24876 వార్తలు

మహిళా సాధికారతకు ఆధునిక మహిళా శక్తి భవనాలు 22 జిల్లాల్లో రూపుదిద్దుకుంటున్న భవన నిర్మాణ పనులు త్వరలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం ఏర్పాట్లు చేస్తున్న పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మన తెలంగాణ/హైదరాబాద్: ప్రతి ఇందిరా మహిళా శక్తి భవనంలో ‘వన్ స్టాప్ ఫెసిలిటీ సెంటర్’ ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించింది. మహిళా పారిశ్రామికవేత్తలకు వ్యాపార సలహాలు, ప్రాజెక్టు నివేదికల తయారీ, రిజిస్ట్రేషన్, లైసెన్సులు, నైపుణ్యాభివృద్ధి, బ్యాంకు రుణాల అనుసంధానం, మార్కెట్ లింకేజీ, బ్రాండింగ్, ప్యాకేజింగ్, ఈ- కామర్స్, ప్రభుత్వ పథకాలతో అనుసంధానం వంటి సేవలను ఒకే వేదికపై అందుబాటులోకి తీసుకురానుంది. ఈ దిశగా మహిళా శక్తి భవనాలను వేదికలుగా చేసుకుని మహిళా సాధికారితకు తోడ్పాటును అందించేందుకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. వ్యాపారం ప్రారంభించాలనుకునే మహిళలకు ఆలోచన నుంచి కార్యరూపం దాల్చే వరకు అవసరమైన మార్గదర్శకత్వం, చేయూత అందించేలా ఈ కేంద్రాలు పనిచేయనున్నాయి. దీంతో మహిళా సంఘాల సభ్యులకు వివిధ కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం తగ్గడంతో పాటు, తమ ఉత్పత్తులను వ్యాపార అవకాశాలుగా మార్చుకునేందుకు అవసరమైన సహకారం ఒకే చోట

హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో భూమి ధరలు మరోసారి రికార్డు స్థాయికి చేరాయి. రాయదుర్గ్ నాలెడ్జ్ సిటీలో 5.38 ఎకరాల ప్రభుత్వ భూమిని తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (TGIIC) నిర్వహించిన ఈ-వేలంలో రూ.1,447.22 కోట్లకు విక్రయించారు. ఎకరాకు రూ.269 కోట్ల ధర పలకడం హైదరాబాద్లో రాయదుర్గ్ భూముల వేలంలో ఇప్పటివరకు నమోదైన అత్యధిక ధరగా నిలిచింది.

అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసిసి) మహిళా క్రికెట్లో తొలిసారి ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహించేందుకు సన్నద్దమవుతోంది. వచ్చే ఏడాది ఈ టోర్నమెంట్ జరుగనుంది. ఇందులో ఆరు జట్లు తలపడతాయి. శ్రీలంక క్రికెట్ బోర్డు ఆతిథ్యంలో ఈ టోర్నీ జరుగుతుందని తొలుత వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు ఐసిసి తన నిర్ణయాన్ని మార్చుకోనుందని తెలుస్తోంది. కొత్త వేదికను వచ్చే ఐసిసి బోర్డు సమావేశంలో నిర్ణయించే అవకాశం ఉంది. దీనిపై శ్రీలంక బోర్డు స్పందించింది.. అతిథ్య హక్కులను కోల్పోయినట్లే అని బోర్డు స్పష్టం చేసింది. మరో వైదికగా మ్యాచ్లు జరిగే అవకాశం ఉందని.. ఎక్కడ అనేది మాత్రం చెప్పేనని శ్రీలంక బోర్డు తాత్కాలిక కమిటీ కార్యదర్శి ప్రకాశ్ షఫ్తెర్ తెలిపారు. శ్రీలంక బోర్డును ప్రభుత్వం నియమించిన తాత్కాలిక అడ్మినిస్ట్రేసణ్ నడిపిస్తోంది. ఐసిసి నిబంధనల ప్రకారం.. సభ్య దేశాల పాలక మండలిలో ప్రభుత్వాల జోక్యం ఉండకూడదు. దీంతో ఐసిసి బోర్డు సమావేశాల్లోనూ శ్రీలంక ప్రతినిధులకు అనుమతి లేదు. వెంటనే ఎన్నికలు నిర్వహించాలని శ్రీలంకకు ఐసిసి సూచించింది. ఇప్పటికే శ్రీలంక క్రీడా శాఖకు తాత్కాలిక కమిటీ రాజ్యాంగ ముసాయిదాను సమర్పించింది. అయితే, దానిని పార్లమ



వరుణ్ తేజ్ హీరోగా, మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన హారర్ కామెడీ చిత్రం ‘కొరియన్ కనకరాజు’. రితికా నాయక్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో కమెడియన్ సత్య కీలక పాత్ర పోషించాడు. ఆగస్టు 6న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను అలరించడంతో పాటు.. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టింది. వరుణ్-సత్యల కామెడీ, గాంధీ టేకింగ్ సినిమాను విజయపథంలో నడిపాయి. ముఖ్యంగా సత్య కామెడీ సినిమాకు హైలైట్గా నిలిచింది. ఇక ఇప్పుడు ఈ సినిమా ఒటిటిలో సందడి చేసేందుకు సిద్ధమవుతోంది. ప్రముఖ ఒటిటి సంస్థ ‘నెట్ఫ్లిక్స్’లో ఈ సినిమా సెప్టెంబర్ 4వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఒకే శరీరంలో రెండు ఆత్మలు ఉంటే ఎలాంటి సవాళ్లు ఉంటాయన్నది ఆసక్తికరంగా చూపించారు.


టీం ఇండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కొత్త రోల్లో కనిపించనున్నారు. ఇప్పటివరకూ ఆయన క్రికెటర్గా మాత్రమే మనందరికీ పరిచయం. అయితే ఆయన ఇప్పుడు బుల్లితెరపై వ్యాఖ్యాతగా సందడి చేయనున్నారు. బిగ్బాస్ బంగ్లా రియాల్టీ షోకి గంగూలీ వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నారు. దాదాపు దశాబ్ధకాలం విరామం తర్వాత బిగ్బాస్ బంగ్లా ప్రారంభం కానుంది. తొలి సీజన్కు మిథున్ చక్రవర్తి, రెండో సీజన్కు నటుడు జీత్ వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. ఆగస్టు 30 నుంచి ప్రారంభమయ్యే సీజన్-3కి గంగూలీ వ్యాఖ్యాతగా అలరించబోతున్నారు. బిగ్బాస్ వ్యాఖ్యాతగా చేయడానికి ఒప్పుకోవడం వెనుక ఉన్న కారణాన్ని గంగూలీ పంచుకున్నారు. ‘‘బిగ్బాస్ ఒక వైవిధ్యమైన షో. అందరికీ దగ్గరైన షో. సుదీర్ఘ విరామం తర్వాత బెంగాల్లో మళ్లీ మొదలవుతోంది. ఇంతకు ముందు వచ్చిన బిగ్బాస్ షోలను రోజూ చూసే సమయం ఉండేది కాదు. వీకెండ్ మాత్రం కచ్చితంగా చూసే వాడిని. ముఖ్యంగా సల్మాన్ ఖాన్ వ్యాఖ్యాతగా ఎలా చేశారో బాగా పరిశీలించా. ఇది చేయడం నాకు ఆసక్తికరంగానే ఉంది’’ అన్నారు. ఇక గ్రాండ్ ప్రీమియర్కు టీం ఇండియా మాజీ బౌలర్ హర్భజన్ సింగ్ కూడా విచ్చేసి సందడి చేశారు.




గుంటూరు: నగరంలో పట్టపగలే దారుణ హత్య జరగడం కలకలం సృష్టించింది. స్థాని కొండా వెంకటప్పయ్య కాలనీలో చిన్నా అనే వ్యక్తిని ప్రత్యర్థులు కత్తులతో నరికి చంపారు. 20 ఏళ్ల క్రితం జరిగిన ఓ హత్య కేసులో చిన్నా నిందితుడిగా ఉన్నాడు. ఘర్షణల నేపథ్యంలో అతను తెలంగాణలోని సూర్యాపేట వెళ్లి అక్కడే కుటుంబంతో జీవిస్తున్నాడు. గుంటూరులో ఉండే అతడి బాబాయ్ చనిపోవడంతో అంత్యక్రియల్లో పాల్గొనేందుకు ఆదివారం సూర్యాపేట నుంచి గుంటూరు వచ్చాడు. దీంతో ప్రత్యర్థులు కాపు కాచి చిన్నాపై దాడి చేసి దారుణంగా హత్య చేశారు. నగరం పాలెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.



అమరావతి: రెసిడెన్షియల్ స్కూల్ లో చేరకుండా గొడ్డలి పార్టీ నేతలు అడ్డుకుంటున్నారని ఎపి మంత్రి సంధ్యారాణి ఆరోపించారు. విశాఖపట్నం జిల్లాలోని మధురవాడ సమీపంలో గల గిరిజన గురుకుల పాఠశాల మారిక వలస స్కూల్ పై కొందరు రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఎస్టి విద్యార్థుల ప్రమాణాలు పెంచేందుకే సెంటర్ ఆఫ్ ఎక్స్ లైన్స్ కేంద్రాలు ఉన్నాయని, మారిక వలస రెసిడెన్షియల్ స్కూల్ లో సివొఇ ఏర్పాటు చేశామని, 445 మందిని ఇతర ప్రాంతాల్లోని పాఠశాలల్లో చేర్పించామని సంధ్యారాణి తెలియజేశారు. ఇతర స్కూళ్లలో చేరనివ్వకుండా కొందరు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. గిరిజన విద్యార్థులు ఉన్నత విద్య చదువుకోవద్దా? అని ప్రశ్నించారు. ఎస్టి విద్యార్థులు.. దేశంలోని ప్రముఖ విద్యాసంస్థల్లో చదువుకోవాలని సంధ్యారాణి కోరారు.


హైదరాబాద్: రేవంత్ రెడ్డి సర్కార్ రియల్ ఎస్టేట్ ఏజెంట్ గా మారిందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. అజామాబాద్ లో ప్రభుత్వ భూమిని రూ. 500 కోట్ల భూమిని 87 కోట్లకే ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేస్తున్నారని అన్నారు. మాజీ సిఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు లేఖ రాశారు. భూమి కొనుగోలుకు ఆయిల్ ఫెడ్ సిద్ధంగా ఉన్నా..ప్రైవేట్ వారికి ఇస్తున్నారని హరీష్ రావు విమర్శించారు. తక్షణమే అక్రమ భూకేటాయింపును రద్దు చేయాలని సూచించారు. అజామాబాద్ ఆర్ టిసి క్రాస్ రోడ్స్ లోని భూమిని ఆయిల్ ఫెడ్ కే దక్కేలా చూడాలని, ఆయిల్ ఫెడ్ కు చెందిన 3.23 గుంటల భూమిని కాపాడాలని హరీష్ రావు కోరారు.



శ్రీలంకతో జరిగిన టెస్ట్ సిరీస్లో భారత ఆల్రౌండర్ రవీంద్ర జడేజా ఎక్కువగా నోబాల్స్ వేశాడు. 2021 నుంచి ఇఫ్పటివకూ జడేజా దాదాపు 85 నోబాల్స్ వేయడం గమనార్హం. ఇక ఈ సిరీస్తో ఆరంగేట్రం చేసిన సారాంశ్ జైన్ కూడా కొన్ని నోబాల్స్ వేశాడు. .ఇదే విషయమై స్పిన్ కోచ్ సాయిరాజ్ బహుతలే మాట్లాడుతూ ‘టెస్టుల్లోనూ నో బాల్ వేస్తే ఫ్రీహిట్ ఇస్తే బాగుంటుంది’ అని అన్నారు. ఈ క్రమంలో భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ ఓ కీలక సూచన చేశారు. ఇలా పదే పదే నోబాల్స్ విసిరే బౌలర్లపై చర్యలు తీసుకోవాలని.. అదే సమయంలో బౌలింగ కోచ్ను కూడా బాధ్యుడిని చేయాలని అన్నారు. ‘‘ఇటీవల నో బాల్స్ను వేయడంపై చర్చ సాగుతోంది. ఇది అత్యంత కీలక విషయమని గుర్తించాలి. మ్యాచ్ స్వరూపాన్నే మార్చేయగలదు. ఆటగాళ్లు కొన్నింటిని కంట్రోల్ చేయగలరు. బ్యాటర్ అయితే గార్డ్ను తీసుకోవడం.. అదే బౌలర్గా నో బాల్స్ వేయకుండా ఉండటం. ఇప్పుడున్న కాలంలో ప్రతి దానిని గణించడం జరుగుతుంది. అలాంటప్పుడు బౌలింగ్ క్రీజ్ను ఎందుకు దాటాలి. ఈ తప్పిదాలు క్షమించరానివి’’ అని గావస్కర్ వ్యాఖ్యానించారు. ‘‘భారత స్పిన్ బౌలింగ్ కోచ్ సరదాగా ఆ వ్యాఖ్యలు చేశాడు. నో బాల్ వేసిన తర్వాత ఫ్రీ


న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా ఎల్ఎన్జి ధరలు భారీగా పెరగడంతో ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్ సిఎన్జిస్ ధరను కిలోకు రూ.3.89 పెంచింది. పశ్చిమాసియాలో మరోమారు నెలకొన్న సంక్షోభం, హోర్ముజ్ జలసంధి మీదుగా గ్యాస్ సరఫరా రవాణాకు అంతరాయాలు ఏర్పడటం వల్ల అంతర్జాతీయ ఎల్ఎన్జి ధరలు గణనీయంగా పెరిగాయని శనివారం ఓ ప్రకటనలో తెలిపింది. పెంచిన ఈ ధరలు శనివారం నుంచే అమల్లోకి వచ్చినట్టు పేర్కొంది. దీంతో ఢిల్లీలో సిఎన్జి ధర కిలోకు రూ.83.09 నుంచి రూ.86.98కు చేరింది. ఈ తాజా పెంపుతో ఈ ఏడాది ఢిల్లీలో సిఎన్జి ధర మొత్తం దాదాపు కిలోకు రూ.10 మేర పెరిగింది. మే రెండో వారంలో నాలుగు విడతల్లో మొత్తం రూ.6 పెంచడంతో ధర రూ.83.09కు చేరింది. తాజాగా మరో రూ.3.89 పెంచారు. ఢిల్లీ పరిసర ప్రాంతాలైన నోయిడా, ఘాజియాబాద్, గురుగ్రామ్లలో కూడా సిఎన్జి ధరలు పెరిగాయి. ప్రస్తుతం నోయిడా, ఘాజియాబాద్లో కిలో సిఎన్జి ధర రూ.95.59 కాగా, గురుగ్రామ్లో రూ.92.01గా ఉంది.

ఆమిదాలగొంది: శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మండలం ఆమిదాలగొంది వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రెండు బస్సులు ఢీకొన్నాయి. రహదారి పక్కనే ఆడుకుంటున్న ఓ బాలుడు హఠాత్తుగా రోడ్డు దాటడంతో అతడిని తప్పించబోయి కర్ణాటక ఆర్టిసి బస్సు.. స్కూల్ బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇరు వాహనాల డ్రైవర్ల కాళ్లు విరగ్గా.. 8 మంది విద్యార్థులు గాయపడ్డారు. ప్రస్తుతం వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సిసిటివి ఫుటేజ్ ఆధారంగా ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.