
3652 వార్తలు

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీల అమల్లో ఘోర వైపల్యం చెందిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. ఫలితంగా రాష్ట్రంలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. రబీ సీజన్లో క్వింటాలుకు రూ.500 బోనస్ చెల్లించాలని, తాలు, తరుగు, తేమ పేరు చెప్పి దోచుకుంటున్న దళారుల నుండి రైతును ఆదుకుని ప్రతి గింజను ఎమ్మెస్పీ ధరకు కొనుగోలు చేయాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి బండి సంజయ్ శుక్రవారం మూడు పేజీల బహిరంగ లేఖ రాశారు. కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకాన్ని సైతం రాష్ట్రంలో పూర్తిస్థాయిలో అమలు చేయకపోవడంవల్ల ఆ పథకం ద్వారా తెలంగాణ రైతులు ప్రయోజనం అందుకోలేకపోతుండటం బాధాకరమని తెలిపారు. ముఖ్యంగా వడ్లు, మొక్కజొన్న, శనగ కొనుగోలులో ప్రభుత్వ నిర్లక్ష్యం ధోరణితో వ్యవహరిస్తోందని విమర్శించారు.మండుతున్న ఎండలు, వడగాడ్పులు, అకాల వర్షాలతో తెలంగాణ రాష్ట్ర రైతాంగం అల్లాడిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. వడ్లు, మక్కజొన్న,శనగలు, పొద్దుతిరుగుడుసహా రైతులు పండించిన పంటలను అమ్ముకోవడానికి నానా ప

సీనియర్ ఐపిఎస్ అధికారిణి శిఖా గోయల్ శుక్రవారం రాష్ట్ర హోం శాఖ ముఖ్య కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు. అదే సమయంలో ఆమె సైబర్ సెక్యూరిటీ బ్యూరో, ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ(ఎఫ్ఎస్ఎల్) డైరెక్టర్గా పూర్తి అదనపు బాధ్యతలను కొనసాగించనున్నారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆమె మాట్లాడుతూ సంబంధిత శాఖాధిపతులు ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ హోం శాఖ పరిధిలోని పోలీస్, జైళ్లు, అగ్నిమాపక సేవలు, ప్రాసిక్యూషన్ డైరెక్టరేట్ వంటి వివిధ సంస్థలను మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. సైబర్ నేరాలు, ఫోరెన్సిక్ సైన్స్ రంగాల్లో విశేష అనుభవం ఉన్న శిఖా గోయల్ నియామకం హోం శాఖలో సాంకేతిక ఆధారిత పరిపాలనకు దోహదపడుతుందని అధికార వర్గాలు భావిస్తున్నాయి.

హైదరాబాద్: మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న చిత్రం ‘పెద్ది’. బుచ్చిబాబు సనా దర్శకత్వంలో విలేజ్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కింది. అయితే పలు కారణాల వల్ల ఈ సినిమా విడుదల వాయిదా పడుతూ వస్తోంది. దీంతో అభిమానులకు నిరాశే ఎదురవుతోంది. కాగా, తాజాగా సినిమా విడుదల తేదీని అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా జూన్ 4న విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమాలో కన్నడ స్టార్ శివ రాజ్కుమార్, జగపతి బాబు, దివ్యేందు తదితరులు కీలక పాత్రలు పోషించారు. కోలీవుడ్ స్టార్ హీరోయిన్ శృతి హాసన్ ఈ సినిమాలో స్పెషల్ సాంగ్లో చిందులు వేసింది. ఇప్పటికే ఈ సాంగ్ షూటింగ్ కూడా పూర్తయింది. ఎఆర్ రహమాన్ ఈ సినిమాకు సంగీతం అందించారు. దీంతో ఇక సినిమాకు సంబంధించిన మిగితా పనులు పూర్తి చేసుకొని పెద్ది రిలీజ్కి రెడీ అవుతోంది. దీంతో చరణ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. Meet #PEDDI on June 4th ❤️🔥See you in Cinemas. pic.twitter.com/axzrkheBIe— Ram Charan (@AlwaysRamCharan) May 1, 2026

Government Hospital Medical Breakthrough, Child Liver Transplant Success ఉస్మానియా జనరల్ హాస్పిటల్ 18 నెలల చిన్నారికి కాలేయ మార్పిడి చేసి చరిత్ర సృష్టించింది. గ్లైకోజెన్ స్టోరేజ్ డిసీజ్ తో బాధపడుతున్న బాలుడికి, తండ్రి దానం చేసిన కాలేయంతో 14 గంటల శస్త్రచికిత్స విజయవంతమైంది. ఆరోగ్యశ్రీ పథకం కింద ఉచితంగా జరిగిన ఈ క్లిష్టమైన సర్జరీ, ప్రభుత్వ ఆసుపత్రుల సామర్థ్యాన్ని చాటిచెప్పింది. ఇది పేదలకు మెరుగైన వైద్యం అందించడంలో ఉస్మానియాకు గర్వకారణం.

జైపూర్: ఇండియన్ ప్రీమియర్ లీగ్లో భాగంగా సవాయ్ మాన్సింగ్ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్తో జరుగుతున్న మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. టేబుల్ టాపర్లు పంజాబ్ కింగ్స్ని ఓడించి మంచి జోష్లో ఉన్న రాజస్థాన్ ఈ మ్యాచ్లో గెలిచేందుకు ఆశపడుతోంది. మరోవైపు వరుసగా ఓటముల పాలవుతున్న ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకి ఈ మ్యాచ్లో విజయం కీలకం కానుంది. ఈ మ్యాచ్లో రాజస్థాన్ రెండు మార్పులు చేసింది. ఢిల్లీ మూడు మార్పులు చేసింది. తుది జట్లు: ఆర్ఆర్: యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, ధృవ్ జురేల్(కీపర్), రియాన్ పరాగ్(కెప్టెన్), డొనొవాన్ ఫెరీరా, రవీంద్ర జడేజా, శుభమ్ దూబే, జోఫ్రా ఆర్చర్, రవి బిష్ణోయ్, నాండ్రే బర్గర్, బ్రిజేశ్ శర్మ. డిసి: కెఎల్ రాహుల్(కీపర్), పాతుమ్ నిస్సాంక, నితీష్ రాణా, సమీర్ రిజ్వీ, అక్షర్ పటేల్(కెప్టెన్), అశుతోష్ శర్మ, కైలీ జెమీసన్, మిచెల్ స్టార్క్, కుల్దీప్ యాదవ్, టి నటరాజన్.

దేశంలోనే జీఎస్టీ వృద్ధిలో తెలంగాణ రెండో స్థానంలో నిలిచింది. మొదటి స్థానంలో కర్ణాటక నిలిచింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో జీఎస్టీ రాబడి వసూళ్లు గతేడాది ఏప్రిల్తో పోలిస్తే ఈ ఏప్రిల్లో 35 శాతం అధిక వృద్ధిని నమోదు చేసింది. ఈ సంవత్సరం ఏప్రిల్ నెలలో అధిక పనితీరును వాణిజ్య పన్నుల శాఖ నమోదు చేసింది. ఏప్రిల్ 2025లో రూ.3,433 కోట్ల జీఎస్టీ రాబడి రాగా ఈ సంవత్సరం ఏప్రిల్లో జీఎస్టీ రాబడి రూ.4,621 కోట్లుగా నమోదయ్యింది. గతేడాది కన్నా ఈ సంవత్సరం రూ.1,188 కోట్ల రాబడి వాణిజ్య పన్నుల శాఖకు అధికంగా వచ్చింది. దీంతో ఈ సంవత్సరం ఈ శాఖ 35 శాతం వృద్ధిని నమోదు చేయడం విశేషం. ఏప్రిల్లో వచ్చిన రూ.4,621 కోట్ల జీఎస్టీ ఆదాయం, జీఎస్టీ ప్రారంభమైనప్పటి నుంచి అత్యధికంగా వచ్చిన రాబడిగా నమోదు కావడం విశేషం. మార్చి 2026 నెలలో వాణిజ్య పన్నుల శాఖకు రూ.4,231 కోట్ల రాబడి రాగా, ఏప్రిల్లో అది మరింత పెరగడం విశేషం. రాష్ట్ర జీఎస్టీ ఆదాయం నాలుగు నెలలుగా నిరంతరం రూ.4 వేల కోట్లకు పైగా నమోదవుతోంది, జనవరి 2026 నుంచి వాణిజ్య పన్నుల శాఖ రాబడిని అధిగమిస్తూ వస్తోంది. ఈ నాలుగు నెలల్లో వాణిజ్య పన్నుల శాఖ ద్వారా వసూలయిన మొత్తం ఆదాయంలో పెట్రోల్


మే డే సందర్భంగా పంజాబ్లో ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించారు. అయితే ఈ సమావేశాల్లో రచ్చ జరిగింది. పంజాబ్ సిఎం భగవంత్ మాన్ మద్యం సేవించి అసెంబ్లీకి వచ్చారని ప్రతిపక్ష సభ్యులు ఆరోపించారు. ఆయన మాట్లాడుతూ పలు మార్లు తడబడ్డారని అన్నారు. సభ్యులందరికీ బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేయించాలని స్పీకర్ను కోరారు. సిఎం ప్రజల సమక్షంలో డోప్ టెస్ట్ చేయించుకోవాలని డిమాండ్ చేశారు. అయితే ఈ డోప్ పరీక్ష డిమాండ్ను స్పీకర్ తిరస్కరించారు. ప్రతిపక్షాల నిరసనలతో సిఎం భగవంత్ మాన్ స్పందించారు. ఈ సమావేశం కార్మిక దినోత్సవం కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిందని.. దయచేసి సభ్యులంతా సభా మర్యాద పాటించాలని కోరారు.

అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో సమీప భవిష్యత్తులో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశాన్ని పూర్తిగా కొట్టిపారేయలేమని ప్రభుత్వ వర్గాలు శుక్రవారం వెల్లడించాయి. గత నాలుగేళ్లుగా ఇంధన రిటైల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నప్పటికీ, చమురు కంపెనీలకు భారీ నష్టాలు వస్తున్నాయని పేర్కొన్నాయి. ఈ వారం అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు బ్యారెల్కు 126 డాలర్ల వరకు చేరి నాలుగేళ్ల గరిష్ఠ స్థాయిని తాకాయి. అనంతరం కొంత తగ్గినా, ధరలు ఇంకా 110 డాలర్లకు పైగానే కొనసాగుతున్నాయి. హార్మూజ్ జలసంధి మార్గంలో నౌకాయాన రాకపోకలు పరిమితమవడం, అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగడం ఇందుకు ప్రధాన కారణాలుగా పేర్కొంటున్నారు.ఇదిలా ఉండగా, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) పరిశ్రమ తరఫున ప్రకటన విడుదల చేస్తూ, అంతర్జాతీయ ఇంధన వ్యయాలు పెరిగినా ప్రస్తుతం పెట్రోల్, డీజిల్, గృహ వినియోగ ఎల్పీజీ ధరలను పెంచడం లేదని తెలిపింది. అయితే వాణిజ్య ఎల్పీజీ, పారిశ్రామిక డీజిల్, 5 కిలోల ఎల్పీజీ సిలిండర్లు, అంతర్జాతీయ విమానయాన సంస్థలకు సరఫరా చేసే జెట్ ఇంధన ధరలను మాత్రం పెంచినట్లు వెల్లడించింది. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ

కేంద్ర ప్రభుత్వం కమర్షియల్ గ్యాస్ ధరలను భారీగా పెంచడంపై రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం సామాన్యుడి నడ్డీ విరిచేలా ఉందని ఆయన మండిపడ్డారు. 19 కేజీల కమర్షియల్ గ్యాస్ ధరను ఏకంగా 993 రూపాయలు పెంచడాన్ని మంత్రి తీవ్రంగా తప్పుబట్టారు. ఒక్కసారిగా 30 నుంచి 35 శాతం ధర పెంచడం ఏంటని ఆయన ప్రశ్నించారు.ఈ పెంపు వల్ల హోటళ్లు, కేప్లు, రెస్టారెంట్లతో పాటు రోడ్ల పక్కన వ్యాపారం చేసుకునే చిరు వ్యాపారులపై కోలుకోలేని దెబ్బ పడుతుందని మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.ఃపశ్చిమ బెంగాల్ ఎన్నికలు ముగిసిన 24 గంటల్లోపే కేంద్రం ఈ నిర్ణయం తీసుకోవడాన్ని మంత్రి తప్పుబట్టారు. ఇది ముమ్మాటికీ ప్రజలను మోసం చేయడమేనని ఆయన దుయ్యబట్టారు. కమర్షియల్ గ్యాస్ ధర పెరగడం అంటే పరోక్షంగా సామాన్యుడి జేబుకు చిల్లు పెట్టడమేనని, దీనివల్ల ప్రజల జీవన ప్రమాణాలు పడిపోతాయని మంత్రి ఉత్తమ్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం పెరిగిన ధరలతో సిలిండర్ రేటు మూడు వేలకు పైగా చేరుకుందని, కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి పెంచిన ధరలను ఉపసంహరించుకో వాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశార




హైదరాబాద్: శంషాబాద్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఒఆర్ఆర్ ఎగ్జిట్-16 వద్ద ఆగివున్న లారీని వెనుక నుంచి కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. లారీ వెనుక భాగంలో కారు ఇరుక్కుపోవడంతో మృతదేహాలు కారులోనే చిక్కుకుపోయాయి. ప్రమాదంలో మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు పట్టారు. మృతదేహాలను అతి కష్ణం మీద మృతదేహల బయటకు వెలికి తీశారు. అతి వేగమే ప్రమాదానికి గల కారణంగా తెలుస్తోంది.







హైదరాబాద్: హ్యామ్ రోడ్ల స్కామ్ ను అసెంబ్లీలో బయటపెట్టామని బిఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు. నాడు తాము చెప్పిందే ఇప్పుడు నిజమైందని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. టెండర్లు తెరవకముందే ఎలా చెబుతారని ప్రశ్నించారు. టెండర్లు తెరిచారని..సగటున 25 శాతం ఎక్సెస్ వెళ్లాయని, పంచాయితీరాజ్, ఆర్ అండ్ బి శాఖల్లో టెండర్లు ఎక్సెస్ వెళ్లాయని తెలియజేశారు. ఆర్ అండ్ బి కంటే పిఆర్ లో రెండు శాతం ఎక్కువ ఉందని, ఒక టెండర్ ఏకంగా 75 శాతం ఎక్సెస్ వేశారని అన్నారు. ఆర్ అండ్ బి లో రూ.11 వేల కోట్లతో టెండర్ పిలిస్తే రూ. 15 వేల కోట్లు అవుతుందని, పిఆర్ లో రూ. 6 వేల కోట్లతో టెండర్ పిలిస్తే దాదాపు రూ. 8 వేల కోట్లు అవుతుందని అన్నారు. రెండు శాఖలో కలిపి రాష్ట్ర ఖజానాకు రూ. 5 వేల కోట్ల అదనపు భారం పడుతుందని, హైవేలకు టెండర్లు పిలిస్తే 25 శాతం తక్కువ.. హ్యామ్ రోడ్లలో 25 శాతం ఎక్కువ అవుతుందని హరీష్ రావు పేర్కొన్నారు.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 19వ సీజన్లో ఆర్సిబి స్టార్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ అద్భుతమైన ఫామ్లో చెలరేగిపోతున్నాడు. గురువారం గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో ఆర్సిబి ఓడినప్పటికీ.. భువీ మాత్రం అదిరిపోయే ప్రదర్శన చేశాడు. నాలుగు ఓవర్లలో 28 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. దీంతో పర్పుల్ క్యాప్ (అత్యధిక వికెట్లు) రేసులో ఎస్ఆర్హెచ్ బౌలర్ ఇషాన్ మలింగా(15 వికెట్లు)ను వెనక్కి నెట్టి భువనేశ్వర్ (17 వికెట్లు) అగ్రస్థానానికి చేరాడు. అంతేకాక.. భువీ ఈ మ్యాచ్లో సరికొత్త చరిత్ర సృష్టించాడు. భారత గడ్డపై 200 ఐపిఎల్ వికెట్లు తీసిన మొట్టమొదటి బౌలర్గా భువీ రికార్డు సాధించాడు. గుజరాత్ కెప్టెన్ శుభ్మాన్ గిల్ను ఔట్ చేయడంతో భువనేశ్వర్ ఈ ఘనతను అందుకున్నాడు. భువీ తర్వాతి స్థానంలో చాహల్ (186 వికెట్లు) ఉన్నాడు. పలు ఐపిఎల్ సీజన్లు యుఎఇ, దక్షిణాఫ్రికా వేదికలుగా జరిగిన విషయం తెలిసిందే. దీంతో ఓవరాల్గా ఐపిఎల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా చాహల్(228 వికెట్లు) మొదటిస్థానంలో ఉన్నాడు. రెండో స్థానంలో భువనేశ్వర్ 215 వికెట్లతో ఉన్నాడు.
