
అమరావతి: గూగుల్ రాక ఎపికి గేమ్ ఛేంజర్ అని ఎపి సిఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. ఇది దేశచరిత్రలో గుర్తుంచుకోదగిన రోజు అని అన్నారు. ఈ సందర్భంగా తుర్లాడలో సిఎం మీడియాతో మాట్లాడారు. విశాఖ పట్నం చాలా అందమైన ప్రదేశం అని ఎపి చరిత్రలో మరిచిపోలేని రోజు అని ఈ ప్రాజెక్టు రాక ఉత్తరాంధ్రకు గర్వకారణం కొనియాడారు. టెక్నాలజీలో ఎపి సగర్వంగా తలెత్తుకుని నిలబడుతుందని, ఆసియాలోనే అతిపెద్ద డేటా సెంటర్ అని టెక్నాలజీలో దేశానికి ఎపి గేట్ వేగా నిలుస్తుందని చంద్రబాబు తెలియజేశారు. ఎపి భారత్ గ్రోత్ ఇంజిన్ గా మారబోతుందని, ప్రపంచం గూగుల్ ను ఎంచుకుంటే, గూగుల్ ఎపిని ఎంచుకుందని ఆనందాన్నివ్యక్తం చేశారు. ఎపిలో ఇవాళ్టి నుంచి సరికొత్త అధ్యాయం ప్రారంభమైందని, త్వరలోనే ప్రతీ సిటిజెన్ ఎఐ అసిస్టెంట్ ను ఆశ్రయిస్తారని పేర్కొన్నారు. ఆస్ట్రేలియా, అమెరికాను కలిపేలా కేబుల్ నిర్మాణం అని ఎపి లాజిస్టిక్ హబ్ గా మారాలన్నదే తన లక్ష్యం అని దీనికి కేంద్రం నుంచి మద్దతు కోరుతున్నామని అన్నారు. ఎంవోయూ చేసుకోవడమే కాదు, దాన్ని ముందుకు తీసుకెళ్లడంపై ఫోకస్ పెడుతున్నామని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.












