నవతెలంగాణ ఆసిఫాబాద్: కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలం కొర్శిని గ్రామంలో మంగళవారం ఇందిరమ్మ ఇంటి నిర్మాణంలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన వితంతువు సిడం సుగుణ(45) తన ఇంటి సమీపంలో మట్టిని తొలగిస్తుండగా, ఇటీవల పోసిన పిల్లర్ బాక్స్ కూలి ఆమెపై పడింది. కాంక్రీట్ మిశ్రమం, మట్టిలో చిక్కుకుపోయి ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
The post ఇందిరమ్మ ఇంటి నిర్మాణంలో అపశృతి…మహిళ మృతి appeared first on Navatelangana.













