
3901 వార్తలు
యుద్ధ పరిణామాలపై చర్చించేందుకు సౌదీలో గల్ఫ్ నాయకుల భేటీవాషింగ్టన్: ఇరాన్ యుద్ధంలో తమ దేశాలు ఒక ముఖభాగంగా మారిన తర్వాత గల్ఫ్ నాయకుల మొదటి ప్రత్యక్ష సమావేశమైన గల్ఫ్ సహకార మండలి (జీసీసీ) సమావేశానికి ముందు..జిద్దాలోని సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ కువైట్ యువరాజు షేక్ సబా ఖలీద్ అల్-హమద్ అల్-సబాను కలిశారు. ఓపెక్, ఓపెక్ ప్లస్ నుంచి యూఏఈ నిష్క్రమించటంపై ప్రధానంగా చర్చ జరిగినట్టు సమాచారం. The post ఏం చేద్దాం? appeared first on Navatelangana.
నూర్జహాన్ సంతాపసభలో సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ ఎస్.వీరయ్యనవతెలంగాణ- నిజామాబాద్ ప్రాంతీయ ప్రతినిధి‘కమ్యూనిస్టు ఉద్యమం.. వామపక్ష శ్రేణులపై అనేక ప్రభావాలు వెంటాడుతున్న కాలమిది. కమ్యూనిస్టు ఉద్యమం తనకు తాను మరోసారి పునరుద్ధరించుకునే ప్రయత్నం, సరైన బాటలో నడిచేందుకు ఒక మధనం సాగుతున్న సమయంలో ప్రజల కార్యకర్తగా.. ఎర్రజెండ బిడ్డగా నూర్జహాన్ సమరశీల పోరాటాలు చేశారు” అని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు ఎస్.వీరయ్య అన్నారు. సీపీఐ(ఎం) నిజామాబాద్ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు నూర్జహాన్ ఇటీవల అనారోగ్యంతో మరణించగా.. పార్టీ […] The post ఎర్రజెండా ముద్దుబిడ్డ నూర్జహాన్ నూర్జహాన్ appeared first on Navatelangana.
కాళిగంజ్లో సీపీఐ(ఎం) అభ్యర్థి రోడ్డు షో అడ్డుకునే యత్నంనిరసించిన పార్టీ నేతలు..ఎక్కడికక్కడే రోడ్డు షోలునవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరోపశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారాల్లో భాగంగా ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులపై పోలీసులు జులుం ప్రదర్శిస్తున్నారు. అధికార తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ)కు అనుకూలంగా వ్యవహరిస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు. పోలీసులు కాళీగంజ్ సీపీఐ(ఎం) అభ్యర్థి ఊరేగింపును అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే పోలీసుల తీరును పార్టీ నేతలు తీవ్రంగా వ్యతిరేకించారు. నిరసన వ్యక్తం చేశారు. ఎక్కడికక్కడే రోడ్డు షోలు నిర్వహించారు.పశ్చిమబెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల […] The post పశ్చిమ బెంగాల్లో పోలీసుల జులుం appeared first on Navatelangana.
– నూతన డీజీపీగా నియామకం– ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం– 30న ప్రస్తుత డీజీపీ శివధర్రెడ్డి ఉద్యోగ విరమణ– అదే రోజు లేదా మే1న ఆనంద్ బాధ్యతల స్వీకరణ!నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధితెలంగాణ రాష్ట్ర పోలీస్ విభాగానికి కొత్త డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ)గా సీనియర్ ఐపీఎస్ అధికారి సీవీ ఆనంద్ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం జీఓ ఆర్టీ నం.553 జారీ చేసింది. ప్రస్తుతం హోం శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీగా పనిచేస్తున్న ఆనంద్ను […] The post రాష్ట్ర పోలీస్ సారథి సీవీ ఆనంద్ appeared first on Navatelangana.
డ్రై పోర్ట్ ఏర్పాటుకు ప్రణాళికలుమిర్యాలగూడను ప్రధాన పారిశ్రామిక హబ్గా తీర్చిదిద్దుతాం : మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డినవతెలంగాణ -మిర్యాలగూడ టౌన్భారత్ ఫ్యూచర్ సిటీ నిర్మాణంలో భాగంగా హైస్పీడ్ ట్రైన్లు, నేషనల్ హైవేలు, డ్రైపోర్ట్, గ్రీన్ఫీల్డ్ హైవేల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధమయ్యా యని రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మంగళవారం విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ సమీపంలో రూ.500 కోట్లతో ట్రైన్ హబ్ ఏర్పాటు […] The post హైస్పీడ్ ట్రైన్లు, నేషనల్ హైవేలు, appeared first on Navatelangana.
బాధిత కుటుంబాలకు అండగా ఉంటాంచట్ట ప్రకారం పరిహారంతోపాటు కంపెనీ నుంచి సహాయం : కార్మిక శాఖ మంత్రి వివేక్ఆస్పత్రిలో కార్మికులకు పరామర్శమృతుల కుటుంబాలకు రూ.25లక్షల చొప్పున పరిహారం ప్రకటించిన కంపెనీనవతెలంగాణ-శంకర్పల్లిరంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం మహాలింగాపురం గ్రామ పరిధిలోని సిమెంట్ బ్రిక్స్ కంపెనీలో క్రేన్ కూలడంతో ఐదుగురు కార్మికులు మృతిచెందడం బాధాకరమని కార్మిక శాఖ మంత్రి వివేక్ అన్నారు. మరో పది మంది గాయపడ్డారన్నారు. స్థానిక ఆస్పత్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మిగతా కార్మికులను మంగళవారం చేవెళ్ల […] The post కూలీల మృతి బాధాకరం appeared first on Navatelangana.
దొంగలను వదిలేసి ఫిర్యాదుదారులకు జైలా?మా ఫోన్లను ట్యాప్చేస్తున్న అధికారులు రిటైర్ అయినా వదలంరైతులు ఎండకు ఎండుతున్నా పట్టించుకోరేం..? : మాజీ మంత్రి హరీశ్రావుసెంట్రల్ జైలు రిమాండ్లో ఉన్న క్రిశాంక్కు పరామర్శ నవతెలంగాణ-కందిప్రశ్నిస్తే కేసులు పెడతారా? ప్రభుత్వ వైఫల్యాలను, అవినీతిని ప్రశ్నించే గొంతులను అక్రమ కేసులు, సిట్లతో అణచివేసే కుట్ర జరుగుతోందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. సీఎం రేవంత్రెడ్డి 420 హామీలు.. మాటలు బంద్జేయాలన్నారు. సంగారెడ్డి జిల్లా కంది మండల కేంద్రంలోని సెంట్రల్ జైలులో రిమాండ్లో […] The post ప్రశ్నిస్తే కేసులు పెడతారా..? appeared first on Navatelangana.


మేషంముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. భూ సంభందిత కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ సభ్యుల ఆదరణ పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. వృత్తి వ్యాపారాలలో నూతన లాభాలు అందుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వృషభం వృధా ఖర్చుల విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. సంతానానికి నూతన ఉద్యోగ అవకాశములు లభిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలలో అవరోధాలు ఉన్నపటికీ సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో ఆకస్మికంగా నిర్ణయాలు మార్చుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో బాధ్యతలు పెరుగుతాయి. మిధునం దీర్ఘకాలిక ఋణ ఒత్తిడి అధికమవుతుంది. కుటుంబ సభ్యుల నుండి అవసరానికి ధన సహాయం అందక ఇబ్బందిపడతారు. ధన వ్యవహారాలలో చిన్నపాటి సమస్యలు కలుగుతాయి. ఉద్యోగమున ఇతరులతో వాదనకు వెళ్ళకపోవడం మంచిది. నూతన వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలించవు. దూర ప్రయాణాలు కలసిరావు. కర్కాటకం అనుకున్న సమయానికి పనులు పూర్తిచేస్తారు. ఖర్చులకు మించి ఆదాయం ఉంటుంది. సంఘంలో ప్రముఖుల నుండి ప్రశంసలు అందుకుంటారు. గృహమున సంతోషంగా గడుపుతారు. భాగస్వామ్య వ్యాపారమునకు నూతన పెట్టుబడులు
ముంబయి ఇండియన్స్తో సన్రైజర్స్ ఢీ నేడువరుస విజయాలతో జోరుమీదున్న హైదరాబాద్ రాత్రి 7.30 నుంచి స్టార్స్పోర్ట్స్లో.. సన్రైజర్స్ హైదరాబాద్ గత ఐదు మ్యాచ్ల్లో 4 విజయాలు నమోదు చేయగా, ముంబయి ఇండియన్స్ గత ఐదు మ్యాచ్ల్లో 4 ఓటములు చవిచూసింది. టాప్-4 రేసులో ముందంజ వేసేందుకు సన్రైజర్స్ ఎదురుచూస్తుండగా.. పాయింట్ల పట్టికలో ఎగబాకేందుకు ముంబయి ఇండియన్స్ ఓ విజయం వేటలో నిలిచింది. గ్రూప్ దశ ద్వితీయార్థం జోరందుకున్న తరుణంలో నేడు వాంఖడెలో ముంబయి ఇండియన్స్తో సన్రైజర్స్ హైదరాబాద్ […] The post జోరు కొనసాగేనా? appeared first on Navatelangana.
మొక్కజొన్న పంట కొనుగోలు వ్యవస్థపై ఏర్పడిన సంక్షోభం, రైతుల జీవనాధారాన్ని ఎంతగా కుదిపేస్తోందో ఇటీవల పరిస్థితులు స్పష్టంగా చెబుతున్నాయి. కనీస మద్దతు ధర (ఎంఎస్పి) భరోసా లేకపోవడం, ధర ప్రకటించినా సరైన కొనుగోలు యంత్రాంగం ఉండకపోవడం.. ఇవి రెండూ కలిసి రైతును మరింత అసహాయ స్థితిలోకి నెట్టేశాయి. ”పంట పండించు.. రైతును రాజుగా చేస్తాం” అన్న నినాదం కాగితం మీదే మిగిలిపోయి, నేలమీద కూడా రైతు తన పంటను అమ్ముకునే పరిస్థితి లేక తలదించుకునే దశకు పాలకులు […] The post మక్క రైతుకు మద్దతేది? appeared first on Navatelangana.

అమెరికా అమలు చేస్తున్న దిగ్బంధం కారణంగా ఇరాన్ చమురు ఎగుమతులు తీవ్ర ప్రభావానికి గురవుతున్నాయి. ఇరాన్కు చెందిన చమురు ట్యాంకర్లు ఇప్పుడు పెద్ద సంఖ్యలో చాబహార్ పోర్టు సమీపంలో నిలిచిపోయినట్లు ఉపగ్రహ చిత్రాలు, సముద్ర నిఘా సంస్థల విశ్లేషణలు వెల్లడిస్తున్నాయి. పర్షియన్ గల్ఫ్కు వెలుపల గల్ఫ్ ఆఫ్ ఒమాన్ ప్రాంతంలో ఉన్న చాబహార్ పోర్టు అమెరికా దిగ్బంధ రేఖకు సమీపంలో ఉండటంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. గత వారం చివర్లో అక్కడ ఆరు నుంచి ఎనిమిది వరకు భారీ సూపర్ ట్యాంకర్లు నిలిచిపోయినట్లు అమెరికాకు చెందిన అణు వ్యతిరేక సంస్థ, యునైటెడ్అగైనెస్ట్అణు ఇరాన్, సముద్ర గూఢచారి సంస్థ విండ్వార్డ్తెలిపాయి. వీటితో పాటు మరికొన్ని చిన్న ట్యాంకర్లు కూడా సమీపంలో ఉన్నట్లు సమాచారం. ఇదే ప్రాంతంలో గత వారం అమెరికా నౌకాదళం అడ్డుకున్న రెండు భారీ చమురు నౌకలను మళ్లించినట్లు కూడా అమెరికా నేవీ వెల్లడించింది.చమురు మార్కెట్ విశ్లేషణ సంస్థ వోర్టెక్సా లిమిటెడ్ అంచనా ప్రకారం, ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా రవాణాలో లేదా సముద్రంలో నిల్వగా ఉన్న ఇరాన్ ముడి చమురు పరిమాణం సుమారు 15.5 కోట్ల బ్యారెల్స్గా ఉంది. ఈ పరిణామాలు చూస్తుంటే ఇర
ఇండియాలో నయా ఫాసిజం పైచేయి సాధిస్తున్న క్రమంలోనే దానికి సంబంధించిన కొన్ని లక్షణాలు బయటకు వ్యక్తమవుతూ వచ్చాయి. నిస్సహాయంగా ఉన్న ఒక మైనారిటీ తరగతి ప్రజలను ‘పరాయివాళ్లు’గా వేరు చేయడం, వారి పట్ల మెజారిటీ ప్రజల్లో ద్వేషాన్ని రెచ్చగొట్టడం, ప్రభుత్వ యంత్రాంగంలోని వివిధ అంగాల ద్వారా, నయా ఫాసిస్టు గూండాల ద్వారా ఆ మైనార్టీలను అణచివేయ డానికి పూనుకోవడం, తమను విమ ర్శించేవారిని, రాజకీయ ప్రత్యర్ధులను, మేధావులను, కళాకారులను, తక్కినవారిని అణగదొక్కడం అటువంటి లక్షణాలే. మరోవైపు బాహాటంగానే […] The post నయా ఫాసిజం-జాతీయత appeared first on Navatelangana.
అమెరికా, ఇజ్రాయిల్ దేశాలు ఇరాన్పై సాగిస్తున్న దురాక్రమణ యుద్ధం మొదలై నేటికి రెండునెలలు దాటిపోతోంది. కాల్పుల విరమణ, పాకిస్థాన్ మధ్యవర్తిత్వంలో శాంతి చర్చల ప్రయత్నం జరుగుతున్నప్పటికీ అవి కొలిక్కి రావటం అంత తేలిగ్గా జరిగేట్లు లేదు. ఈ యుద్ధం ప్రభావం ఆ రెండు, మూడు దేశాలకు లేక గల్ఫ్ దేశాలకు మాత్రమే పరిమితం కాదు. ప్రపంచ వ్యాపితంగా అనేక దేశాలు ఆర్ధిక, రాజకీయ సంక్షోభాలలో కూరుకుపోయి, ప్రజలు అనేక ఇక్కట్లకు గురయ్యే పరిస్థితి దాపురిస్తుంది. ఫిభ్రవరి 28న […] The post ముందు నుయ్యి, వెనక గొయ్యి – దిక్కుతోచని ట్రంప్ appeared first on Navatelangana.



వరుస విజయాలతో ఐపిఎల్ సీజన్ 2026లో పెను ప్రకంపనలు సృష్టిస్తున్న పంజాబ్ కింగ్స్ జోరుకు బ్రేక్ పడింది. మంగళవారం జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ ఆరు వికెట్ల తేడాతో పంజాబ్ను చిత్తు చేసింది. ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 222 పరుగులు చేసింది. తర్వాత లక్షఛేదనకు దిగిన రాజస్థాన్ 19.2 ఓవర్లలోనే నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీలు జట్టుకు శుభారంభం అందించారు. విధ్వంసక ఇన్నింగ్స్ ఆడిన సూర్యవంశీ 16 బంతుల్లోనే ఐదు సిక్స్లు, 3 ఫోర్లతో 43 పరుగులు చేశాడు. ఇక యశస్వి 27 బంతుల్లోనే 51 పరుగులు సాధించాడు. చివర్లో డొనొవన్ ఫెరీరా, శుభమ్ దూబెలు అసాధారణ బ్యాటింగ్తో చెలరేగి పోయారు. అద్భుత ఇన్నింగ్స్ ఆడిన ఫెరీరా 26 బంతుల్లోనే అజేయంగా 52 పరుగులు చేశాడు. శుభం 12 బంతుల్లోనే 31 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు.అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ను స్టోయినిస్ 22 బంతుల్లో 62 (నాటౌట్), ప్రభ్సిమ్రాన్ సింగ్ (59) అండగా నిలిచారు.

రాజ్యసభ సభ్యురాలు స్వాతి మాలివాల్ తాను ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)ను వీడి భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో చేరడం పూర్తిగా స్వచ్ఛంద నిర్ణయమని స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా దేశం కోసం చేస్తున్న పనుల నుంచే తనకు ప్రేరణ లభించిందని తెలిపారు. 2024లో ఆప్ నాయకత్వంతో తీవ్ర విభేదాలు ఏర్పడిన మాలీవాల్, ఇటీవల బీజేపీలో విలీనమైన ఏడుగురు ఆప్ రాజ్యసభ సభ్యుల బృందంలో భాగమయ్యారు. మంగళవారం ఆమె ఢిల్లీలోని బీజేపీ కార్యాలయాన్ని సందర్శించగా, ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్దేవా, కేంద్ర సహాయ మంత్రి హర్ష్ మల్హోత్రా, ఎంపీ యోగేందర్చందోలియా, ఢిల్లీ బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణు మిట్టల్ సమక్షంలో ఆమెను అధికారికంగా పార్టీలో చేర్చుకున్నారు. ప్రధాని మోదీ, అమిత్ షా దేశం కోసం చేస్తున్న చారిత్రాత్మక పనులు నన్ను బాగా ప్రభావితం చేశాయి. వారినుంచి స్ఫూర్తి పొందే నేను బీజేపీలో చేరాను అని స్వాతి మాలీవాల్ మీడియాతో చెప్పారు.ఢిల్లీ మహిళా కమిషన్ చైర్పర్సన్గా పనిచేసిన సమయంలో కూడా బీజేపీనుంచి తనకు మంచి సహకారం లభించిందని మాలీవాల్ తెలిపారు. ఎవరి బలవంతం వల్ల నేను ఈ పార్టీలో చేరలేదు. జరుగుతున్న ప్రతి ప

వనస్థలిపురంలో అధిక వడ్డీ ఆశ చూపి దాదాపు రూ.25 కోట్లకు పైగా వసూలు చేసి పరారైన రియల్ చీటర్ బద్దం జ్యోతిరెడ్డి (40) అనే మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కమలానగర్లో నివసించే ఆమె ప్రజలను నమ్మించి తన ఇంటిని సైతం ఇద్ద రికి అమ్మినట్లు (డబుల్ రిజిస్ట్రేషన్) ఆరోపణలు రావడంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బద్దం జ్యోతిరెడ్డిని అరెస్ట్ను గోప్యంగా ఉంచు తున్నారు. నగర శివారు ప్రాంతంలోని ఓ పోలీస్ స్టేషన్ లో రహస్యంగా విచారిస్తున్నట్లు తెలిసింది. కేసుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. వన స్థలిపురం డివిజన్ కమలానగర్లో ఉండే బద్దం జ్యోతిరెడ్డి వనస్థలిపురం, హయత్నగర్ ప్రాంతాల్లో పలువురు రియల్టర్లు, రాజకీయనాయకులతో పరిచయాలు పెంచుకుంది. పలువురి వద్ద 10 శాతం వడ్డీ ఇస్తానని చెప్పి అప్పులు చేసింది. ముందుగా వడ్డీ క్రమం తప్పకుండా ఇవ్వడంతో చాలా మంది అప్పులు ఇచ్చారు. దాదాపు రూ.25 కోట్లకు పైగానే వసూలు చేసి పరారైంది. అదే క్రమంలో రూ.3 కోట్లు అప్పుగా తీసుకున్న సుజిత్ అనే వ్యక్తికి కమలానగర్లోని తన సొంత ఇంటిని సేల్ అగ్రిమెంట్ చేసింది. ఆ తర్వాత ఇబ్రహీంపట్నం ప్రాంతానికి చెందిన రామకృష్ణారెడ్డికి కూడా సేల్డీ

చిరంజీవి మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవు తున్నారు. డైరెక్టర్ బాబీ కొల్లితో కలిసి మెగాస్టార్ చేస్తున్న ఈ చిత్రాన్ని కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్పై వెంకట్ కె నారాయణ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన లుక్ టెస్ట్ విజయవంతంగా పూర్తయింది. లుక్ టెస్ట్ చూస్తుంటే మెగాస్టార్ పవర్ఫుల్, స్ట్రైకింగ్ లుక్లో కనిపించబోతున్నారని స్పష్టమవు తోంది. ఇప్పటికే విడుదలైన హార్డ్ హిట్టింగ్ కాన్సెప్ట్ పోస్టర్ హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. చిరంజీవి కొత్త షేడ్లో కనిపించనున్నట్లు పోస్టర్ […] The post లుక్ టెస్ట్ ఓకే appeared first on Navatelangana.
అక్కినేని నాగార్జున దిగ్విజయంగా 99 సినిమాలను పూర్తి చేసుకుని, 100వ సినిమాకి సన్నాహాలు చేస్తున్నారు.ఆయన నటించబోయే ఈ మైల్ స్టోన్ ప్రాజెక్ట్ అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్పై రూపు దిద్దుకుంటోంది. దర్శకుడు రా. కార్తిక్ ఈ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవుతుండగా, నాగార్జున సినీ ప్రయాణానికి పర్ఫెక్ట్ సెలబ్రేషన్గా ఈ ప్రాజెక్ట్ను భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే చిత్రీ కరణ వేగంగా కొనసాగుతోంది. ఈ ప్రాజెక్ట్కు మరింత క్రేజ్ తెచ్చేలా నటి టబు కీలక పాత్రలో కనిపించనున్నారు. […] The post నాగార్జున 100వ సినిమాలో టబు appeared first on Navatelangana.
ధనుష్, మమితా బైజు జంటగా కుష్మిత గణేష్ సమర్పణలో డా. ఐషరి కె. గణేష్ నిర్మించిన చిత్రం ‘కర’. విఘ్నేశ్ రాజా దర్శకత్వం వహించారు. ఈ సినిమాను ఈనెల 30న తెలుగు రాష్ట్రాల్లో విఘ్నేశ్వర ఎంటర్టైన్మెంట్స్, ఆర్ స్టార్ లాజిస్టిక్స్ బ్యానర్ మీద సిహెచ్ సతీష్ కుమార్, రాజేష్ కుమార్ బొబ్బర రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా మేకర్స్ తెలుగు ట్రైలర్ను విడుదల చేశారు. ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన ఈ ట్రైలర్ సినిమాపై అంచనాలను రెట్టింపు […] The post ట్రైలర్తో ‘కర’పై అంచనాలు రెట్టింపు appeared first on Navatelangana.