ఢిల్లీ: మాదకద్రవ్యాల వల్ల నష్టాలు అధికం అని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. నషా ముక్త్ యువ భారత్ కార్యక్రమాన్ని ప్రచారం చేయాలని అన్నారు. మోడీ మన్ కీ బాత్ 137వ ఎపిసోడ్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేశం డ్రగ్స్ రహిత భారత్ గా మారాలని, డ్రగ్స్ కు బానిసైతే వ్యక్తికే కాకుండా సమాజానికీ నష్టమని మోడీ హెచ్చరించారు. డ్రగ్స్ కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టండని, నషా ముక్త్ యువ హ్యాష్ ట్యాగ్స్ పేరుతో పోస్టులు పెట్టండని సూచించారు. పిఎం స్వనిధి ద్వారా మహిళా సాధికారత సాధ్యమైందని, పిఎం స్వనిధి ద్వారా 35 లక్షల మంది మహిళలు లబ్ధి పొందారని, వ్యాపార వృద్ధికి పిఎం స్వనిధి ఉపయోగపడుతుందని నరేంద్ర మోడీ పేర్కొన్నారు.