అనకాపల్లి జిల్లాలో ఓ టీవీ యాంకర్ గెద్దాడ మేరీ అలియాస్ మధుశ్రీ దొంగతనం కేసులో అరెస్టయ్యారు. ఆమె భర్త స్నేహితుడు లోకనాథ్‌తో కలిసి ఇళ్లల్లో చోరీలు చేసి, బంగారం, వెండి అపహరించినట్లు పోలీసులు తెలిపారు. ఈ దొంగల జంట పగటిపూట ఇళ్లను రెక్కీ చేసి, రాత్రి వేళల్లో తాళాలు పగలగొట్టి దోచుకునేది.