దేశ రాజధాని ఢిల్లీలో దారుణం వెలుగు చూసింది. ఓ చిన్న విషయంలో మొదలైన వాగ్వాదం చిలికి చిలికి గాలివానలా మారి, చివరకు ప్రాణాలు తీసుకునే వరకు వెళ్లింది. ఈ గొడవ కారణంగా ఢిల్లీ పోలిస్ విభాగంలో పనిచేస్తున్న ఓ కానిస్టేబుల్‌ జరిపిన కాల్పుల్లో ఓ ఫుడ్ డెలివరీ ఏజెంట్ ప్రాణాలు కోల్పోగా అతని స్నేహితుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్రకకలం రేపింది.