నవతెలంగాణ-హైదరాబాద్ : సింగపూర్‌లో కొవిడ్-19 కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. ఈ నెల 10 నుంచి 16 మధ్య 12,700 కొత్త కేసులు నమోదయ్యాయి, ఇది అంతకుముందు వారంతో పోలిస్తే 58.8% పెరుగుదల. ఈ కాలంలో ఆస్పత్రుల్లో చేరే వారి సంఖ్య కూడా 56 నుంచి 73కు పెరిగింది. అయితే, ఎలాంటి మరణాలు సంభవించలేదని వైద్యవర్గాలు తెలిపాయి. ప్రస్తుత వేరియంట్ ఎన్‌బీ.1.8.1పై వ్యాక్సిన్‌ సమర్థంగా పనిచేస్తుందని పేర్కొన్నాయి.

The post సింగపూర్‌లో కొవిడ్‌ కలకలం..58.8% పెరుగుదల appeared first on Navatelangana.