ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి అటవీ డివిజన్ పరిధిలో ప్రకృతి ప్రేమికులను, వన్యప్రాణి విభాగం అధికారులను ఉత్సాహపరిచే అరుదైన దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. తల్లాడ, కల్లూరు, పెనుబల్లి మండలాల సరిహద్దుల్లో విస్తరించి ఉన్న కనకగిరి (పులిగుండాల) అడవుల్లో రెండు చిరుత పులులు స్వేచ్ఛగా సంచరిస్తూ కెమెరాకు చిక్కాయి.