
అమరావతి: బాలికపై చర్చి పాస్టర్ అత్యాచారం చేసి అనంతరం నెలసరి తప్పటంతో గర్భనిరోధక మాత్రలు ఇవ్వడంతో తీవ్ర రక్తస్రావం కావడంతో అనారోగ్యానికి గురై ఆస్పత్రిలో చేరింది. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏలూరు జిల్లాలో జరిగింది. కామవరపు కోట మండలంలోని ఓ గ్రామానికి చెందిన చౌటపల్లి రాంబాబు చర్చిచిని నిర్మించి ప్రార్థనలు చేసుకుంటున్నాడు. కూలిపనులు చేసుకునే ఓ కుటుంబం పాస్టర్ వద్దకు వచ్చి ప్రార్థనలు చేయించుకునేది. సదరు కుటుంబంలో బాలిక(14)కు పాస్టర్ మాయమాటలు చెప్పి లొంగదీసుకున్నాడు. పలుమార్లు బాలికపై అత్యాచారం చేయడంతో ఈ విషయం బయటకు చెబితే శపిస్తానని బెదిరించాడు. ఈ విషయం బాలికు బయటకు చెప్పలేదు. బాలికకు నెలసరి రాకపోవడంతో పాస్టర్ ఆమెకు గర్భనిరోధక మాత్రలు ఇచ్చాడు. అధిక మోతాదులో బాలికకు మాత్రలు ఇవ్వడంతో రక్తస్రావంతో బాధపడుతున్న ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లింది. వెంటనే ఆస్పత్రి సిబ్బంది పోలీసులకు సమాచారం ఇవ్వడంతో తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాలికపై అత్యాచారానికి పాల్పడిన పాస్టర్ శిక్షించాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.














