అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతున్న వేళ అధికారిక ట్రెండ్స్‌లో ఆసక్తికర మార్పులు కనిపిస్తున్నాయి. అస్సాంలో బీజేపీ ముందంజలో ఉండగా, కేరళలో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది. తమిళనాడులో త్రిముఖ పోటీ ఉత్కంఠ రేపుతోంది. పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ లీడ్‌లో ఉండగా, పుదుచ్చేరిలో ఏఐఎన్ఆర్సీ ముందంజలో ఉంది. తుది ఫలితాలపై ఉత్కంఠ కొనసాగుతోంది.