
న్యూఢిల్లీ : విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్పిఐ) ఆగస్టు నెలలో భారతీయ ఈక్విటీలలో రూ. 30,919 కోట్లు పెట్టుబడి పెట్టారు. ఎఫ్పిఐలు వరుసగా రెండో నెల కూడా కొనుగోలుదారులు గా నిలిచారు. జూలైలోని రూ. 20,200 కోట్ల పెట్టుబడుల తర్వాత ఈ సానుకూల మార్పు వచ్చింది. అయితే 2026లో ఇప్పటివరకు వారు రూ. 2.23 లక్షల కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. కంపెనీల లాభాలు మెరుగుపడటం, రూపాయి స్థిరత్వం, ఎఐ ట్రేడ్ రివర్సల్ పెట్టుబడులు తిరిగి రావడానికి ముఖ్య కారణాలని జియోజిత్ చీఫ్ స్ట్రాటజిస్ట్ వి.కె.విజయ కుమార్ పేర్కొన్నారు.











