25124 వార్తలు

– హాజరైన మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ నవతెలంగాణ-హుస్నాబాద్ రూరల్ హుస్నాబాద్ మండలంలోని మహమ్మదాపూర్ గ్రామంలో ఆదివారం పోచమ్మ బోనాలు, సార్గమ్మ పునఃప్రతిష్ఠా ఘనంగా నిర్వహించారు. బోనాల పండుగ, సార్గమ్మ పునఃప్రతిష్ఠా వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి, గ్రామ ప్రజలందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. గ్రామంలో ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, పాడిపంటలతో, సమృద్ధిగా జీవించాలని అమ్మవారిని ప్రార్థించారు. పోచమ్మ బోనాల పండుగ సందర్భంగా గ్రామంలో […] The post మహమ్మదాపూర్ లో పోచమ్మ బోనాలు appeared first on Navatelangana.

కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు చిలుక వివేక్ రెడ్డినవతెలంగాణ – తిమ్మాజిపేటరేపు తిమ్మాజిపేట మండలానికి నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే డా.కూచుకుళ్ల రాజేష్ రెడ్డి రానున్నట్లు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు చిలుక వివేక్ రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం ఉదయం 8:00 గంటలకు బుద్ధ సముద్రం గ్రామంలో నిర్వహించే పోచమ్మ అమ్మవారి పునఃప్రతిష్ఠ, 10:00 గంటలకు మండల కేంద్రంలోని రైతు వేదికలో నూతన స్మార్ట్ రేషన్ కార్డులు, లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల […] The post రేపు మండలానికి ఎమ్మెల్యే కూచుకుళ్ల రాక appeared first on Navatelangana.

నవతెలంగాణ-ఆలేరు టౌను ఆలేరు పట్టణంలో ప్రజల సౌకర్యార్థం సుందరమైన పార్క్, ఓపెన్ జిమ్ ఏర్పాటు చేస్తామని, ఆలేరు మున్సిపల్ చైర్మన్ బీజన బాలమణి భాస్కర్ అన్నారు. బస్టాండ్ వెనుక సుభాష్ నగర్ కాలనీలో ప్రభాకర్ హాస్పిటల్ వద్ద ఆదివారం మేరా యువభారత్ లో భాగంగా, యూత్ డెవలప్మెంట్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బాలమణి మాట్లాడుతూ.. ఆలేరు సమగ్ర అభివృద్ధిలో యువత భాగస్వాములు కావాలని సూచించారు. ప్రజలకు ఉపయోగపడే మరిన్ని కార్యక్రమాలను చేపడుతామని చెప్పారు. యువ చైతన్య కార్యక్రమాల గురించి మహేష్ వివరించారు. రిటైర్డ్ టీచర్ బి.బాలరాజు […] The post పట్టణంలో ఓపెన్ జిమ్, పార్కు ఏర్పాటు చేస్తాం appeared first on Navatelangana.

నవతెలంగాణ-ఆలేరు టౌన్ శ్రావణ మాస బోనాలు పురస్కరించుకొని, ఆలేరు పట్టణంలో ఆదివారం అంగరంగ వైభవంగా మహిళలు సామూహికంగా భక్తిశ్రద్ధలతో బోనాలు గ్రామదేవతలకు సమర్పించారు. ఈ మేరకు పోచమ్మ దేవాలయం, గడి మైసమ్మ, బొడ్రాయి, కొలను పాక రోడ్డు, పోచమ్మ, దుర్గమ్మ, మైసమ్మ, ఉప్పలమ్మ దేవాలయాలకు కుటుంబ సభ్యులతో కలిసి ఆలయాల చుట్టూ ప్రదక్షణలు చేశారు. అనంతరం అమ్మవారికి కుమ్మరి పూజారుల సమక్షంలో మొక్కులు చెల్లించి, నూతన వస్త్రాలు, నైవేద్యం సమర్పించారు. పట్టణం, గ్రామాలు ప్రజలు సుభిక్షంగా, ఆయురారోగ్యాలతో జీవించాలని, కరువు కాటకాలు పారద్రోలాలని, […] The post గ్రామ దేవతలకు బోనాలు సమర్పణ appeared first on Navatelangana.

విశాఖపట్నం: రుషికొండ బీచ్లో అతి పెద్ద ప్రమాదం తప్పింది. అలల ఉధృతికి ఏడుగురు పర్యాటకులు గల్లంతు కాగా, వారిని లైఫ్ గార్డ్స్ సిబ్బంది అత్యంత వేగంగా స్పందించి రక్షించారు. దాంతో ఆ ఏడుగురు పర్యాటకులు సురక్షితంగా బయటపడ్డారు. కొట్టుకుపోతున్న వారిని లైఫ్ గార్డ్స్ సిబ్బంది రక్షించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. వీరంతా సాలూరు, చత్తీస్గఢ్ నుంచి పర్యాటకులుగా గుర్తించారు.

త్వరలో శ్రీవారి విద్యాసేవ, ఇంజనీరింగ్ సేవ, రక్షణ సేవలుమన తెలంగాణ/హైదరాబాద్: తిరుమల తిరుపతి దేవస్థానం దశాబ్దాలుగా కేవలం వసతి, భోజన సేవలకే పరిమితమైన ‘శ్రీవారి సేవ’ పరిధిని విస్తరిస్తూ.. వృత్తి నిపుణులను కూడా భాగస్వామ్యం చేసేందుకు శ్రీకారం చుట్టింది. జూన్ 5న పైలట్ ప్రాజెక్టుగా ‘శ్రీవారి వైద్యసేవ’ను ప్రారంభించింది. స్విమ్స్, బర్డ్, పద్మావతి చిన్నపిల్లల ఆసుపత్రి, సెంట్రల్ హాస్పిటల్, అశ్విని ఆసుపత్రి, ఆయుర్వేద ఆసుపత్రులు, గోశాలల్లో ఈ సేవలందించే అవకాశం కల్పించింది. ఇందులో స్పెషలిస్ట్ వైద్యులు కనీసం 3 రోజులు, ఎంబీబీఎస్ వైద్యులు 7 రోజుల సేవా స్లాట్లు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ వైద్యసేవ ప్రారంభమైన 83 రోజుల్లోనే 723 మంది వైద్యులు ఆన్లైన్లో నమోదు చేసుకోగా, టీటీడీ 586 దరఖాస్తులను ఆమోదించింది. ఇందులో భాగంగా ఇప్పటికే స్పెషలిస్టులు, ఎంబీబీఎస్, ఆయుర్వేద, పశువైద్యులు కలిపి 109 మంది వైద్యులు శ్రీవారికి సేవలు అందించారు. వైద్యుల సేవలను ప్రోత్సహించేందుకు టీటీడీ ప్రత్యేక దర్శనాలను కల్పిస్తోంది. మూడు రోజుల సేవ పూర్తి చేసిన స్పెషలిస్ట్ వైద్యులకు ఆలయ ఆధికారులు శ్రీవారి బ్రేక్ దర్శనం కల్పిస్తుండగా.. ఏడు రోజు

నవతెలంగాణ – ముధోల్దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధిగాంచిన బాసర పుణ్యక్షేత్రంలో శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్ర రావు చౌహాన్ దంపతులు దర్శించుకున్నారు. ఈ క్రమంలో కుంకుమార్చనతో పాటు ప్రత్యేక పూజలను నిర్వహించారు. అనంతరం ఆలయాధికారులు మాజీ సిఎం దంపతులను ఘనంగా సన్మానించి, అమ్మవారి ఫోటో ప్రసాదాన్ని ఆలయ అర్చకులు అందజేశారు. ఈ కార్యక్రమంలో బైంసా మార్కెట్ కమిటీ చైర్మన్ ఆనంద్ రావు పటేల్, బాసర మండల బిజేపి అధ్యక్షుడు పుట్నల సాయినాథ్, తదితరులు పాల్గొన్నారు. The post బాసరలో మహారాష్ట్ర మాజీ సీఎం పూజలు appeared first on Navatelangana.

పారదర్శకంగా ఆన్లైన్ విధానంలోసీట్ల భర్తీకి ప్రభుత్వానికి గతంలోనే ఉన్నత విద్యామండలి ప్రతిపాదనలు వివిధ కారణాలతో ఆన్లైన్ విధానంసై నాన్చుడు ధోరణి బి కేటగిరీ సీట్ల భర్తీ ప్రక్రియపై స్పష్టత కరువు అయోమయానికి గురవుతున్న విద్యార్థులు మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలోని ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలల్లో బి కేటగిరీ (యాజమాన్య కోటా) సీట్ల భర్తీ విధానాన్ని మరింత పారదర్శకంగా మార్చేందుకు ప్రతిపాదించిన ఆన్లైన్ విధానం అమలుపై అడుగు ముందుకు పడటం లేదు. డిమాండ్ ఉన్న కంప్యూటర్ సైన్స్, ఇతర సిఎస్ఇ అనుబంధ బ్రాంచీల సీట్లను లక్షలాది రూపాయల డొనేషన్లకు అమ్ముకుంటున్నారనే ఆరోపణలకు చెక్ పెట్టేందుకు ఉన్నత విద్యామండలి ఆన్లైన్ విధానాన్ని తీసుకురావాలని భావించినప్పటికీ, అది ప్రతిపాదనలకే పరిమితమవుతోంది. ప్రస్తుతం కన్వీనర్ కోటా కింద 70 శాతం ఇంజనీరింగ్ సీట్లు ద్వారా కౌన్సెలింగ్ ద్వారా సజావుగా సాగుతున్నప్పటికీ, మిగిలిన 30 శాతం యాజమాన్య కోటా సీట్ల భర్తీ బాధ్యతను కళాశాల యాజమాన్యాలకే వదిలేస్తుండటంతో విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్రంగా నష్టపోతున్నారు. రాష్ట్రంలో కన్వీనర్ కోటా కింద సుమారు 94 వేల ఇంజనీరింగ్ సీట్లు అందుబాట

మహిళా సాధికారతకు ఆధునిక మహిళా శక్తి భవనాలు 22 జిల్లాల్లో రూపుదిద్దుకుంటున్న భవన నిర్మాణ పనులు త్వరలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం ఏర్పాట్లు చేస్తున్న పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మన తెలంగాణ/హైదరాబాద్: ప్రతి ఇందిరా మహిళా శక్తి భవనంలో ‘వన్ స్టాప్ ఫెసిలిటీ సెంటర్’ ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించింది. మహిళా పారిశ్రామికవేత్తలకు వ్యాపార సలహాలు, ప్రాజెక్టు నివేదికల తయారీ, రిజిస్ట్రేషన్, లైసెన్సులు, నైపుణ్యాభివృద్ధి, బ్యాంకు రుణాల అనుసంధానం, మార్కెట్ లింకేజీ, బ్రాండింగ్, ప్యాకేజింగ్, ఈ- కామర్స్, ప్రభుత్వ పథకాలతో అనుసంధానం వంటి సేవలను ఒకే వేదికపై అందుబాటులోకి తీసుకురానుంది. ఈ దిశగా మహిళా శక్తి భవనాలను వేదికలుగా చేసుకుని మహిళా సాధికారితకు తోడ్పాటును అందించేందుకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. వ్యాపారం ప్రారంభించాలనుకునే మహిళలకు ఆలోచన నుంచి కార్యరూపం దాల్చే వరకు అవసరమైన మార్గదర్శకత్వం, చేయూత అందించేలా ఈ కేంద్రాలు పనిచేయనున్నాయి. దీంతో మహిళా సంఘాల సభ్యులకు వివిధ కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం తగ్గడంతో పాటు, తమ ఉత్పత్తులను వ్యాపార అవకాశాలుగా మార్చుకునేందుకు అవసరమైన సహకారం ఒకే చోట

హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో భూమి ధరలు మరోసారి రికార్డు స్థాయికి చేరాయి. రాయదుర్గ్ నాలెడ్జ్ సిటీలో 5.38 ఎకరాల ప్రభుత్వ భూమిని తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (TGIIC) నిర్వహించిన ఈ-వేలంలో రూ.1,447.22 కోట్లకు విక్రయించారు. ఎకరాకు రూ.269 కోట్ల ధర పలకడం హైదరాబాద్లో రాయదుర్గ్ భూముల వేలంలో ఇప్పటివరకు నమోదైన అత్యధిక ధరగా నిలిచింది.

అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసిసి) మహిళా క్రికెట్లో తొలిసారి ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహించేందుకు సన్నద్దమవుతోంది. వచ్చే ఏడాది ఈ టోర్నమెంట్ జరుగనుంది. ఇందులో ఆరు జట్లు తలపడతాయి. శ్రీలంక క్రికెట్ బోర్డు ఆతిథ్యంలో ఈ టోర్నీ జరుగుతుందని తొలుత వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు ఐసిసి తన నిర్ణయాన్ని మార్చుకోనుందని తెలుస్తోంది. కొత్త వేదికను వచ్చే ఐసిసి బోర్డు సమావేశంలో నిర్ణయించే అవకాశం ఉంది. దీనిపై శ్రీలంక బోర్డు స్పందించింది.. అతిథ్య హక్కులను కోల్పోయినట్లే అని బోర్డు స్పష్టం చేసింది. మరో వైదికగా మ్యాచ్లు జరిగే అవకాశం ఉందని.. ఎక్కడ అనేది మాత్రం చెప్పేనని శ్రీలంక బోర్డు తాత్కాలిక కమిటీ కార్యదర్శి ప్రకాశ్ షఫ్తెర్ తెలిపారు. శ్రీలంక బోర్డును ప్రభుత్వం నియమించిన తాత్కాలిక అడ్మినిస్ట్రేసణ్ నడిపిస్తోంది. ఐసిసి నిబంధనల ప్రకారం.. సభ్య దేశాల పాలక మండలిలో ప్రభుత్వాల జోక్యం ఉండకూడదు. దీంతో ఐసిసి బోర్డు సమావేశాల్లోనూ శ్రీలంక ప్రతినిధులకు అనుమతి లేదు. వెంటనే ఎన్నికలు నిర్వహించాలని శ్రీలంకకు ఐసిసి సూచించింది. ఇప్పటికే శ్రీలంక క్రీడా శాఖకు తాత్కాలిక కమిటీ రాజ్యాంగ ముసాయిదాను సమర్పించింది. అయితే, దానిని పార్లమ



వరుణ్ తేజ్ హీరోగా, మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన హారర్ కామెడీ చిత్రం ‘కొరియన్ కనకరాజు’. రితికా నాయక్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో కమెడియన్ సత్య కీలక పాత్ర పోషించాడు. ఆగస్టు 6న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను అలరించడంతో పాటు.. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టింది. వరుణ్-సత్యల కామెడీ, గాంధీ టేకింగ్ సినిమాను విజయపథంలో నడిపాయి. ముఖ్యంగా సత్య కామెడీ సినిమాకు హైలైట్గా నిలిచింది. ఇక ఇప్పుడు ఈ సినిమా ఒటిటిలో సందడి చేసేందుకు సిద్ధమవుతోంది. ప్రముఖ ఒటిటి సంస్థ ‘నెట్ఫ్లిక్స్’లో ఈ సినిమా సెప్టెంబర్ 4వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఒకే శరీరంలో రెండు ఆత్మలు ఉంటే ఎలాంటి సవాళ్లు ఉంటాయన్నది ఆసక్తికరంగా చూపించారు.


టీం ఇండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కొత్త రోల్లో కనిపించనున్నారు. ఇప్పటివరకూ ఆయన క్రికెటర్గా మాత్రమే మనందరికీ పరిచయం. అయితే ఆయన ఇప్పుడు బుల్లితెరపై వ్యాఖ్యాతగా సందడి చేయనున్నారు. బిగ్బాస్ బంగ్లా రియాల్టీ షోకి గంగూలీ వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నారు. దాదాపు దశాబ్ధకాలం విరామం తర్వాత బిగ్బాస్ బంగ్లా ప్రారంభం కానుంది. తొలి సీజన్కు మిథున్ చక్రవర్తి, రెండో సీజన్కు నటుడు జీత్ వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. ఆగస్టు 30 నుంచి ప్రారంభమయ్యే సీజన్-3కి గంగూలీ వ్యాఖ్యాతగా అలరించబోతున్నారు. బిగ్బాస్ వ్యాఖ్యాతగా చేయడానికి ఒప్పుకోవడం వెనుక ఉన్న కారణాన్ని గంగూలీ పంచుకున్నారు. ‘‘బిగ్బాస్ ఒక వైవిధ్యమైన షో. అందరికీ దగ్గరైన షో. సుదీర్ఘ విరామం తర్వాత బెంగాల్లో మళ్లీ మొదలవుతోంది. ఇంతకు ముందు వచ్చిన బిగ్బాస్ షోలను రోజూ చూసే సమయం ఉండేది కాదు. వీకెండ్ మాత్రం కచ్చితంగా చూసే వాడిని. ముఖ్యంగా సల్మాన్ ఖాన్ వ్యాఖ్యాతగా ఎలా చేశారో బాగా పరిశీలించా. ఇది చేయడం నాకు ఆసక్తికరంగానే ఉంది’’ అన్నారు. ఇక గ్రాండ్ ప్రీమియర్కు టీం ఇండియా మాజీ బౌలర్ హర్భజన్ సింగ్ కూడా విచ్చేసి సందడి చేశారు.




గుంటూరు: నగరంలో పట్టపగలే దారుణ హత్య జరగడం కలకలం సృష్టించింది. స్థాని కొండా వెంకటప్పయ్య కాలనీలో చిన్నా అనే వ్యక్తిని ప్రత్యర్థులు కత్తులతో నరికి చంపారు. 20 ఏళ్ల క్రితం జరిగిన ఓ హత్య కేసులో చిన్నా నిందితుడిగా ఉన్నాడు. ఘర్షణల నేపథ్యంలో అతను తెలంగాణలోని సూర్యాపేట వెళ్లి అక్కడే కుటుంబంతో జీవిస్తున్నాడు. గుంటూరులో ఉండే అతడి బాబాయ్ చనిపోవడంతో అంత్యక్రియల్లో పాల్గొనేందుకు ఆదివారం సూర్యాపేట నుంచి గుంటూరు వచ్చాడు. దీంతో ప్రత్యర్థులు కాపు కాచి చిన్నాపై దాడి చేసి దారుణంగా హత్య చేశారు. నగరం పాలెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.



అమరావతి: రెసిడెన్షియల్ స్కూల్ లో చేరకుండా గొడ్డలి పార్టీ నేతలు అడ్డుకుంటున్నారని ఎపి మంత్రి సంధ్యారాణి ఆరోపించారు. విశాఖపట్నం జిల్లాలోని మధురవాడ సమీపంలో గల గిరిజన గురుకుల పాఠశాల మారిక వలస స్కూల్ పై కొందరు రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఎస్టి విద్యార్థుల ప్రమాణాలు పెంచేందుకే సెంటర్ ఆఫ్ ఎక్స్ లైన్స్ కేంద్రాలు ఉన్నాయని, మారిక వలస రెసిడెన్షియల్ స్కూల్ లో సివొఇ ఏర్పాటు చేశామని, 445 మందిని ఇతర ప్రాంతాల్లోని పాఠశాలల్లో చేర్పించామని సంధ్యారాణి తెలియజేశారు. ఇతర స్కూళ్లలో చేరనివ్వకుండా కొందరు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. గిరిజన విద్యార్థులు ఉన్నత విద్య చదువుకోవద్దా? అని ప్రశ్నించారు. ఎస్టి విద్యార్థులు.. దేశంలోని ప్రముఖ విద్యాసంస్థల్లో చదువుకోవాలని సంధ్యారాణి కోరారు.