నవతెలంగాణ – హైదరాబాద్ : కరీంనగర్ జిల్లా వీణవంక మండలంలోని వల్భాపూర్-జగ్గయ్యపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుపై వెళ్తున్న ఎడ్లబండి కిందకు బైక్‌ దూసుకెళ్లడంతో ఇద్దరు యువకులు అక్కడిక్కడే చనిపోయారు. ఈ ఘటనలో జమ్మికుంటకు చెందిన సురేందర్‌, దేవేందర్‌ చనిపోగా.. శ్రీవాస్తవ్ అనే యువకుడికి తీవ్రగాయాలయ్యాయి. చల్లూరులోని బంధువులు ఇంటికి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

The post ఎడ్లబండి కిందకు దూసుకెళ్లిన బైక్‌.. ఇద్దరు మృతి appeared first on Navatelangana.