
3480 వార్తలు






ఢిల్లీ: ఇంట్లో ఎసి పేలడంతో తొమ్మిది మంది మృతి చెందిన సంఘటన ఢిల్లీలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... వివేక్ విహార్లో ఆదివారం వేకువజామున ఎసి పేలడంలో మంటలు వ్యాపించాయి. భారీ ఎత్తున మంటలు చెలరేగడంతో పాటు పొగ ఎక్కువగా రావడంతో ఊపిరాడక తొమ్మిది మంది మృతి చెందారు. స్థానికుల సమాచారం మేరకు సిబ్బంది 12 అగ్నిమాపక యంత్రాలతో ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పేశారు. పోలీసులు తొమ్మిది మృతదేహాలను గుర్తించామని చెప్పారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని స్థానిక మీడియా వెల్లడించారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని వివిధ ఆస్పత్రులకు తరలిస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.


విలనిజం అయినా, క్యారెక్టర్ రోల్ అయినా.. తనదైన పవర్ఫుల్ నటనతో స్క్రీన్పై మ్యాజిక్ చేసే నటి వరలక్ష్మి శరత్కుమార్. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ టాలీవుడ్లో వర్సటైల్ హీరోగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు నవీన్ చంద్ర. ఇప్పుడు వీరిద్దరూ కలిసి ఓ సరికొత్త, భిన్నమైన కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. వీరిద్దరి క్రేజీ కాంబినేషన్లో డైరెక్ట్ సంజీవ్ మేగోటి తెరకెక్కించిన తాజా చిత్రం ‘పోలీస్ కంప్లైంట్’. ఎంఎస్కే ప్రమిద శ్రీ ఫిలిమ్స్ బ్యానర్పై బాలకృష్ణ మహారాణా నిర్మిస్తున్న ఈ మూవీ మే 22న గ్రాండ్గా థియేటర్లలో విడుదల కాబోతోంది. ఈ సినిమాలో మ్రో కీల్క పాత్ల్రో న్టించిన కృష్ణసాయి బర్త్ డే సందర్భంగా అభిమాన నటుడు సూప్ స్టార్ కృష్ణపై ఈ సినిమాలో చేసిన స్పెష్ల్ సాంగ్ను విడుదల చేశారు.ఈ సందర్భంగా దర్శకుడు సంజీవ్ మేగోటి మాట్లాడుతూ ‘ వరలక్ష్మి శరత్కుమార్ , నవీన్ చంద్ర చంద్ర క్రేజీ కాంబినేష్న్ అంద్రిని ఆక్ట్టుకుంటుంది. ’చైన్ రియాక్షన్ ఆఫ్ కర్మ’ అనే కాన్సెప్ట్ ఆధారంగా తెరకెక్కిస్తున్నాం. ఇదొక అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్. దీనికి హారర్ థ్రిల్లర్ అంశాలను జోడించి మునుపెన్నడూ చూడని కొత


నందమూరి నటసింహం బాలకృష్ణ తన కెరీర్ 111వ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. హిట్ దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్న ఈ సినిమా తాజాగా మొదలైంది. అయితే ఈ సినిమాలో బాలయ్య సరసన హీరోయిన్ గా ఎవరు నటిస్తున్నారు అనేది సస్పెన్స్ గా మారింది. మొదట కోలీవుడ్ స్టార్ హీరోయిన్ నయనతార ఈ సినిమా కోసం ఫిక్స్ అయ్యింది కానీ తర్వాత మరో స్టార్ బ్యూటీ కాజల్ అగర్వాల్ పేరు కూడా వచ్చింది. ఇప్పుడు ఫైనల్ గా మేకర్స్ కాజల్ తోనే ముందుకు వెళుతున్నట్టు తెలిసింది. కాజల్ తో మొదటి షెడ్యూల్ కూడా ఇప్పుడు మొదలు కానుండగా ఆమె ఈ షెడ్యూల్ కోసం ఈ నెల మొత్తం కేటాయించిదట.గతంలో ’భగవంత్ కేసరి’లో బాలయ్యతో కలిసి నటించిన కాజల్, మరోసారి ఆయన సరసన నటిస్తోంది.

బెంగళూరు: భార్య మరో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకోవడంతో ఇద్దరు పిల్లలను చంపి అనంతరం భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన కర్నాటక రాష్ట్రం తుమకూరు ప్రాంతంలో కునిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... అలకెరే గ్రామంలో శివణ్ణ, కావ్య అనే దంపతులు నివసిస్తున్నారు. ఈ దంపతులకు జీవన్(10), ప్రణీశ్(05) అనే కుమారులు ఉన్నారు. శివణ్ణ మల్లేశ్వర దేవాలయంలో పూజారిగా ఉంటూ ఓ ఫ్యాక్టరీలో పని చేస్తున్నాడు. ముగనపురా హేమంత్తో కావ్య అక్రమ సంబంధం పెట్టుకుంది. దీంతో దంపతుల మధ్య గత కొన్ని రోజుల నుంచి గొడవలు జరుగుతున్నాయి. ఘర్షణలు తారా స్థాయికి చేరుకోవడంతో కావ్య తన పిల్లలను తీసుకొని పుట్టింటికి కురుడిహళ్లికి వెళ్లిపోయింది. దీంతో శివణ్ణ తన అత్తగారింటికి వెళ్లి పిల్లలను తీసుకొని తన సొంతూరుకు వచ్చాడు. పిల్లలను ఇద్దరిని చంపి అనంతరం అతడు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి భార్యతో సహా ఆమె ప్రియుడును అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.
నవతెలంగాణ-హైదరాబాద్ : హర్మూజ్ జలసంధిపై తమకు పూర్తి నియంత్రణ ఉందని, తమ అనుమతి లేకుండా స్నేహపూర్వక లేదా శత్రు దేశాలకు చెందిన ఏ నౌక కూడా ఆ మార్గం గుండా ప్రయాణించలేదని ఇరాన్ ఆర్మీ స్పష్టం చేసింది. ఈ జలసంధిని నియంత్రించడం తమకు ఉన్న సహజమైన హక్కు అని ఇరాన్ ఆర్మీ ప్రతినిధి మహమ్మద్ అక్రమినియా అన్నారు. ప్రస్తుతం ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC), దేశ సైన్యం సంయుక్తంగా హర్మూజ్ జలసంధిని పూర్తిస్థాయిలో నియంత్రిస్తున్నాయని […] The post అనుమతి లేకుండా ఒక్క నౌక కూడా హర్మూజ్ దాటదు: ఇరాన్ appeared first on Navatelangana.

ఢిల్లీ: భార్య వేధింపులు తట్టుకోలేక జడ్జి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఢిల్లీలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... అమన్ కుమార్ శర్మ(30) అనే వ్యక్తి జిల్లా కోర్టులో ప్రధాన న్యాయమూర్తిగా సేవలందిస్తున్నాడు. అమన్ ఓ యువతిని పెళ్లి చేసుకున్నాడు. అతడి భార్య న్యాయాధికారి కావడం గమనార్హం. దంపతుల మధ్య గత కొన్ని రోజుల నుంచి గొడవలు జరుగుతున్నాయి. కోడలి సోదరి అయిన ఐఎఎస్ అధికారి జోక్యం చేసుకోవడంతో గొడవలు తారాస్థాయికి చేరుకున్నాయి. భార్య, ఆమె సోదరి వేధింపులు తట్టుకోలేక తన కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని అమన్ తండ్రి తెలిపాడు. భార్య వేధింపులు ఎక్కువగా కావడంతో అమన్ ఆత్మహత్యకు ప్రధాన కారణమని అతడు కుటుంబ సభ్యులు ఆరోపణలు చేశారు.
నవతెలంగాణ-హైదరాబాద్ : టెక్సాస్లోని అమరిల్లో నగరంలో కాల్పుల కలకలం చోటుచేసుకుంది. శనివారం తెల్లవారుజామున సుమారు 2 గంటల ప్రాంతంలో వెస్ట్మిన్స్టర్ అపార్ట్మెంట్ కాంప్లెక్స్లో జరుగుతున్న ఒక వేడుక రక్తసిక్తమైంది. అపార్ట్మెంట్లో పార్టీ జరుగుతుండగా గుర్తుతెలియని వ్యక్తులు లోపలికి చొరబడి విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ హింసాత్మక ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానిక నివేదికల ప్రకారం.. డజన్ల కొద్దీ కాల్పులు జరగడంతో ఆ ప్రాంతమంతా భయానక వాతావరణం నెలకొంది. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన […] The post టెక్సాస్లో కాల్పుల కలకలం..ఇద్దరు మృతి! appeared first on Navatelangana.
నవతెలంగాణ-హైదరాబాద్ : ఢిల్లీలో జిల్లా కోర్టు న్యాయమూర్తిగా పనిచేస్తున్న అమన్ కుమార్ శర్మ (30) ఆత్మహత్యకు పాల్పడ్డారు. బాత్రూమ్లో ఆయన ఉరి వేసుకొని ప్రాణాలు తీసుకున్నట్టు పోలీసులు శనివారం వెల్లడించారు. ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారులు వెల్లడించారు. ఆయన భార్య కూడా న్యాయాధికారేనని తెలిసింది. కొన్నాళ్లుగా భార్యాభర్తల మధ్య వివాదం నెలకొందని, కోడలి సోదరి అయిన ఐఏఎస్ అధికారి జోక్యం చేసుకోవడంతో తన కుమారుడు వేదనకు గురయ్యాడని అమన్ తండ్రి […] The post భార్య వేధింపులు..జడ్జి ఆత్మహత్య..! appeared first on Navatelangana.

మేష రాశి వారికి ఈ వారం అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. మధ్యలో ఆగిపోయిన పనులు పూర్తిచేస్తారు. వ్యాపారములు లాభసాటిగా సాగుతాయి. సహోదరి సహోదరుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి. కుటుంబ వ్యవహారాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. విదేశీ వ్యవహారాలు విదేశాలలో ఉండి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూలమైన ఫలితాలు ఉంటాయి. పోటీ పరీక్షలలో ఇంటర్వ్యూలలో పాల్గొనేవారు ప్రతిరోజు దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదవండి. వృత్తి ఉద్యోగాలలో సమస్యలను దైర్యంగా పరిష్కరించుకుంటారు. ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమశ్శివాయ వత్తులతో దీపారాధన చేయండి. మీ వ్యవహార శైలికి విరుద్ధంగా ఏ పని చేయరు. వివాహ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య ఎనిమిది కలిసి వచ్చే రంగు గ్రే. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు బుధవారం కానీ శనివారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.వృషభ రాశి వారికి వారం చాలా అనుకూలంగా ఉంది. ఉద్యోగ పరంగా వ్యాపారపరంగా సానుకూలమైన ఫలితాలను సాధించగలుగుతారు. ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించాలి. కొన్ని వ్యవహారాలలో ఆప్తులతో వివాదాలు కలుగుతాయి. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతు
నవతెలంగాణ-హైదరాబాద్ : ఒంటిపై డీజిల్ పోసుకొని నిప్పంటించుకుని బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన హైదరాబాద్లోని మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. కీర్తి(21) గండిపేటలోని ఎంజీఐటీ కాలేజీలో బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతోంది. అయితే ఎప్పటి లాగానే కాలేజీకి వెళ్లి మధ్యాహ్నం ఇంటికి వచ్చిన కీర్తి ఇంట్లో ఉన్న డీజిల్ పోసుకొని నిప్పంటించుకుని సూసైడ్ చేసుకుంది. ఇందుకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఆమె సోదరుడు నాగరాజు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు […] The post డీజిల్తో నిప్పంటించుకుని బీటెక్ విద్యార్థిని సూసైడ్.. appeared first on Navatelangana.





