
3501 వార్తలు


నేను మాట తప్పితే అమరవీరుల స్తూపం వద్ద స్తంభానికి కట్టేసి కొట్టాలిఅన్ని విషయాల్లో సాధ్యాసాధ్యాలను పరిశీలించిన తర్వాతే హామీలు ఇచ్చానుసర్వోదయ తెలంగాణ లక్ష్యంగా ముందుకు వస్తున్నాంప్రతి ఒక్కరి జీవితంలో వెలుగులు నిండటమే లక్ష్యంమా నాన్న కెసిఆర్ను తిట్టలేదు.. బిఆర్ఎస్ అధ్యక్షుడిని విమర్శించాను20 ఏళ్లుగా ఇచ్చిన మాట, పట్టిన తోవను విడవలేదుప్రజాస్వామ్యంలో పార్టీ ఉండటమే పవర్ ఆ పార్టీ అధికారంలోకి వస్తుందా.. లేదా.. అన్నది ఆ పార్టీ నడిపే వ్యక్తిని బట్టి ఉంటుందిటిఆర్ఎస్ నాకు రాసిపెట్టి ఉండటం దైవ సంకల్పంగా భావిస్తున్నావెయ్యి రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దెదించుతాంమేము అధికారంలోకి వచ్చాక తల్లి మాదిరి పాలన చేస్తాంమీట్ ది ప్రెస్లో తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవితమనతెలంగాణ/హైదరాబాద్ : ప్రజలకు ఉచితంగా విద్య, వైద్యం ఇవ్వకుంటే రాళ్లతో కొట్టాలని తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) చీఫ్ కల్వకుంట్ల కవిత అన్నారు. తెలంగాణ రక్షణ సేన ప్రకటించిన పాంచజన్యంలోని ఐదు అంశాలు, ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబాల విషయంలో తాను ఇచ్చిన మాట తప్పితే గన్పార్క్లోని అమరవీరుల స్తూపం వద్ద స్తంభానికి కట్టేసి కొట్టాలని అన్నారు

మ.2 నుంచి సా.5 వరకుఉ.11 గంటల నుంచే పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిమ.1.30 గంటలకు గేట్లు మూత విద్యార్థులు అరగంట ముందే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని సూచనవిద్యార్థులు డ్రెస్ కోడ్ పాటించాలి బూట్లు వేసుకుని రావద్దు...చెప్పులతోనే రావాలి మనతెలంగాణ/హైదరాబాద్: వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం ఆదివారం(మే 3) దేశవ్యాప్తంగా నీట్ (నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్) యుజి (నీట్ యుజి 2026) నీట్ పరీక్ష జరుగనున్నది. ఈ పరీక్షకు దేశవ్యాప్తంగా సుమారు 22,79,743 మంది విద్యార్థులు రిజిష్టర్ చేసుకోగా, వారిలో 13,22,928 మంది బాలికలు, 9,46,815 మంది బాలికలు ఉన్నారు. రాష్ట్రం నుంచి నుంచి 70 వేలకుపైగా దరఖాస్తు చేసుకున్నారు. ఈ ఏడాది దేశవ్యాప్తంగా 552 నగరాలలో, విదేశాలలో 14 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇంగ్లీష్, హిందీతో పాటు 11 ప్రాంతీయ భాషల్లో పెస్ అండ్ పేపర్ పద్ధతిలో ఈ పరీక్ష నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు పరీక్ష జరుగుతుంది. ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 1.30 గంటల లోపు పరీక్షా కేంద్రాలకు అనుమతిస్తారు. నీట్ పరీక్షా కేంద్రాల వద్ద మూడంచెల భద్రతా ఏర్పాట్లను చేస్తున్నట్లు ఉన్నతాధికారు

పలు చోట్ల ధర్నాలు, నిరసనలుదుబ్బాక ప్రజాపాలనలో మైకు నేలకేసి కొట్టిన ఎమ్మెల్యే ఎర్ర జొన్న ఉద్యమంలా వరి ఉద్యమం..హెచ్చరించిన నిజామాబాద్ రైతులు రాజన్న సిరిసిల్ల, హన్మకొండలో కొనసాగిన రైతుల ఆందోళనలు కొనుగోలు కేంద్రాల్లో పేరుకుపొయిన ధాన్యం రాశులు జిపిఎస్, ఆటోమెయిల్ ట్యాగ్ విధానంతో ధాన్యం తరలింపునకు చిక్కులు ఉపసంహరించుకున్నా కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం వర్షాల నేపథ్యంలో బిక్కుబిక్కుమంటున్న అన్నదాతలు మన తెలంగాణ/హైదరాబాద్ : ఆరుగాలం కష్టపడి ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొంటూ పంటలు పండిస్తే వాటిని అమ్ముకునేందుకు రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొంటుందని రైతులు వాపోతున్నారు. కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చే ధాన్యం కొనుగోలు ఆలస్యం కావడంతో రైతులు లబోదిబో మంటున్నారు. పలు చోట్ల మొక్క జొన్న కొనుగోళ్లకు సైతం ఇదే పరిస్థితి ఉందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శనివారం అనేక ప్రాంతాల్ల్లో రాజకీయ నాయకులతో కలిసి రైతులు ధర్నాలు, నిరసలు తెలియజేశారు. రాష్ట్రంలోని వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్ంగలో మొక్క జొన్న కొనుగోళ్లు వేగవంతం చేయాలని నర్సంపేట మండలం మహేశ్వరంలో వరంగల్ ప్రధాన రహదారిపై మ

పూడికతీత పనులు చేపట్టి చెరువుల పునరుద్ధరణ చేపట్టాలి పునరుద్ధరణకు జిల్లా స్థాయిలో కమిటీల ఏర్పాటు చెరువుల అక్రమణలపై ఉక్కుపాదం తక్షణమే ఎఫ్టిఎల్ లెవల్ను గుర్తించాలి జూరాల, మూసీ ప్రాజెక్టుల పూడికతీతకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలి చిన్న నీటిపారుదల చెరువులపై వ్యవసాయ శాఖ కమిషన్ రూపొందించిన నివేదిక ప్రశంశనీయం - ఇరిగేషన్ శాఖ మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి మనతెలంగాణ/హైదరాబాద్: వేసవికాలంలో రాష్ట్ర వ్యాప్తంగా పూడికతీత పనులు చేపట్టి చిన్న తరహా చెరువులన్నింటిని పునరుద్ధరించాలని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పూడికతీత తో పునరుద్ధరించిన చెరువులు వచ్చే వర్షాకాలంలో జలాశయాలతో కళకళలాడేలాచూడాలని మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చిన్ననీటి పారుదల చెరువులపై సీనియర్ కాంగ్రెస్ నేత వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ అధ్యక్షుడు ఎం.కోదండ రెడ్డి ఆధ్వర్యంలో రూపొంచిన నివేదిక అభినందనీయమని ఆయన కొనియాడారు. ఈ నివేదికను తదుపరి చర్యల కోసం ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డికి పంపనున్నట్లు మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి వెల్లడ

సాగునీటి ప్రాజెక్టులు, రైతుల అంశాలపై చర్చప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ బిల్లులు, 100 రోజుల్లో రిటైర్మెంట్ ఉద్యోగుల బెనిఫిట్స్పై కీలక నిర్ణయాలు మనతెలంగాణ/హైదరాబాద్: కేబినెట్ భేటీ ఈనెల 04వ తేదీన జరుగనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సోమవారం మధ్యాహ్నం మూడు గంటలకు సచివాలయంలో మంత్రి మండలి సమావేశం కానుంది. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై మంత్రివర్గం చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్టుగా తెలిసింది. ముఖ్యంగా సాగునీటి ప్రాజెక్టులు, రైతుల అంశాలపై చర్చించనున్నట్లుగా సమాచారం. దీంతోపాటు ఆర్టీసిని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు ఇప్పటికే ప్రభుత్వం అంగీకరించిన నేపథ్యంలో ఈ అంశంపై చర్చించనున్నట్టుగా తెలిసింది. ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి కొన్ని కీలక అంశాలపై చర్చించి వాటిని కేబినెట్లో ఆమోదించే అవకాశం ఉన్నట్టుగా సమాచారం. ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి పీఆర్సీ నివేదిక, ఫిట్మెంట్, పెండింగ్ డిఏలు, పెండింగ్ బిల్లుల గురించి కేబినెట్ చర్చించనున్నట్టుగా తెలిసింది. 100 రోజుల్లో రిటైర్మెంట్ ఉద్యోగుల బెనిఫిట్స్ను అందించే విషయంతో పాటు ఈహెచ్ఎస్ కార్డులకు సంబంధించి కేబినెట్లో చర్చించే అవకాశం ఉందని సమాచారం.

ప్రతి గింజ కొంటామన్న కేంద్రం 25 శాతం మాత్రమే కొంటోందిరైతుల భారాన్ని మోస్తున్న రాష్ట్రం ఎంఎస్పికి చట్టబద్దత కల్పించాల్సింది కేంద్రమే బండి సంజయ్కు తుమ్మల లేఖ మన తెలంగాణ/హైదరాబాద్ : ప్రతి గింజ కొంటామన్న కేంద్రం కేవలం 25 శాతం మాత్రమే కొంటోందని, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్రమంత్రి బండి సంజయ్కు కౌంటర్ వేశారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ రాసిన బహిరంగ లేఖకు తుమ్మల ఘాటుగా సమాధానమిచ్చారు. ఈ మేరకు శనివారం ఏడు పేజీల లేఖలో కేంద్ర విధానాలను ఎండగట్టారు. ఎంఎస్పికి చట్టబద్ధత కల్పించాలని రాష్ట్రాన్ని అడగడం రాజకీయ విజ్ఞతకే వదిలేస్తున్నానని, అసలు ఆ విషయం రాష్ట్ర పరిధిలోనిదే కాదని స్పష్టం చేశారు. రాష్ట్రం రైతుల కోసం అనే పథకాలు అమలు చేస్తోందని, రైతు భరోసా, రైతు రుణమాఫీ లాంటి పథకాలు బిజెపి పాలిత రాష్ట్రాల్లో అమలు చేశారా అని నిలదీశారు. కేంద్రం ప్రతి ఏటా మద్దతు ధర ప్రకటించి, ఇక మీరు ఎక్కడైనా అమ్ముకోండి అన్నట్లుగా చోద్యం చూస్తోందని, పండించిన పంటలో కేవలం 25 శాతమే కొనుగోలు చేస్తే మిగిలిన పంటను రైతు ఎక్కడ అమ్ముకోవాలని ప్రశ్నించారు. ఇందిరా గాంధీ 1966లో ఎంఎస్పి విధానాన్ని తెస్తే, 2014 త

రెండున్నర ఇళ్ల పాలనలో కాంగ్రెస్ చేసిన మోసాలు చూసి ప్రజలు మరో 20 ఏళ్లు ఓటు వేయరుకాంగ్రెస్ పార్టీ చేస్తున్న అరాచకాలు చూసి ప్రజలు తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నారుబిజెపి ప్రజా వ్యతిరేక నిర్ణయాలు కొనసాగిస్తూనే ఉన్నదిగ్యాస్ ధరల పెంపును నిరసిస్తూ ఎక్కడికక్కడ నిరసనలు చేయాలిబిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పార్టీ నేతలతో కెటిఆర్ సమావేశంపార్టీ బలోపేతానికి చేపట్టాల్సిన చర్యలపైన దిశానిర్దేశంమనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో రెండున్నర సంవత్సరాల కాంగ్రెస్ పాలన చూసిన తర్వాత ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్కు ఓటు వేసే అవకాశమే లేదని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ అన్నారు.తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కనీసం 20 సంవత్సరాల పాటు తిరిగి అధికారంలోకి రావడం కల్ల అని పేర్కొన్నారు. అడ్డగోలుగా హామీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ సబ్బండ వర్గాలను మోసం చేసిందని, దీనికి తోడు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అవినీతి అరాచకాలు, కుంభకోణాలను ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా బిఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, సీనియర్ నేతలతో శనివారం నందినగర్ నివాసంలో కెటిఆర్ సమీక్ష సమావేశం ని

ఐదు రాష్ట్రాల శాసనసభలకు ఇటీవలే ముగిసిన ఎన్నికల ఫలితాలు సరిగ్గా 24 గంటల తర్వాత వెలువడబోతున్నాయి. ఈ ఐదు రాష్ట్రాల్లో పుదుచ్చేరి, అసోం రెండు చోట్ల భారతీయ జనతా పార్టీకే విజయావకాశాలు ఉన్నాయని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. ఈసారి గెలిస్తే అసోంలో బిజెపి హ్యాట్రిక్ కొట్టినట్టే. పుదుచ్చేరి కేవలం 30 స్థానాలతో చాలా చిన్న రాష్ట్రం కాబట్టి లెక్కల్లోకి రాదు. ఇక మిగిలింది తమిళనాడు, కేరళ, పశ్చిమబెంగాల్ ఈ మూడు రాష్ట్రాల్లో కూడా ఎట్టి పరిస్థితుల్లో తమ అడుగుపడాలని భారతీయ జనతా పార్టీ ఎప్పటినుంచో తహతహలాడుతున్న విషయం తెలిసిందే. 2014 నుంచి మూడు పర్యాయాలు కేంద్రంలో అధికారంలోకి వచ్చి కూడా ఈ మూడు రాష్ట్రాల్లో తాము అధికారంలోకి రాకపోవడం ఏమిటి అనే అసంతృప్తి భారతీయ జనతా పార్టీ అగ్రనాయకత్వంలో నెలకొని ఉన్న విషయం అప్పుడప్పుడు స్పష్టంగా బయటపడుతూనే ఉంటుంది. కేరళ, తమిళనాడు రాష్ట్రాలు రెండు దక్షిణాదిలో ఉన్నాయి. కేరళలో వామపక్షాల అధికారం నడుస్తున్నది. తమిళనాట ద్రవిడ పార్టీలు జాతీయ పార్టీలను అడుగుపెట్టనివ్వని స్థితి. ఇక పశ్చిమబెంగాల్ రాష్ట్రానిది ఒక ప్రత్యేక పరిస్థితి. అక్కడ మూడు పర్యాయాలుగా అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్ర

సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో 10న జరగనున్న జనాగ్రహ సభకు భారీగా ఏర్పాట్లుబహిరంగ సభను సక్సెస్ చేయడానికి కమలనాథుల కసరత్తు ప్రతి మండలం నుంచి 800 మందిని, డివిజన్ నుంచి 300 మందిని తీసుకురావాలని పార్టీ సూచనలుకేంద్రమంత్రులు, ఎంఎల్ఎలు, ఎంఎల్సిలకు జనసమీకరణ బాధ్యతలుసిఎం రేవంత్రెడ్డిపై వాగ్బాణాలు సంధించనున్న ప్రధాని మోడీ మన తెలంగాణ/హైదరాబాద్ః ‘జన ఆగ్రహ సభ’ పేరిట ఈ నెల 10న నిర్వహించనున్న బహిరంగ సభను బిజెపి రాష్ట్ర నాయకత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. రెండేళ్ళ తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొననున్న బహిరంగ సభకు బిజెపి భారీగా ఏర్పాట్లు చేస్తున్నది. పరేడ్ గ్రౌండ్లో నిర్వహించే జన ఆగ్రహ సభకు సుమారు పది లక్షల మందిని తీసుకుని వచ్చేందుకు ముమ్మర ఏర్పాట్లు చేపట్టారు. ప్రతి మండలానికి, డివిజన్ల నేతలకూ టార్గెట్లు పెట్టారు. ప్రతి మండలం నుంచి ఎనిమిది వందల మందిని, డివిజన్ నుంచి మూడు వందల మందిని తీసుకుని వచ్చేందుకు ఏర్పాటు చేసుకోవాలని మండల, డివిజన్ నాయకులకు సూచనలు ఇచ్చారు. కేంద్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలకు జిల్లాల వారీగా జనసమీకరణను పర్యవేక్షించే బాధ్యతను అప్పగించారు. ఇంకా రాష్ట్

మే 16 నుంచి జూన్ 16 వరకు సుదీర్ఘ వడగాలులువెల్లడించిన తెలంగాణ వెదర్ మ్యాన్ మన తెలంగాణ/హైదరాబాద్ : ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు అండమాన్, కేరళకు సకాలంలో చేరినా రాష్ట్రానికి మాత్రం ఆలస్యం కానున్నాయని, జూన్ 16 తర్వాతే రాష్ట్రంలోకి రుతుపవనాల ప్రవేశం ఉంటుందని తెలంగాణ వెదర్ మ్యాన్ వెల్లడించారు. ఈ నెల 16 నుంచి జూన్ 16 వరకు రాష్ట్రంలో సుదీర్ఘకాలం వడగాలులు కొనసాగే అవకాశం ఉందని తెలిపారు. బంగాళాఖాతంలో రీకర్వింగ్ సైక్లోన్ ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉందని, దీని ప్రభావంతో ఈ నెల 16నుంచి జూన్ 16 వరకు రాష్ట్రంలో భయంకరమైన వడగాలులు వస్తాయని హెచ్చరించారు. అయితే వాతావరణ పరిస్థితుల్లో మార్పుల ఆధారంగా స్వల్ప మార్పులు మాత్రమే ఉంటాయని స్పష్టం చేశారు. ఈ క్రమంలో రాష్ట్రంలో వేడి వాతావరణ కొనసాగుతోందని శనివారం తూర్పు తెలంగాణలోని సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి, నల్గొండ, వరంగల్ జిల్లాలతో పాటు రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో తీవ్ర వడగాలులు వీచాయని వెల్లడించారు. నిజామాబాద్లో అత్యధికంగా 46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, నల్గొండ, నిర్మల్, సిద్దిపేటలో 45.9, ఆదిలాబాద్, పెద్దపల్లిలో 45.8. కామారెడ్డి, ఆసిఫాబాద్లో 45.7, జగిత్యాలలో 45.6,
నవతెలంగాణ- గట్టువేడి వేడి సాంబార్లో పడి బాలిక మృతి చెందిన ఘటన జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండల పరిధిలోని వాయుకుంట తండాలో శనివారం చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం గట్టు మండల పరిధిలోని వాయుకుంట తండాలో శంకర్ నాయక్ నివాసం ఉంటున్నారు. వారం రోజుల క్రితం ఇంటి పక్కన పెళ్లి సంబంధం ఉండడంతో శంకర్నాయక్ కుటుంబ సభ్యులు అక్కడికి వెళ్లారు. తల్లితోపాటు ఆమె కూతురు 18నెలల అను కూడా నడుచుకుంటూ వెళ్లింది. నడుస్తున్న క్రమంలో […] The post వేడి సాంబారులో పడి చిన్నారి మృతి appeared first on Navatelangana.
వెంటనే కొనుగోళ్లు చేపట్టాలి : రైతుల డిమాండ్మోపాల్, ఆర్మూర్, తల్లాడల్లో నిరసననవతెలంగాణ-మోపాల్/ఆర్మూర్/తల్లాడధాన్యం కొనుగోలులో నిర్లక్ష్యం సరికాదని.. వెంటనే కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. శనివారం మండల కేంద్రంలో దొడ్డు రకం ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ రాస్తారోకో చేపట్టారు. అనంతరం రోడ్డుపైనే మానవహారం చేపట్టి నిరసన తెలియజేశారు. అలాగే ఆర్మూర్ పట్టణంలోని మున్సిపల్ పరిధిలోని పెర్కిట్ 44వ జాతీయ రహదారి శివాలయం సమీపంలో రైతులు రాస్తారోకో చేపట్టారు. దీంతో కొద్దిసేపు రహదారిపై ఉద్రిక్తత నెలకొంది. […] The post ధాన్యం కొనుగోలులో నిర్లక్ష్యం సరికాదు appeared first on Navatelangana.
భారీగా ఆస్తినష్టంనవతెలంగాణ – మెట్పల్లిజగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో శనివారం ఓ ఆటో స్టోర్లో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆటో స్టోర్ పూర్తిగా దగ్ధమైంది. మెట్పల్లి పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యాడ్ దగ్గరలోని శ్రీనాథ్ ఆటోస్టోర్లో మధ్యాహ్నం పొగ రావడం గమనించిన స్టోర్ యజమాని అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించాడు. అంతలోనే షాపులోని ప్లాస్టిక్ సామగ్రి, టైర్లు, ఆయిల్ వల్ల మంటలు విస్తరించి స్టోర్ మొత్తం వ్యాపించాయి. అక్కడకు చేరుకొన్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి […] The post ఆటోస్టోర్లో అగ్ని ప్రమాదం appeared first on Navatelangana.
వడోదర ఎంఎస్యూలో కొత్త సోషియాలజీ కోర్సులుతప్పుబడుతున్న విద్యావేత్తలు, మేధావులుసిలబస్ పునర్వ్యవస్థీకరణపై విమర్శల వెల్లువవడోదర : దేశంలో విద్యను కాషాయికరించడంలో మోడీ సర్కారు ఇప్పటికే పలు ప్రయత్నాలు మొదలు పెట్టింది. జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ) తీసుకొచ్చి ఇప్పటికే వివాదాన్ని రాజేసింది. ఇదే ఎన్ఈపీని ఆధారంగా చేసుకొని దేశంలో విద్యా స్వేచ్ఛను హరించేస్తోంది. తన కాషాయ సిద్ధాంతాలను అమలు చేస్తోంది. ఇందులో భాగంగా రాజకీయ జోక్యాన్ని తీవ్రతరం చేస్తోంది. ఇందుకు బీజేపీ పాలిత రాష్ట్రం గుజరాత్లోని మహారాజ్ సయాజీరావ్ […] The post మోడీతత్వం.. ఆరెస్సెస్..హిందూయిజం appeared first on Navatelangana.
ఏ ఉద్యోగం వచ్చినా చేయాలి : మెగా జాబ్ మేళాలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డినవతెలంగాణ -నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధినిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా శనివారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని ‘న్యాక్’ (నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్) లో నిర్వహించిన మెగా జాబ్ మేళాను ఆయన ప్రారంభించారు. దేశంలో […] The post నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు కల్పిస్తాం appeared first on Navatelangana.
సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎండి.జహంగీర్బైకాని నరసింహ స్థూపావిష్కరణనవతెలంగాణ-రామన్నపేటపేదలకు నాణ్యమైన వైద్యం అందించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎండి జహంగీర్ కోరారు. అనేకమంది పేదలకు నాణ్యమైన వైద్యం అందక వైద్య చికిత్సలు చేయించుకోవడానికి డబ్బులు లేక ప్రాణాలు వదులుతున్నారని, పేదలకు నాణ్యమైన వైద్యం అందించడం కోసం ప్రభుత్వాలు కృషి చేయాలని డిమాండ్ చేశారు. యాదాద్రిభువనగిరి జిల్లా రామన్నపేట మండలం పల్లివాడ గ్రామంలో ఆ పార్టీ సీనియర్ నాయకుడు బైకాని నరసింహ స్మారక స్తూపావిష్కరణ, సంతాప […] The post పేదలకు నాణ్యమైన వైద్యం అందించాలి appeared first on Navatelangana.
రూ.3393కి చేరిన వాణిజ్య సిలిండర్ ధరవీధిన పడనున్న చిరువ్యాపారులుఇద్దరు చేసేపని ఒక్కరితోనే..నవతెలంగాణ-నిజామాబాద్ ప్రాంతీయ ప్రతినిధివాణిజ్య సిలిండర్ ధర పెంపువల్ల ఎంతోమంది ఉపాధికి దూరం కాబోతున్నారు. ఏకంగా రూ.993 పెంచడంతో చిరువ్యాపారులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఇప్పటికే గ్యాస్ సరఫరా లేక బ్లాక్లో కొనుగోలు చేస్తూ వ్యాపారం చేసుకుంటూ పొట్టపోసుకుంటున్న ఎంతోమందికి చిరు వ్యాపారులకు మూలిగేనక్కపై తాటికాయ పడ్డ చందంగా మారింది. సిలిండర్పై ఏకంగా వెయ్యి రూపాయల వరకు పెంచడంతో ఆందోళన చెందుతున్నారు. వాణిజ్య సిలిండర్ ధర రూ.3393కు చేరడంతో […] The post గ్యాస్ ధర పెంపుతో ఉపాధిపై దెబ్బ appeared first on Navatelangana.
ఉస్మానియా మార్చురీ వద్ద కుటుంబ సభ్యులకు పరామర్శనవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) ప్రమాదంలో మరణించిన బాధిత కుటుంబాలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శనివారం ఉదయం పరామర్శించారు. ఘోర రోడ్డు ప్రమాదంలో సిరిసిల్లకు చెందిన ఆరుగురు వ్యక్తులు మృతి చెందడంపై ఆయన తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. హైదరాబాద్లోని ఉస్మానియా జనరల్ హాస్పిటల్ మార్చురీకి చేరుకున్న ఆయన మృతుల పార్థివ దేహాల వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం అక్కడ ఉన్న […] The post ఓఆర్ఆర్ మృతులకు కేటీఆర్ నివాళి appeared first on Navatelangana.
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాల్లో కిశోర బాలికల కోసం ‘స్నేహ సమ్మర్ క్యాంప్స్’ ఘనంగా ప్రారంభమయ్యాయి. సెర్ప్ ఆధ్వర్యంలో ప్రణాళికాబద్ధంగా అమలవుతున్న ఈ సమ్మర్ క్యాంపుల్లో పెద్ద సంఖ్యలో టీనేజ్ బాలికలు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. మే 2 నుంచి జూన్ 10 వరకు నిర్వహించబడుతున్న ఈ క్యాంపులు కిశోర బాలికల సమగ్ర అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకుని ప్రత్యేకంగా రూపొందించారు. వివిధ సెషన్ల ద్వారా బాలికలకు ఆరోగ్యం, భద్రత, విద్య, జీవన నైపుణ్యాలు (లైఫ్ స్కిల్స్)పై […] The post కిశోర బాలికల కోసం ‘స్నేహ సమ్మర్ క్యాంప్స్’ ప్రారంభం appeared first on Navatelangana.
రవాణా శాఖ మంత్రి పొన్నంనవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ) అధికారులు, సిబ్బంది ప్రయాణికుల పట్ల సానుకూల వైఖరిని అవలంబించాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. శనివారం ఆర్టీసీ ఎండీ వై.నాగిరెడ్డితో కలిసి ఉన్నతాధికారులతో నిర్వహించిన జూమ్ సమావేశంలో మంత్రి పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితో జరిగిన సమావేశంలో ఆర్టీసీ కార్మిక సంఘం నాయకులు లేవనెత్తిన అంశాలపై మంత్రి ఈ సందర్భంగా […] The post ప్రయాణికుల పట్ల సానుకూల వైఖరితో ఉండాలి appeared first on Navatelangana.

ఇరాన్ నౌకల స్వాధీనంలో అమెరికన్ నేవీ పైరేట్స్ పాత్రపోషిస్తుంది నౌకలలోని చమురంతా అమెరికాకే ఇది లాభసాటి వ్యాపారంలా ఉంది ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలుఫ్లోరిడా: ఇరాన్ పోర్టుల దిగ్బంధానికి అమెరికా నౌకలు ఎంతకైనా తెగిస్తాయని ట్రంప్ తెలిపారు. అవును అవసరం అయితే తమ బలీయమైన యు ఎస్ నేవీ పైరెట్స్ పాత్ర పోషిస్తుందని తెలిపారు. అమెరికాలోని ఫ్లోరిడాలో శుక్రవారం రాత్రి తరువాత ఆయన ఓ ర్యాలీలో ఉత్సాహంతో ప్రసంగించారు. ఇరాన్పై బ్లాకేడ్ సాగుతోంది. ఇరాన్ చమురుతో కూడిన నౌక లు, ట్యాంకరును అమెరికా నౌకాదళాలు స్వాధీనం చేసుకున్న విషయాన్ని బహిరంగంగా ప్రకటించారు. ఈ పని చాలా ఘనంగా జరిగిందని చెప్పా రు. సముద్ర జలాల్లో ఆ నౌకలపైకి చేరుకున్నామని, వాటిని స్వాధీనం చే సుకున్నామని, అందులోని చమురును తీసుకున్నామని, ఇదంతా కూడా చాలా లాభసాటి వ్యాపారవ్యవహారం అన్పిస్తోందని ర్యాలీలో తెలిపారు. అమెరికా నౌకాదళాలు ఇప్పుడు ఏకంగా సముద్ర జలాల్లో సాయుధ దోపిడీలకు దిగుతున్నాయని ఇరాన్ మండిపడింది. ఇరాన్ ముడిచమురును తీసుకువస్తున్న రెండు ట్యాంకర్లను అమెరికా నౌకలు అటకాయించడంపై ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఆగ్రహం వ్యక్తం చేశారు.
లావణ్య త్రిపాఠి కొణిదెల, దేవ్ మోహన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘సతీ లీలావతి’. ఆనంది ఆర్ట్స్ సమర్పణలో దుర్గాదేవి పిక్చర్స్ బ్యానర్పై నాగమోహన్ నిర్మించారు.తాతినేని సత్య దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని ఈనెల 8న వరల్డ్ వైడ్గా రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. ఈ క్రమంలో శనివారం హీరో రామ్ చరణ్ ఈ చిత్ర ట్రైలర్ను రిలీజ్ చేశారు.ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో లావణ్య త్రిపాఠి మాట్లాడుతూ, ‘సత్య, ఉదరు మంచి కథని నా వద్దకు తీసుకు వచ్చారు. […] The post అందర్నీ మెప్పించే ‘సతీ లీలావతి’ appeared first on Navatelangana.