ఐపీఎల్‌ 2026 రెండో క్వాలిఫయర్‌లో గుజరాత్‌ టైటాన్స్‌ ఫైనల్‌కు చేరుకున్నప్పటికీ, 15 ఏళ్ల వైభవ్‌ సూర్యవంశీ తన విధ్వంసకర బ్యాటింగ్‌తో అందరి ప్రశంసలు అందుకున్నాడు. 47 బంతుల్లో 96 పరుగులు చేసి రాజస్థాన్‌కు పోరాట పటిమను చూపించాడు. అతని ఆటతీరుపై శుబ్‌మన్‌ గిల్‌ సైతం ప్రశంసల వర్షం కురిపించాడు.