సుమంత్, ఐశ్వర్య రాజేష్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం 'మహేంద్ర గిరి వారాహి'. ఈ సినిమాను మహేంద్ర గిరి రాజవంశస్థులకు వారాహి అమ్మవారి శాపం నేపథ్యంలో సోషియో ఫాంటసీ చిత్రంగా నిర్మిస్తున్నారు. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ట్రైలర్ ను మేకర్స్ విడుదల చేశారు. ఆసక్తికరంగా ఉన్న ఈ ట్రైలర్.. సినిమాపై అంచనాలను పెంచింది. ఇక, సిద్ధు జొన్నలగడ్డ అతిథి పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే, హీరోయిన్ మాళవికా నాయర్, వెన్నెల కిషోర్, బ్రహ్మానందం, సురేష్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సెప్టెంబర్ 11న ఈ మూవీ తెలుగుతోపాటు హిందీలోనూ విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.