మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని శివపురి జిల్లా, కరైరాలో గురువారం (ఏప్రిల్ 16) ఉదయం ఒక ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అధికార గర్వం, మితిమీరిన వేగం తోడై ఐదుగురు వ్యక్తుల ప్రాణాలను సంకటంలోకి నెట్టాయి. మధ్యప్రదేశ్ రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి, పిచోరే ఎమ్మెల్యే ప్రీతమ్ లోధి కుమారుడు దినేష్ లోధి, తన థార్ వాహనంతో బీభత్సం సృష్టించి ఐదుగురిని తీవ్రంగా గాయపరిచారు.