
కుత్బుల్లాపూర్: మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా కుత్బుల్లాపూర్ ప్రాంతం సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలోని వైష్ణవి నగర్ లో లక్ష్మి గణపతి దేవాలయంలో చోరీ జరిగింది. గుడికి ఆనుకుని ఉన్న ఆక్సిజన్ పార్కు నుంచి ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు దేవాలయంలోనికి ప్రవేశించారు. గుడిలోని హుండీతో సహా గర్భ గుడిలోని నగలను అపహరించారు. అనంతరం దొంగలు హుండీని పార్కులో వదిలి పారిపోయారు. సోమవారం ఉదయం అర్చకులు వచ్చి చూసేసరికి గుడి తాళాలు తెరిచిఉండటంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి సిసి కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు.











