వాషింగ్టన్ : భారత సంతతికి చెందిన నాసా వ్యోమగామి అనిల్ మీనన్‌తోపాటు రష్యా వ్యోమగాములు ప్యోటర్ డుబ్రోవి, అన్నాకికినాలతో కలిసి మంగళవారం అంతరిక్షం లోకి పయనమయ్యారు. కజ్‌కిస్థాన్ లోని బైకనూర్ కాస్మోడ్రోమ్ నుంచి రష్యాకు చెందిన సోయజ్ ఎంఎస్ 29 వ్యోమనౌక ద్వారా రాత్రి 8.17 గంటలకు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి బయలుదేరారు. రెండో కక్ష తరువాత అంతరిక్షకేంద్రానికి చేరుకోవడానికి రెండు గంటలే పడుతుంది. రాత్రి 11.56 గంటలకు వ్యోమనౌక అంతరిక్షకేంద్రానికి చేరుకుంటుంది. అనిల్ మీనన్‌కు ఇదే తొలి అంతరిక్ష ప్రయాణం కావడం విశేషం.

ఎక్స్‌పెడిషన్ 74, 75 మిషన్లలో భాగంగా సుమారు ఎనిమిది నెలల పాటు మీనన్ అక్కడే ఉండి ప్రయోగాలు చేస్తారు. మీనన్ భార్య అన్నా విల్‌హెల్మ్‌తోపాటు కుటుంబ సభ్యులు, నాసా అడ్మినిస్ట్రేటర్ జెరెడ్ ఇసాక్‌మన్, బైకనూర్ కాస్మోడ్రోమ్ వద్ద నుంచి ఈ ప్రయోగాన్ని వీక్షించారు. అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన తరువాత ఈ ముగ్గురు వ్యోమగాములు నాసా వ్యోమగాములు జెసికా మెయిర్, జాక్‌హతావే, క్రిస్ విలియమ్స్‌ను , ఐరోపా అం తరిక్ష సంస్థ వ్యోమగామి సొఫియె అడెనాట్, రోస్‌కాస్మోస్ కాస్మోనాట్లు సెర్గే కుడ్సవెర్‌చకొవ్, సెర్గే మైకయెవ్, ఆండ్రీ ఫెడియెవ్‌లను క లుసుకుంటారు. 49 ఏళ్ల అనిల్ మీనన్ అమెరికాలోని మిన్నియా పాలిస్‌లో జన్మించారు. ఆ యన తండ్రి భారతీయుడు కాగా, తల్లి ఉక్రెయి న్ వాసి.నాసా వ్యోమగామిగా 2021లలో ఎం పిక కావడానికి ముందు ఆయన వైద్యం, సైనిక సేవల్లో అనుభవం సంపాదించారు.