
అమరావతి: పాలిసెట్ ఫలితాల్లో బాలికలు 91.37 శాతం ఉత్తీర్ణత సాధించారని ఎపి మంత్రి లోకేష్ తెలిపారు. ఈ ఏడాది 1,77,581 మంది నమోదు చేసుకోగా, 1,63,008 మంది హాజరయ్యారని అన్నారు. పాలిసెట్-2026 ఎక్స్ లో లోకేష్ ఫలితాలు విడుదల చేశారు. గిరిజన జిల్లాల విద్యార్థుల ప్రతిభను లోకేష్ ప్రశంసించారు. బాలుర కంటే బాలికలు మెరుగైన ఫలితాలు సాధించారని, అల్లూరి, పోలవరం, పార్వతీపురం మన్యం జిల్లాలు అగ్రస్థానాల్లో నిలిచాయని తెలియజేశారు. గిరిజన ప్రాంతాల నుంచి విశేష ప్రతిభ కనబడిచారని, ఫెయిల్ అయినవారు మరింత పట్టుదలతో ముందుకు సాగాలని లోకేష్ సూచించారు.














