
అమెరికన్ నటి జో శర్మ ప్రధాన పాత్రలో దర్శకుడు మోహన్ వడ్లపట్ల తెరకెక్కించిన సస్పెన్స్ థ్రిల్లర్ ‘ఎం4ఎం’ చిత్రం మే 8న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. పివిఆర్ ఐనాక్స్ పిక్చర్స్ ద్వారా విడుదలవుతున్న ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా నటి జో శర్మ మీడియాతో మాట్లాడుతూ “ఈ సినిమాలో నా పాత్ర పేరు రాధ. నేను ఒక క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్గా కనిపిస్తాను. ఈ సినిమా ఇంకా రిలీజ్ కాకముందే మాకు 15 ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డులు వచ్చాయి. ముఖ్యంగా ప్రతిష్టాత్మక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో మా సినిమా గ్లోబల్ ప్రీమియర్ వేశారు. అక్కడ తెలుగు సినిమాను సబ్-టైటిల్స్తో చూసిన విదేశీయులు కూడా ఆశ్చర్యపోయి స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారు. అది మాకు దక్కిన చాలా గొప్ప గౌరవం. ఇది ఒక మర్డర్ మిస్టరీ థ్రిల్లర్. ప్రతి సీన్ చాలా గ్రిప్పింగ్గా, సీట్ ఎడ్జ్ థ్రిల్లర్లా సాగుతుంది. సినిమాలో హీరోగా ఏసీపీ కృష్ణ పాత్ర ఉంటుంది”అని అన్నారు.













