సద్గురు జగదీష్ వాసుదేవ్ పిల్లల పెంపకంపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశమయ్యాయి. పిల్లలు మీ ఆస్తి కాదని, వారిని నియంత్రించడం మానేసి స్నేహితుడిలా మెలగాలని ఆయన తల్లిదండ్రులకు సూచించారు. అధికారం చెలాయించడం వల్ల వారి ఎదుగుదల దెబ్బతింటుందని, వారిని అర్థం చేసుకోవడమే అసలైన బాధ్యతని ఆయన స్పష్టం చేశారు. తల్లిదండ్రులు తమ అహంకారాన్ని పక్కన పెట్టి పిల్లలకు మంచి తోడుగా ఉండాలని, వారి స్వేచ్ఛను గౌరవించాలని సద్గురు హితవు పలికారు.