
3451 వార్తలు
పాలకులకు పనిచేస్తున్న విలేకరులు..కొందరి ప్రవర్తనతో మీడియా పరువు పోతోంది..నవతెలంగాణ-అచ్చంపేటఒక్క సిరా చుక్క లక్ష మెదడులను కదిలింప చేస్తుంది. ఆలోచింప చేస్తుందని ఓ కవి వర్ణించాడు. ఎక్కడో చదివిన జ్ఞాపకం జర్నలిజం అంటే.? ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య ఉంటూ ప్రజా సమస్యల గుర్తించి వార్త కథనాల రూపంలో ప్రచురించి పరిష్కారానికి కృషి చేయాలి. ప్రజాధనం దుర్వినియోగం కాకుండా అధికారుల తప్పిదాలను అక్రమాలను నిష్పక్షపాతంగా ప్రజలకు తెలియజేయడమే నిజమైన జర్నలిజం. ప్రజాస్వామానికి నాలుగో పిల్లర్ మీడియా. మీడియా అవినీతి అక్రమాలకు పాల్పడితే ప్రజాస్వామ్యం దెబ్బతింటుంది. దీని […] The post దారి తప్పుతున్న జర్నలిజం appeared first on Navatelangana.

భారతదేశ ఆటో మొబైల్ మార్కెట్లో రూ.15 లక్షల కంటే తక్కువ ధరకే అనేక ఎస్యూవీలు అందుబాటులో ఉన్నాయి. మహీంద్రా, టాటా మోటార్స్, మారుతి సుజుకి వంటి ప్రధాన కంపెనీలు ఈ బడ్జెట్లో అనేక ఎంపికలను అందిస్తున్నాయి. ఈ ఎస్యూవీలలో ఇప్పుడు పనోరమిక్ సన్రూఫ్లు, వెంటిలేటెడ్ సీట్లు (కూల్డ్ సీట్లు) ADAS వంటి సెఫ్టి ఫీచర్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో రూ.15 లక్షల లోపు కొత్త ఎస్యూవీ కొనాలని ప్లాన్ చేస్తుంటే మార్కెట్లో అనేక ఎంపికలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. కియా సోనెట్భారతదేశంలో రూ.15 లక్షల లోపు ఎస్యూవీ విభాగంలో అత్యంత సరసమైన ఎంపికలలో కియా సోనెట్ ఒకటి. ఇది 82bhp,115 Nm ఉత్పత్తి చేసే 1.2-లీటర్ నాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్తో లేదా 118 bhp, 172 Nm ఉత్పత్తి చేసే 1.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్తో వస్తుంది. ఇది 6-స్పీడ్ ఇంటెలిజెంట్ మాన్యువల్ (iMT) లేదా 7-స్పీడ్ డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఆప్షన్తో కూడా వస్తుంది. కియా సోనెట్లో డీజిల్ ఇంజన్ ఆప్షన్ను కూడా అందిస్తోంది. ఇందులో 1.5-లీటర్ (114.4 bhp/250 Nm) ఇంజన్ను 6-స్పీడ్ మాన్యువల్, iMT, లేదా టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ (AT) ట్రాన్స్మిషన్తో జత
నవతెలంగాణ-మద్నూర్మద్నూర్ మండల కేంద్రంలోని గురు ఫంక్షన్ హాల్ లో ఆదివారం నాగమణి రాజు అప్ప కుమార్తె శ్రద్ధ పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకకు స్థానిక ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. అదేవిధంగా పెండ్లి కుమార్తె కుటుంబ సభ్యులు ఎమ్మెల్యేను ఘనంగా సత్కరించారు. ఎమ్మెల్యే వెంట కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు దరాసు సాయిలు , స్థానిక సర్పంచ్ ఉష సంతోష్, ఉప సర్పంచ్ రమేష్, స్థానిక కాంగ్రెస్ నాయకులు […] The post వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే తోట appeared first on Navatelangana.
సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో మేడే జండావిష్కరణనవతెలంగాణ-ఆలేరు రూరల్బీ జే పీ నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న 4 లేబర్ కోడ్ ల మూలంగా యాజమాన్యాల ముందు కార్మికవర్గాన్ని బానిసలుగా చేసి శ్రమను దోచుకోవడమే నని సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ భువనగిరి డివిజన్ కార్యదర్శి ఇక్కిరి సహదేవ్, ఏ ఐ కె ఎం ఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి బెజాడి కుమార్, ఐ ఎఫ్ టి యు జిల్లా అధ్యక్షులు పద్మ సుదర్శన్ లు […] The post కార్మిక చట్టాలను రద్దు చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదు appeared first on Navatelangana.
“పట్టుదలకి ప్రతిఫలం – విద్యార్థులకు ఘన సన్మానం” గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి నవతెలంగాణ-మక్తల్ మక్తల్ మండలంలోని మాధ్వార్ గ్రామంలో విద్యా ప్రాధాన్యతను ప్రతిబింబించే విధంగా గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి గారి ఆధ్వర్యంలో SSC మరియు ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు ఘనంగా అభినందన సన్మాన సభ నిర్వహించారు. ఇటీవల విడుదలైన ఫలితాల్లో విజయాన్ని సాధించిన సుమారు 50 మంది విద్యార్థులను శాలువాలతో సత్కరించి, ప్రోత్సాహకంగా రామకృష్ణ మఠం వారు ప్రచురించిన “మేలుకో నేస్తమా” అనే పుస్తకాన్ని బహుకరించారు.ఈ సందర్భంగా […] The post విజేతలకు గ్రామాభిమాన సత్కారం appeared first on Navatelangana.
నవతెలంగాణ – మిరుదొడ్డి వ్యవసాయ పంట పొలాల్లో చేతికి తాకేంత ఎత్తులో వేలాడుతున్న కరెంటు తీగలు ప్రమాదగంటికలు మోగిస్తున్నాయి. ఈ తీగల కింద వ్యవసాయం చేయాల్సి రావడంతో రైతులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఎప్పుడు ప్రమాదం జరుగుతుందో అన్న ఆందోళనతో పనులు చేయాల్సి వస్తోంది. మండల పరిధిలోని ధర్మారం గ్రామానికి చెందిన బోయిని బొందయ్య తన వ్యవసాయ పొలంలో వేలాడుతున్న కరెంటు తీగలను తొలగించాలని పలుమార్లు అధికారులను కోరినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని వాపోతున్నాడు. దీంతో పంటపనులు […] The post పొంచిఉన్న ప్రమాదం.. పట్టించుకోని అధికారులు appeared first on Navatelangana.

కొత్త స్మార్ట్ ఫోన్ కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్! ప్రముఖ మొబైల్ కంపెనీ వివో ఈనెలలో తన వివో X300 సిరీస్లో రెండు కొత్త ఫోన్లను విడుదల చేయనుంది. అవి వివో X300 FE, వివో X300 FE. ఈ రెండు పరికరాలు మే 6న భారత టెక్ మార్కెట్లో లాంచ్ అవుతాయని కంపెనీ ఇటీవల ధృవీకరించింది. కాగా, ఈ రెండు పరికరాల సేల్స్ మే 14న ప్రారంభమవుతాయి. టీజర్లు, ఇటీవలి నివేదికలు ఈ రెండు పరికరాల దాదాపు అన్ని ఫీచర్లను వెల్లడించాయి. మరి రాబోయే వివో X300 FE, వివో X300 అల్ట్రాలలో ఉన్న ఫీచర్లు ఏమిటి/ వాటి అంచనా ధరలు ఏమిటో తెలుసుకుందాం. వివో X300 FE ఫీచర్లుమొదటి సిరీస్లోని కాంపాక్ట్ మోడల్ అయిన వివో X300 FE కొత్త ఆకుపచ్చ రంగు వేరియంట్లో వస్తుంది. ఇది ప్రత్యేకంగా భారతదేశంలో మాత్రమే అందుబాటులో ఉంటుందని కంపెనీ పేర్కొంది. ఈ పరికరంలో స్నాప్డ్రాగన్ 8 జెన్ 5 చిప్సెట్ ఉంటుందని టీజర్ కూడా ధృవీకరిస్తుంది. ఈ ఫోన్లో 6.31-అంగుళాల 1.5K LTPO ఆమోలెడ్ డిస్ప్లే ఉంటుంది. ఇది 120Hz వరకు రిఫ్రెష్ రేట్కు సపోర్ట్ చేస్తుంది. బ్యాటరీ పరంగా, ఈ పరికరంలో 6,500mAh బ్యాటరీ ఉంటుంది. ఇది 90W వైర్డ్, 40W వైర్లెస్ ఛార్జింగ్ కు సపోర్ట్ ఇస్తుంది. ఫోటోగ్రఫీ
మార్కెట్ దోపిడీని అరికట్టాలి మే 4,5,6 తేదీల్లో గ్రామీణ నిరసనలకు సీపీఐ(ఎం) పిలుపునవతెలంగాణ – భువనగిరివరి ధాన్యం పండించిన రైతుకు ప్రతి సీజన్లో తిప్పలు తప్పడం లేదు. ఒకవైపు ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయకపోవడం మరోవైపు మిల్లర్లు 40 కిలోలు కాదు 42 కిలోలు తూకం వేయడం రైతుల్ని నిట్టనిలువునా దోపిడీ చేస్తున్న పరిస్థితి జిల్లాలో కొనసాగుతున్నదని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎం డి జహంగీర్ ఆవేదన వ్యక్తపరిచారు. ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. మార్కెట్ […] The post ధాన్యం కొనుగోళ్ల వేగం పెంచాలి appeared first on Navatelangana.

హైదరాబాద్: పథకం ప్రకారమే ఈ దొంగతనం జరిగిందని కేంద్రమంత్రి బండి సంజయ్ ఆరోపించారు. సమాచారం తెలియగానే తాను ఇక్కడికు వచ్చానని అన్నారు. కరీంనగర్ పిఎంజె షాపులో కాల్పుల కలకలం రేపిన ఘటనపై స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చోరీ ఘటనపై సిపి గౌస్ ఆలంను అడిగి తెలుసుకుంటున్నామని, పోలీసులు విచారణ ప్రారంభించారని తెలియజేశారు. గాయపడిన వారికి చికిత్స అందిస్తున్నారని, కొందరిని మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలిస్తున్నారని అన్నారు. నిందితులు తెలుగు, హిందీ మాట్లాడుతున్నట్టు తెలిసిందని, మొత్తం ఐదుగురు వచ్చినట్టు తెలుస్తోందని అన్నారు. క్లూస్ టీమ్ వివరాలు తీసుకుంటున్నారని, నిందితులను తప్పకుండా పట్టుకుంటారన్ననమ్మకం తనకు ఉందని బండి సంజయ్ పేర్కొన్నారు.
తిరనున్న ప్రయాణికుల దశాబ్దాల కోరికనవతెలంగాణ – మల్హర్ రావుమండలంలోని కిషన్ రావుపల్లి నుంచి ఆటవిమార్గం గుండా భూపాలపల్లి జిల్లా కేంద్రం వరకు ఎప్పుడెప్పుడాని దశాబ్దాల కోరిక తీరేందుకు ఏళ్లుగా ఎదురుచున్న పారెస్ట్ లో మట్టి రోడ్డు పూర్తియింది.దీంతో భూపాలపల్లి జిల్లా, పెద్దపల్లి జిల్లాల ప్రయాణికులు వేతలు తిరడంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.మంథని నియోజకవర్గంలోని భూపాలపల్లి, పెద్దపల్లి రెండు జిల్లాల సరిహద్దుల్లో ఖమ్మంపల్లి-తాడిచెర్ల మానేరుపై ఇటీవల బ్రిడ్జి పూర్తియిన విషయం తెలిసిందే.అయితే తాడిచెర్ల మానేరు బ్రిడ్జి నుంచి […] The post ఫారెస్ట్ లో పూర్తయిన మట్టి రోడ్డు appeared first on Navatelangana.
సంకటంగా మారిన రెండు ఫొటోల విధానం..విబిజి రాంజి రద్దు చేయాలి ప్రజా సంఘాల డిమాండ్నవతెలంగాణ – మల్హర్ రావుఉపాధిహామీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్ ర్ అండ్ ఆజీవికా మిషన్ (వీబీ జీ రాంజీ)గా మార్పు చేసింది.గతంలో జాబ్ కార్డు కలిగిన కుటుంబానికి 100 రోజుల పనిదినాలు కల్పించగా ఈ ఆర్థిక సంవత్సరం నుంచి 125 రోజుల పని దినాలు అమలు చేస్తున్నారు.మండలంలో 8,495 వేల జాబ్ కార్డులు ఉండగా ఇందులో […] The post యాప్ తో కూలీలకు తప్పని తిప్పలు appeared first on Navatelangana.
నవతెలంగాణ-గాంధారి గాంధారి మాజీ జెడ్పిటిసి సభ్యుడు తానాజీరావు ఆదివారం రాష్ట్ర మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావును మర్యాదపూర్వకంగా కలిశారు. రానున్న స్థానిక సంస్థ ఎన్నికల్లో జడ్పిటిసి, ఎంపీటీసీ ఎన్నికల నేపథ్యంలో నియోజవర్గంలో అనుసరించాల్సిన వ్యూహంపై ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని పార్టీ పరిస్థితులపై చర్చించినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా గాంధారి మండలంలో జడ్పిటిసితో పాటు అన్ని గ్రామాల ఎంపీటీసీలు గెలుచుకునే విధంగా పార్టీ నాయకులను సమన్వయం చేసుకొని మండలంలో జడ్పిటిసితో పాటు ఎంపీపీ స్థానాన్ని కైవసం చేసుకోవాలని హరీష్ రావు సూచించినట్లు పార్టీ […] The post హరీష్ రావును కలిసిన మాజీ జెడ్పిటిసి తానాజీ రావు appeared first on Navatelangana.

అమరావతి: మంత్రి లోకేశ్ రెడ్ బుక్.. బ్లడ్ బుక్గా మారిందని మాజీ మంత్రి, వైసిపి నేత విడదల రజని విమర్శించారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట పోలీస్ స్టేషన్కు మాజీ మంత్రి విడదల రజిని చేరుకొని పాస్ పోర్ట్ పోలీసులకు అప్పగించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. 2500 మంది వైసిపి నాయకులపై అక్రమ కేసులు పెట్టారని, దాదాపు 800 మందిపై హత్యాయత్నం జరిగిందని, 390 మందిని హత్య చేశారని రజని మండిపడ్డారు. 700 మంది సోషల్ మీడియా యాక్టివిస్టులపై అక్రమ కేసులు పెట్టారని దుయ్యబట్టారు. ఇప్పటివకు 70 మందికి పైగా జర్నలిస్టులపై దాడులు చేశారని విడదల రజని దుయ్యబట్టారు. హైకోర్టు ఆదేశాలతో పిఎస్లో రజిని పాస్పోర్ట్ అప్పగించారు. రజిని పోలీస్ స్టేషన్లో సంతకం చేశారు. మాజీ మంత్రి రజిని వెంట ఇద్దరు న్యాయవాదులను పోలీసులు అనుమతించారు.
మంత్రి శ్రీధర్ బాబుకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన రేగులగూడెం సర్పంచ్ ఆమని సురేష్ నవతెలంగాణ – కాటారంమంథని నియోజకవర్గ అభివృద్ధికి రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు వరాల జల్లు కురిపించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాటారం సహా పది మండలాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణాలకు (SC కంపోనెంట్) క్రింద మొత్తం రూ.15 కోట్ల నిధులు ఆయన మంజూరు చేయించారు. కాటారం మండలానికి ప్రత్యేకంగా రూ.2.50 కోట్ల నిధులు కేటాయించడం ద్వారా గ్రామీణ మౌలిక […] The post కాటారం మండలానికి వరాల జల్లు appeared first on Navatelangana.
నవతెలంగాణ-హైదరాబాద్ : కల్వకుంట్ల కవిత పెట్టిన పార్టీ వల్ల ఎవరికీ ఎలాంటి ప్రయోజనం ఉండదని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న ఆయన, సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తన అమెరికా పర్యటన బిజీ కారణంగా ఇన్ని రోజులు తెలంగాణ రాజకీయాలపై దృష్టి సారించలేకపోయానని పేర్కొన్నారు. తండ్రి కేసీఆర్తో వచ్చిన విభేదాల కారణంగానే కవిత కొత్త పార్టీని స్థాపించారని పాల్ […] The post కవిత నన్ను రూ.10 కోట్లు అడిగింది : కేఏ పాల్ appeared first on Navatelangana.

హైదరాబాద్: కరీంనగర్ లో కేంద్రమంత్రి బండి సంజయ్ ఇంటికి సమీపంలో కాల్పులు జరిగాయి. కేంద్రమంత్రి ఇంటి వెనుక పిఎంజె జువెల్లర్ షాపులో పట్ట పగలే చోరీ జరిగింది. పిఎంజె జ్యువెలరీ షాపులోకి చొరబడిన ఏడుగురు దుండగులు సిబ్బందిపై విచ్చక్షణారహితంగా కాల్పులు జరపడంతో ఒకరు మృతి చెందగా నలుగురు తీవ్రంగా గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం వారిని హైదరాబాద్ లో ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. కరీంనగర్ జిల్లా జడ్జి క్వార్టర్ వెనుక వైపు ఈ ఘటన జరిగింది. ఏడుగురు దొంగలు నలుగురిపై కాల్పులు జరిపి బంగారం ఎత్తుకుపోయారు. సంఘటన స్థలానికి అతి సమీపంలో అంతకు అరగంట ముందే కేంద్ర మంత్రి బండి సంజయ్ సిసి రోడ్డు శంకుస్థాపన చేసి వెళ్లిపోయారు. ముందు రోజు శనివారం రాత్రి పోలీసులు నాకా బందీ నిర్వహించారు. అర గంట ముందు వరకు పోలీసు బందోబస్తు ఉన్నప్పటికీ ముఠా దోపిడీకి పాల్పడింది. కోర్టు వెనకాల లైన్ లో మ్యాగజైన్ లభ్యమైంది. పోలీసులు దొంగల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

ఇండియాలో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ వేగంగా పెరుగుతోంది. అనేక కంపెనీ తయారీదారులు ఇప్పుడు ద్విచక్ర వాహన విభాగంలో కొత్త బైక్లు విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓబెన్ ఎలక్ట్రిక్ తన కొత్త బైక్ ఓబెన్ రోర్ ఎవోను మార్కెట్లో పరిచయం చేసింది. ఇది స్టైల్, పవర్, ఎకానమీల అద్భుతమైన కలయిక. ఈ బైక్ ప్రారంభ ధర రూ. 124,999గా నిర్ణయించారు. అయితే, మొదటి 10,000 మంది కస్టమర్లకు ఈ ఎలక్ట్రిక్ బైక్ ను కేవలం రూ. 99,999 కే అందించనున్నారు. ఇది దీనిని మరింత ఆకర్షణీయంగా చేస్తుంది. ఓబెన్ రోర్ ఎవో డిజైన్ ఆకట్టుకుంటుంది. ఇది స్పోర్టీ లుక్ లో కనిపిస్తోంది. ఈ బైక్ ముందు భాగంలో ప్రొజెక్టర్ LED హెడ్లైట్, DRLలు ఉన్నాయి. ఇవి రాత్రిపూట ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. బైక్ ట్యాంక్ దృఢమైన, స్టైలిష్ రూపాన్ని కలిగి ఉంది. ఇది రోడ్డుపై దాని ఉనికిని మరింత పెంచుతుంది. బ్యాటరీని చల్లగా ఉంచడానికి కంపెనీ ప్రత్యేక ఎయిర్ ఛానెల్లతో కూడిన బెల్లీ పాన్ను అందించింది. ఇది దూర ప్రయాణాలలో కూడా పనితీరును నిర్ధారిస్తుంది. ఈ బైక్లో మధ్యలో అమర్చిన మోటార్ ఉంది. ఇది కొత్త టెక్నాలజీపై ఆధారపడి ఉంటుంది. ఈ మోటార్ ఎక్కువ శక్తిని అందిస్తుంది. ఈ బైక్ 9 kW

హైదరాబాద్: ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవం సందర్భంగా పాత్రికేయ సోదర, సోదరీమణులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాస్వామ్యంలో పత్రికా స్వేచ్ఛ, సత్యాన్వేషణ, సమాజహితానికి పాత్రికేయుల పాత్ర అత్యంత కీలకమని ఒక సందేశంలో పేర్కొన్నారు. నిబద్ధత, ధైర్యం, బాధ్యతతో పనిచేసే పాత్రికేయులు సమాజానికి మార్గదర్శకులుగా నిలుస్తున్నారని ప్రశంసిస్తున్నారు. ప్రజల గొంతుకగా నిలిచి, సమాజ పురోగతికి తోడ్పడుతున్న పత్రికా రంగానికి ముఖ్యమంత్రి అభినందనలు తెలియజేశారు.

ఐపిఎల్లో ఐదుసార్లు ఛాంపియన్గా నిలిచిన ముంబై ఇండియన్స్ జట్టు ఈ 19వ సీజన్లో మాత్రం చెతికిలబడుతోంది. సీజన్లో ఇప్పటివరకూ కేవలం రెండు మ్యాచుల్లో మాత్రమే గెలిచి టేబుల్లో 9వ స్థానంలో స్థిరపడింది. ఇక శనివారం చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో ఎంఐ అటు బౌలింగ్లోనూ, ఇటు బ్యాటింగ్లోనూ విఫలమైంది. ఫలితంగా చెన్నై ఈ మ్యాచ్లో ఘన విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్ అనంతరం ముంబై కెప్టెన్ హార్థిక్ పాండ్యా పలు కీలక వ్యాఖ్యలు చేశాడు. బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ తాము మెరుగ్గా రాణించలేకపోయామని హార్థిక్ చెప్పుకొచ్చాడు. ‘‘కేవలం ఒక్క మ్యాచ్ మాత్రమే కాదు.. సీజన్ మొత్తం మాకు కలిసి రాలేదు. ఈ రోజు సిఎస్కె అన్ని విభాగాల్లో మాకంటే మెరుగైన ప్రదర్శన చేసింది. ఒక దశలో మా స్కోర్ ఈజీగా 190 దాటుతుంది అనుకున్నాము. కానీ, చివర్లో మెరుపులు మెరిపించలేకపోయాం. ఒకవేళ అనుకున్న స్కోర్ చేసి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేది. పిచ్ కాస్త స్లోగా ఉంది. అందుకే క్రీజ్లోకి రాగానే షాట్లు ఆడేందుకు కష్టమైంది. క్రీజ్లో స్థిరపడ్డ ప్రత్యర్థి బ్యాటర్లకు అదే పరిస్థితి ఎదురైంది. దీంతో మా బ్యాటర్లు బంతిని సరిగ్గా హిట్ చేయలేకపోయారు. వాళ్లు

-మే ఒకటి నుంచి కొనుగోలు కేంద్రాల పోర్టళ్ళు పనిచేయడ లేదు– తీవ్రమైన ఎండలు, వడగాల్పులతో ఇబ్బందులు పడుతున్న అన్నదాతలు – ఉద్దేశపూర్వకంగానే మొక్కజొన్నలను ప్రభుత్వం కొనుగోలు చేయడం లేదు– తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు నవతెలంగాణ – బోనకల్ : కాంగ్రెస్ ప్రభుత్వానికి కళ్ళు చెవులు పనిచేస్తున్నాయా లేదా అంటూ తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గ పరిధిలోని బోనకల్ మండల పరిధిలోనే […] The post కాంగ్రెస్ ప్రభుత్వానికి కళ్ళు, చెవులు పనిచేస్తున్నాయా లేదా? appeared first on Navatelangana.
నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర నూతన డీజీపీగా సీవీ ఆనంద్ పగ్గాలు చేపట్టిన తర్వాతి రోజే పోలీస్ శాఖలో ప్రక్షాళన పర్వం మొదలైంది. క్షేత్రస్థాయిలో శాంతిభద్రతలను మరింత కట్టుదిట్టం చేయడంతో పాటు, పారదర్శకమైన పాలనను అందించడమే లక్ష్యంగా భారీ బదిలీలకు శ్రీకారం చుట్టారు. రాష్ట్రవ్యాప్తంగా పోలీస్ యంత్రాంగంలో మార్పులు చేర్పులు జరుగుతాయని భావిస్తున్న తరుణంలో, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో కీలక నిర్ణయం వెలువడింది. కమిషనరేట్ వ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్లలో పని చేస్తున్న 65 మంది సర్కిల్ […] The post సైబరాబాద్ కమిషనరేట్లో 65 మంది సీఐలు బదిలీ.. appeared first on Navatelangana.

