాబాద్లో విలేకరుల సమావేశంలో మా ట్లాడారు. తెలంగాణలో రైల్వే నెట్వర్క్ను మరింత విస్తరించి ఆధునికీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు. తెలంగాణలో 42 రైల్వే స్టేషన్లను ఏకకాలంలో అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. తాండూరు, వికారాబాద్, నాంపల్లి, సికింద్రాబాద్, మౌలాలి, చెర్లపల్లి, మేడ్చల్, యాకుత్పుర తదితర స్టేషన్లలో ఆధునిక సౌకర్యాలతో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. రూ.720 కోట్లతో సికింద్రాబాద్ స్టేషన్ అభివృద్ధి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ను రూ.720 కో ట్లతో అత్యాధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేస్తున్నామని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి తెలిపారు. శంషాబాద్ విమానాశ్రయం తరహా లో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ను ఆధునికంగా తీర్చిదిద్దుతున్నామన్నారు. నగరం లో పెరుగుతున్న ట్రాఫిక్ దృష్ట్యా చెర్లపల

నర్సు శిరీష మృతి కేసులో వీడిన మిస్టరీ గదిలోకి చొరబడి అఘాయిత్యానికి యత్నించిన బీహార్ వాసి ప్రతిఘటించడంతో గొంతు నొక్కి హత్య నిందితుడు రియల్ ఎస్టేట్ సంస్థలో పనిచేస్తున్న సూపర్ వైజర్ సైనా ఉల్లాగా గుర్తింపు, అరెస్ట్మనతెలంగాణ / సిటీబ్యూరో: అనుమానాస్పదస్థితిలో మృతి చెందిన నర్సు కేసు మిస్టరీని పహాడీషరీఫ్ పోలీసులు ఛేదించారు. గదిలో ఉన్న ఆమెపై అత్యాచారానికి యత్నించాడు. బాధితురాలు అడ్డుకోవడంతో హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం... ఖమ్మం జిల్లాకు చెందిన వికె శిరీష(21)పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తుక్కుగూడ ప్రైమ్ కేర్ ఆస్ప త్రిలో నర్సుగా చేరింది. ఆస్పత్రికి సమీపంలోనే గదిలో ఉంటూ.. రోజు విధుల కు హాజరయ్యేది. శనివారం విధులకు హాజరైన ఆమె మధ్యాహ్నం గదికి వచ్చిం ది. ఆమె విశ్రాంతి తీసుకుంటుండగా బిహార్ రాష్ట్రానికి చెందిన సైనా ఉల్లా(35) కిటికీ నుంచి గదిలోకి దూకి, ఆమెపై అత్యాచారం చేసేందుకు యత్నించాడు. బాధితురాలు ప్రతిఘటించడంతో గొంతునొక్కి హత్య చేశాడు. వెంటనే అక్కడి నుంచి పారిపోయాడు. సైనాఉల్లా రియల్ ఎస్టేట్ సంస్థలో సూపర్ వైజర్గా పనిచేస్తున్నాడు. నిందితుడు పారిపోతుండగా అరెస్

డిజిపికి ఫోన్ చేసి వివరాలు అడిగిన మంత్రి బాధిత కుటుంబానికి అండగా ఉంటామని భరోసా మన తెలంగాణ/హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలోని ఒక ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన నర్స్ శిరీష దారుణ హత్యకు గురైన ఘటనపై మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విధులు నిర్వహిస్తున్న ఓ యువతి ప్రాణాలను అత్యంత దారుణంగా బలిగొన్న ఈ ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. శిరీష హత్య విషయం తెలిసిన వెంటనే స్థానిక పోలీసు అధికారులు, పహాడిషరీఫ్ ఇనస్పెక్టర్, ఇతర అధికారులతో ఫోన్లో మాట్లాడి ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకున్నారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు మంత్రికి వివరించారు. అనంతరం మంత్రి సీతక్క డీజీపీ సీవీ ఆనంద్కు ఫోన్ చేసి ఘటనపై సమగ్రంగా, ఉన్నతస్థాయి విచారణ జరపాలని సూచించారు. ఇలాంటి దారుణ ఘటనల్లో ఎలాంటి ఆలస్యం లేకుండా చట్టపరమైన విచారణను వేగవంతం చేసి, బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. తన కుటుంబానికి అండగా నిలవాల్సిన వయసులో, తన కాళ్లపై తాను నిలబడి సేవా రంగంలో పని

పిఎం ఆఫీసు నుంచి పిలుపు వచ్చిందంటూ జోరుగా ప్రచారం మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో అధికారంలోకి రావడమే లక్షంగా పావులు కదుపుతున్న బిజెపి జాతీయ నాయకత్వం త్వరలో జరగబోయే కేంద్ర మం త్రివర్గ పునర్ వ్యవస్థీకరణలో తెలంగాణ నుంచి ఎంపీలు ఈటల రాజేందర్, డి.కె. అరుణకు ఛాన్స్ దక్కబోతుందన్న ప్రచారం జోరుగా సాగుతున్నది. అంతేకాకుండా ప్రధాన మంత్రి కార్యాలయం నుంచి వారిరువురికీ ఫోన్ వ చ్చిందన్న పుకార్లు షికారు చేశాయి. అయితే తమకు అటువం టి సమాచారం ఏదీ అందలేదని ఎంపీలు తెలిపారు. పార్టీ జాతీ య కార్యవర్గంలో ఉపాధ్యక్షురాలిగా ఉన్న డి.కె. అరుణను ఇటీవల తప్పించిన సంగతి తెలిసిందే. అయితే ఆ పదవి పోయినం త మాత్రాన తాను బాధ పడడం లేదని, పార్టీ జాతీయ నాయకత్వం తనకు అంత కంటే పెద్ద బాధ్యత మోపనుందేమోనని భావిస్తున్నానని ఎంపీ అరుణ రెండు రోజుల క్రితం మీడియా తో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత బుస్సు సౌకర్యం కల్పించి మహిళా ఓటు బ్యాం కుపై కాంగ్రెస్ ఆశలు పెట్టుకున్నందున, రాష్ట్రం నుంచి మహి ళా ఎంపీ డికె అరుణను నియమించడం వల్ల మేలు జరుగుతుందని ఆ పార్టీ నాయకత్వం భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతున్నది. ప్రధాన

పదివేల కోట్ల రుణం కోసం ప్రపంచ బ్యాంకు వద్దకురాయబారం కోసం కన్సల్టెన్సీ నియామకంరుణం పొందితే సంస్కరణలు అమలు చేయాల్సిందేప్రజలపై నేరుగా భారాలు పడే అవకాశం గుడిగ రఘుమున్సిపల్ కార్పొరేషన్లు, మున్సి పాల్టీల్లో అద్దాల్లాంటి రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రయినేజీలు, పరిశుభ్రత, పచ్చదనం, ప్రజలకు నాణ్యమైన విద్య, వైద్యం అందించటమే తమ లక్ష్యమని చెబు తున్న ప్రభుత్వం… అందుకోసం భారీగా అప్పులు తెచ్చేందుకు రంగం సిద్ధం చేసింది. కొత్త ప్రాజెక్టులు రావాలంటే, అందుకోసం భారీగా వ్యయం చేయాల్సి ఉంటుందనీ, […] The post పట్టణాభివృద్ధి పేరిట అప్పుల బాట appeared first on Navatelangana.

న్యూ ఇండియా కోరేది అభివృద్ధేబీజేపీ, ఆర్ఎస్ఎస్లా విద్వేష, విభజన రాజకీయాలు కాదుఈ దేశం కార్పొరేట్లది కాదు..ప్రజలదిజెన్జీ పోరాటం- ఒక పరిశీలన సెమినార్లోఎస్ఎఫ్ఐ అఖిల భారత ఉపాధ్యక్షులు ఐషీ ఘోష్ప్రజాస్వామ్యాన్ని కాపాడేది ప్రశ్నించే ప్రజాచైతన్యమే: మాజీ ఎమ్మెల్సీ, ప్రొఫెసర్ కె.నాగేశ్వర్తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణ కోసంఉద్యమం : ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి టి.నాగరాజు నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్న్యూ ఇండియా కోరుకుంటున్నది అభివృద్ధిని మాత్రమేనని ఎస్ఎఫ్ఐ అఖిల భారత ఉపాధ్యక్షులు ఐషీఘోష్ స్పష్టం చేశారు. బీజేపీ ఆర్ఎస్ఎస్ విద్వేష, […] The post ప్రశ్నించడమే మా ఎజెండా appeared first on Navatelangana.

మూసీ ప్రక్షాళన కార్పొరేట్ల ప్రయోజనాల కోసమేనా.?గోదావరి జలాల కేటాయింపే శాశ్వత పరిష్కారంపెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసే వరకు పోరాటం : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎండీ జహంగీర్నేడు ఇందిరాపార్క్ వద్ద మహాధర్నాహాజరుకానున్న సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ, నేతలు ఎస్.వీరయ్య, జూలకంటి రంగారెడ్డి, చెరుపల్లి సీతారాములు నవతెలంగాణ-బోడుప్పల్యాదాద్రి భువనగిరి జిల్లాలో పెండింగ్లో ఉన్న సాగు, తాగునీటి ప్రాజెక్టులకు తక్షణమే నిధులు విడుదల చేసి, వాటి పూర్తి కోసం ప్రభుత్వం స్పష్టమైన గడువు ప్రకటించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర […] The post సాగు నీటి కోసమే సమర శంఖారావం appeared first on Navatelangana.

12 రాష్ట్రాల్లో 20 శాతానికి పైగా లోటు..ఏపీ, బీహార్, ఈశాన్య రాష్ట్రాల్లో 40 శాతానికి మించి కొరతకేంద్రం లక్ష్యాలకు భిన్నంగా వాస్తవ పరిస్థితులుఖరీఫ్ సాగుకు దెబ్బ. వరి 3 శాతం, మొక్కజొన్న 4 శాతం తగ్గుదల దేశవ్యాప్తంగా ఆగస్టులో కొన్ని ప్రాంతాల్లో ఆశించిన దాని కంటే మెరుగైన వర్షాలు కురిసినా.. ఈ ఏడాది నైరుతి రుతుపవనాల లోటు మాత్రం తీరలేదు. జూన్ 1 నుంచి ఆగస్టు 29 వరకు దేశవ్యాప్తంగా వర్షపాతం లోటు దాదాపు 14 శాతానికి […] The post ఆగస్టు వానలొచ్చినా.. వర్షాభావమే! appeared first on Navatelangana.

మేషంపనులలో జాప్యం కలిగిన నిదానంగా పూర్తిచేస్తారు. అవసరానికి సన్నిహితుల సహాయ సహకారాలు అందుతాయి. వ్యాపారములు లాభసాటిగా సాగుతాయి. కుటుంబ వ్యవహారాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో సమస్యలను తెలివిగా పరిష్కరించుకుంటారు. వృషభం ముఖ్యమైన వ్యవహారాలలో సన్నిహితులతో వివాదాలు కలుగుతాయి. ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్తగా వ్యవహరించాలి. ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలున్నవి. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు కలసిరావు. మిధునం సమాజంలో ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. నూతన ఋణ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. ధార్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాల ప్రయత్నలలో అవరోధాలు తొలగుతాయి. కర్కాటకం సంఘంలో పెద్దలతో పరిచయాలు విస్తృతమౌతాయి. ఉద్యోగస్తుల జీతభత్యాల విషయంలో శుభవార్తలు అందుతాయి. నిరుద్యోగులకు నూతన ఉద్యోగావకాశములు లభిస్తాయి. స్థిరాస్తి వ్యవహారాలలో సమస్యలు అధిగమిస్తారు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. సింహం

భారత్లోనూ హైరిస్క్ సరస్సులు.. బద్దలైతే జలప్రళయమే!హిమాలయాల్లో 7,500 హిమానీనద సరస్సులుభారత్లో 195 సరస్సులు అత్యంత ప్రమాదకరంగా గుర్తింపుసిక్కింలోనే 25 హైరిస్క్ సరస్సులు.. గంగా పరివాహక ప్రాంతంలో 4,700 సరస్సులు న్యూఢిల్లీ : నేపాల్ లో ఇటీవల సంభవించిన హిమానీనద విపత్తు భారత్ కు మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. హిమాలయ పర్వతాల్లోని మంచు సరస్సులు బద్దలైతే ఎంతటి విధ్వంసం సంభవిస్తుందో నేపాల్ ఘటన స్పష్టం చేస్తోంది. అదే సమయంలో భారత్లో కూడా వందల సంఖ్యలో ప్రమాదకర హిమానీనద […] The post హిమాలయాల్లో ‘మంచు’ ముప్పు appeared first on Navatelangana.

కార్పొరేట్ విద్యా సంస్థల దోపిడీని అరికట్టాలి : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీఎన్ఈపీ-2020ని వెనక్కి తీసుకోవాలి : ఉస్మానియా యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆమంచి నాగేశ్వర్ నవతెలంగాణ-సిటీబ్యూరో/నిజాంపేటప్రభుత్వ విద్యా రంగాన్ని పటిష్టపరిచి కార్పొరేట్ విద్యా సంస్థల దోపిడీని అరికట్టాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ డిమాండ్ చేశారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ప్రగతినగర్ లోని లీలా సుందరయ్య ఫంక్షన్ హాల్ లో సీపీఐ(ఎం) మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ‘జిల్లా విద్యా సదస్సు’ నిర్వహించారు. పార్టీ జిల్లా కార్యదర్శి […] The post ప్రభుత్వ విద్యను పటిష్ట పర్చాలి appeared first on Navatelangana.

An incident involving a Zepto delivery boy in Hyderabad has sparked a discussion on social media after he reportedly pleaded with traffic police not to seize his bike, saying that his wife was in the hospital.
