
విండ్హోక్: జింబాబ్వే, నమీబియా, సౌతాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న ట్రై సిరీస్లో సౌతాఫ్రికా బోణీ కొట్టింది. తొలి మ్యాచ్లో పసికూన నమీబియా చేతిలో ఘోర ఓటమిని మూటగట్టుకున్న సౌతాఫ్రికా జట్టు.. శనివారం జింబాబ్వేతో జరిగిన రెండో మ్యాచ్లో ఘన విజయం సాధించింది. సికూన నమీబియా ఈ మ్యాచ్లో సౌతాఫ్రికా జట్టు 7 వికెట్ల తేడాతో జింబాబ్వేను చిత్తు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే నిర్ణీత 145 పరుగులు చేయగా.. అనంతరం లక్ష ఛేదనకు దిగిన సఫారీ టీమ్ భీకర బ్యాటింగ్తో 13.4 ఓవర్లలోనే కేవలం 3 వికెటుల మాత్రమే కోల్పోయి లక్షాన్ని అందుకుంది. డెవాల్ బ్రెవిస్ (75 నాటౌట్) విధ్వంసం సృష్టించి ఒంటిచేత్తో జట్టుకు విజయాన్ని కట్టబెట్టాడు. ఓపెనర్లు ప్రిటోరియస్(22), జోర్డాన్ హెర్మన్(20) విఫమైనా డెవాల్ చెరేగిపోయాడు. జింబాబ్వే బౌలర్లలో బ్రాడ్ ఎవన్స్, బ్లెసింగ్ ముజరబానీ, నైమురి తలా ఒక వికెట్ పడగొట్టారు. అంతకముందు జింబాబ్వే 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. ఓపెనర్ బ్రియాన్ బెన్నెట్ (34), మరుమనీ (30) టాప్ స్కోరర్లు.











