తెలుగు రాష్ట్రాలకు వాతావరణశాఖ రెయిన్ అలర్ట్ జారీ చేసింది. రానున్న రెండ్రోజుల పాటు వర్షసూచన జారీ చేసింది. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఉష్ణోగ్రతలు సాధారణ స్థితికి చేరుకుంటాయని స్పష్టం చేసింది. పలుచోట్ల పిడుగుపాటు హెచ్చరికలు కూడా ఇచ్చింది.