25192 వార్తలు





‘కె.జి.ఎఫ్’ ఫ్రాంచైజీ తర్వాత కన్నడ స్టార్ హీరో యశ్ నుంచి వచ్చిన సినిమా ‘టాక్సిక్’. ఆగస్టు 26న విడుదలైన ఈ సినిమా ఊహించినంతగా ప్రేక్షకులను అలరించలేకపోయింది. మొదటి షో నుంచే ఈ సినిమాకి డివైడ్ టాక్ వచ్చింది. కలెక్షన్ల పరంగా కూడా నిరాశపరిచింది. ఈ నేపథ్యంలో హీరో యశ్కు ‘కాంతార’ హీరో రిషబ్ శెట్టి మద్దతుగా నిలిచారు. ఈ సినిమాను, యశ్ను ప్రశంసిస్తూ సోషల్మీడియా వేదికగా సుదీర్ఘమైన పోస్ట్ పెట్టారు. ‘‘ఒక నటుడిగా ఏదైనా పాత్ర చేస్తున్నప్పుడు.. దానికి పూర్తిస్థాయిలో ప్రాణం పోసేందుకు మనస్పూర్తిగా ప్రయత్నిస్తాం. ఒక బలవంతుడి పోరాటాన్ని తెరపై చూపించిన విధానం నన్ను ఎంతో ఆకట్టుకుంది. ఈ సినిమా కథ, పాత్రల ప్రయాణం.. సాధారణ చిత్రాల్లా కమర్షియల్ పంథాలో సాగకపోవచ్చు. అంతమాత్రాన వాళ్లు ఎంచుకున్న దారి తప్పు అని కాదు. ఒక ఆలోచనను సినిమాగా మలచి, తెరపైకి తీసుకురావడం వెనుక ఎంతో భారీ శ్రమ దాగి ఉంటుంది’’ అని రిషబ్ పేర్కొన్నారు. ఇక ఈ సినిమా కోసం, తన పాత్ర కోసం యశ్ పడిన కష్టాన్ని రిషబ్ ప్రత్యేకంగా అభినందించారు. ఇదొక సాహసోపేతమైన ప్రయోగమని, యశ్కు తాను ఎప్పుడూ అండగా ఉంటానని స్పష్టం చేశారు. ‘కన్నడ సినిమాను అంతర్జాతీయ స్థాయ


న్యూఢిల్లీ: 'వికసిత్' (అభివృద్ధి చెందిన) దేశంగా మారాలంటే.. భారత్ 'మాదకద్రవ్య రహిత' దేశంగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఆదివారం 137వ 'మన్ కీ బాత్' కార్యక్రమం ద్వారా జాతిని ఉద్దేశించి పిఎం మోడీ మాట్లాడుతూ.. దేశ భవిష్యత్తును కాపాడటమే ప్రభుత్వ సంకల్పమని అన్నారు. ప్రభుత్వం చేపట్టిన 'వికసిత్ భారత్ కోసం నషా-ముక్త్ యువ' ప్రచారాన్ని ఆయన ప్రశంసించారు. ఇందులో పెద్ద సంఖ్యలో ప్రజలు, ముఖ్యంగా యువత చురుకుగా పాల్గొంటున్నారని ఆయన తెలిపారు.డ్రగ్స్ ఫ్రీ యువత, భారతదేశమే ప్రభుత్వ లక్ష్యం అని ప్రధాని స్పష్టం చేశారు. మాదకద్రవ్యాల వ్యసనానికి వ్యతిరేకంగా, యువత వాటికి ఎందుకు దూరంగా ఉండాలనే సందేశాన్ని వివిధ భాషల్లో వ్యాప్తి చేయాలని ఆయన కంటెంట్ క్రియేటర్లను కోరారు."మాదక ద్రవ్యాల వ్యసనం మొత్తం కుటుంబాలను, సమాజాన్ని కబళిస్తుంది. దానికి వ్యతిరేకంగా అవగాహన కల్పిస్తూ, వ్యసనంతో బాధపడుతున్న వ్యక్తులకు సహాయం చేయడానికి ముందుకు వచ్చే వారిని నేను అభినందిస్తున్నాను. మాదక ద్రవ్యాల వల్ల కలిగే ప్రమాదాలను ఎత్తిచూపుతూనే, వాటి నుండి కోలుకునే మార్గాన్ని కూడా చూపించే శక్తివంతమైన నినాదాలు, పాటలు, లఘు నాటకాలను మీరు రూపొం


ఢిల్లీ: మాదకద్రవ్యాల వల్ల నష్టాలు అధికం అని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. నషా ముక్త్ యువ భారత్ కార్యక్రమాన్ని ప్రచారం చేయాలని అన్నారు. మోడీ మన్ కీ బాత్ 137వ ఎపిసోడ్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేశం డ్రగ్స్ రహిత భారత్ గా మారాలని, డ్రగ్స్ కు బానిసైతే వ్యక్తికే కాకుండా సమాజానికీ నష్టమని మోడీ హెచ్చరించారు. డ్రగ్స్ కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టండని, నషా ముక్త్ యువ హ్యాష్ ట్యాగ్స్ పేరుతో పోస్టులు పెట్టండని సూచించారు. పిఎం స్వనిధి ద్వారా మహిళా సాధికారత సాధ్యమైందని, పిఎం స్వనిధి ద్వారా 35 లక్షల మంది మహిళలు లబ్ధి పొందారని, వ్యాపార వృద్ధికి పిఎం స్వనిధి ఉపయోగపడుతుందని నరేంద్ర మోడీ పేర్కొన్నారు.









మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణను ప్రపంచ స్థాయి గోల్ఫ్ టూరిజం కేంద్రంగా తీర్చిదిద్దేందు కు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోందని పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. ఇందులో భాగంగా శామీర్పేట సమీపంలోని జవహర్నగర్లో 130 ఎకరా ల్లో గోల్ఫ్ కోర్సు ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి జూపల్లి చెప్పారు. సోమశిలలో మరో ప్రపంచస్థా యి కోర్సు కృష్ణానది తీరంలో, నల్లమల అడవులు, అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పర్యాటక క్లస్టర్ సోమశిలలో మరో ప్రపంచస్థాయి గోల్ఫ్ కోర్సు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. క్రీడల ప్రచారానికి కపిల్ దేవ్ సేవలు వినియోగించుకుంటామన్నారు. తెలంగాణ గోల్కొండ మాస్టర్స్ 12వ ఎడిషన్ సందర్భంగా శనివారం గోల్కొండలోని హైదరాబాద్ గోల్ఫ్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ డిపి వరల్డ్ ప్రొఫెషనల్ గోల్ఫ్ టూర్ ఆఫ్ ఇండియా (డిపి వరల్ పిజిటీఐ), హైదరాబాద్ గోల్ఫ్ అసోసియేషన్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ టోర్నీకి ఈవెంట్ పార్ట్నర్గా తెలంగాణ టూరిజం వ్యవహారిస్తోందన్నారు. హైదరాబాద్ గోల్ఫ్ అసోసియేషన్ కెప్టెన్ జస్విందర్ సింగ్ బిర్గి మాట్లాడుతూ ఈ టోర్నమెంట్కు రూ.కోటి ప్రైజ్మనీగా

ఫిరోజ్పూర్ (పంజాబ్): పంజాబ్లో ఓ ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) నాయకుడు దారుణ హత్యకు గురయ్యారు. ఫిరోజ్పూర్లో గుర్తు తెలియని దుండగులు.. ఆప్ నేత గుర్ ప్రీత్ సింగ్(అలియాస్ గోపి) ను కాల్చి చంపారని పోలీసులు ఆదివారం తెలిపారు. ఈ ఘటన శనివారం సాయంత్రం జరిగింది. జిల్లాలోని మామ్డోట్ పట్టణంలో గోపి, 22 ఏళ్ల హర్ప్రీత్ అలియాస్ హ్యాపీతో కలిసి మోటార్సైకిల్పై వెళ్తుండగా దుండగులు ఈ దాడికి పాల్పడ్డారు.కారులో వచ్చిన నలుగురు దుండగులు ప్రధాన మార్కెట్ వద్ద వాహనం దిగి, గోపీ, హర్ప్రీత్లపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన గోపిని వెంటనే సివిల్ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు తెలిపారు. మరోవైపు, హర్ప్రీత్ను చికిత్స కోసం లూథియానాలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించిన పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్నారు.



