కోల్‌కతా: మామిడి పండ్లు ఇస్తానని చెప్పి ఇంట్లో తీసుకెళ్లి బాలికపై జవాన్ అత్యాచారం చేయడానికి ప్రయత్నించిన సంఘటన పశ్చిమ బెంగాల్ రాష్ట్రం వెస్ట్ బుర్దాన్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... అసనన్‌సోల్ ప్రాంతంలో పదేళ్ల బాలిక తన స్నేహితురాలు బాలికతో కలిసి మామిడి పండ్ల కోసం సిఐఎస్‌ఎఫ్ క్వార్టర్స్‌లోకి వెళ్లింది. రమాకాంత్ విశ్వకర్మ అనే జవాన్ బాలికలకు మామిడ పండ్లు ఇస్తానని ఆశ చూపాడు. అనంతరం పదేళ్ల బాలికను తన రూమ్‌లోకి తీసుకెళ్లి అత్యాచారం చేయబోయాడు. బాలిక కేకలు వేయడంతో స్థానికులు గమనించారు. అక్కడి నుంచి జవాన్ తప్పించుకున్నాడు. బాలిక తన తల్లిదండ్రులకు జరిగిన విషయం చెప్పడంతో స్థానికలతో కలిసి ధర్నాకు దిగారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు. సీతల్ పూర్ గేట్ నం3 వద్ద నిందితుడు రమాకాంత్‌ను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.