విజయనగరం జిల్లాలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. భోగాపురం మండలం జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. శ్రీకాకుళం నుంచి విశాఖలోని సింహాచలం ఆలయానికి దర్శనం వెళ్లి తిరిగి వస్తుండగా, వేగంగా వచ్చిన బైక్ ముందున్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో యువకుడు, అతని అత్త, నాలుగేళ్ల చిన్నారి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.