
తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. 31 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచివున్నారు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతుంది. శుక్రవారం శ్రీవారిని 71,803 మంది భక్తులు దర్శించుకున్నారు. 28,685 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.4.04 కోట్లుగా ఉందని టిటిడి అధికారులు వెల్లడించారు.











