తెలంగాణ రాష్ట్ర స్థాపనే ఏకైక లక్ష్యంగా ఏర్పాటైన గులాబీ పార్టీ పాతిక వసంతాలు పూర్తి చేసుకుంది. జలదృశ్యంలో 2001లో మొదలైన TRS పార్టీ 2014లో ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుతో తెలంగాణ జనదృశ్యాన్ని సాక్షాత్కారం చేసింది. తర్వాత దేశ వ్యాప్తంగా విస్తరించేందుకు BRSగా మారి పాతికేళ్ల రాజకీయ ప్రస్థానం పూర్తి చేసుకుంది.