మండే ఎండలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న తెలుగురాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. ఏపీ, తెలంగాణలోని పులు జిల్లాలో రాబోయే మూడు రోజులు పాటు తేలికపాలి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేసింది. వర్షాల సమయంలో 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కూడా వీచే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.