ప్రతి నెలా మొదటి తేదీన చమురు కంపెనీలు వంట గ్యాస్ ధరలను సవరిస్తుంటాయి. ఈ క్రమంలో మే 1 నుంచి గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ముఖ్యంగా కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికల ప్రక్రియ ముగియగానే ప్రభుత్వ చమురు కంపెనీలు ధరల పెంపుపై నిర్ణయం తీసుకోవచ్చని భావిస్తున్నారు.