పాలకుర్తి ఇరిగేషన్ డీఈ శ్రీకాంత్ రూ.50 వేలు లంచం తీసుకుంటూ ఎసిబికి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. పెండింగ్ బిల్లులను క్లియర్ చేయడానికి  పాలకుర్తి ఇరిగేషన్ డీఈ శ్రీకాంత్  రూ.50 వేలు కర్ర అశోక్ రెడ్డిని డిమాండ్ చేశాడు. పెద్ద వంగర మండలం కన్వాయిగూడెం గ్రామానికి చెందిన కర్ర అశోక్ రెడ్డి ఎసిబి అధికారులను ఆశ్రయించాడు. దీంతో హన్మకొండలోని భవానీ నగర్‌లో సోమవారం ఎసిబి అధికారుల దాడులు నిర్వహించారు.