నవతెలంగాణ – హైదరాబాద్ : తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటుపై సందిగ్ధత కొనసాగుతోంది. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని టీవీకే అధ్యక్షుడు విజయ్‌ రెండు సార్లు విజ్ఞప్తి చేసినా.. గవర్నర్‌ తిరస్కరించిన విషయం తెలిసిందే. దీంతో గవర్నర్‌ తీరుపై విజయ్‌ కోర్టుకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరిపారు. మరోవైపు గవర్నర్‌ తీరును నిరసిస్తూ కాంగ్రెస్‌ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపట్టింది.

The post తమిళనాడులో గవర్నర్‌ తీరు.. కోర్టుకు విజయ్‌ appeared first on Navatelangana.