ఎండ తీవ్రతతో ఇబ్బంది పడుతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణశాఖ చల్లని కబురు అందించింది. ద్రోణి ప్రభావంతో ఏపీ, తెలంగాణలో వర్షాలు కురవనున్నాయి. రానున్న మూడ్రోజుల పాటు వర్షసూచన జారీ చేసింది. ఎండ ప్రభావంతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు ఇది కాస్త ఉపశమనం కలిగించే వార్త అని చెప్పవచ్చు.