పంజాబ్ కింగ్స్ యువ సంచలనం ప్రియాన్ష్ ఆర్య మరోసారి తన విధ్వంసకర బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో కేవలం 24 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేసి రికార్డు సృష్టించాడు. ఈ ఫిఫ్టీతో పవర్‌ప్లేలో అత్యధిక అర్ధశతకాలు నమోదు చేసిన రెండో భారతీయ ఆటగాడిగా నిలిచాడు. ప్రత్యర్థి బౌలర్లపై ఎలాంటి ఒత్తిడి లేకుండా దూకుడుగా ఆడిన ప్రియాన్ష్.. వైభవ్ సూర్యవంశీ ఉన్న ఎలైట్ క్లబ్‌లో చేరి మరో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు.