ఖరీదైన సైబీరియన్ హస్కీ కుక్కలు వీధుల్లో తిరుగుతున్న ఉదంతం కలకలం సృష్టిస్తోంది. విదేశీ జాతికి చెందిన ఈ ఖరీదైన కుక్కలను పెంచలేక నడిరోడ్డుపై వదిలేస్తున్నారు యజమానులు. సంగారెడ్డి జిల్లాలో వెలుగుచూసిన ఈఘటనపై బీడీఎల్ భానూరు పోలీసులు వేగంగా స్పందించారు. నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు.