
అమరావతి: విజయవాడ కృష్ణలంకలో పలు పాత కేసుల విషయంలో నిందితుడిగా ఉన్న యువకుడు గాదె సాయికృష్ణను లాకప్ డెత్ చేయడం దారుణం ఎపి ప్రభుత్వాన్ని వైసిపి మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు. తన కుమారుడు చనిపోతే బూడిదైనా ఇవ్వండి అని తల్లి కన్నీరు పెట్టుకుందని అన్నారు. ఈ సందర్భంగా విశాఖలో గుడివాడ మీడియాతో మాట్లాడుతూ.. ఒకట్రెండు కేసులు ఉంటే..ఒక మనిషిని చంపేస్తారా? చంపే హక్కు వాళ్లకు ఎవరు ఇచ్చారు? అని ప్రశ్నించారు. సిఐపై కేసు పెట్టి చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. సాయికృష్ణ కేసులో ఎ1గా ఎపి సిఎం చంద్రబాబు నాయుడు, హోంమంత్రిని పెట్టాలని కోరారు. సాయికృష్ణది ప్రభుత్వం చేసిన హత్యేనని గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు.













