బెంగళూరు: రైలు ఢీకొని ముగ్గురు మృతి చెందిన సంఘటన కర్నాటక రాష్ట్రం బెంగళూరు రూరల్ జిల్లా దొడ్డబల్లాపుర రైల్వే స్టేషన్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం....ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం హిందూపురం ప్రాంతానికి చెందిన్ ఇర్ఫానా(48) మరో రుకియా(13), రాకియా(08) అనే బాలికలతో కలిసి దొడ్డబల్లాపుర రైల్వే స్టేషన్‌లో ట్రాక్ దాటుతుండగా రైలు ఢీకొట్టడంతో ముగ్గురు ఘటనా స్థలంలోనే చనిపోయారు. దొడ్డబళ్లపురలో బంధువుల ఇంటికి వచ్చి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.