తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ కొరత తీవ్ర సంక్షోభాన్ని సృష్టించింది. ఆయిల్ కంపెనీల సరఫరా అంతరాయంతో బంకులు ఖాళీగా మారాయి. పొలం పనులకు కీలకం కావడంతో రైతులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ట్రాక్టర్లు నిలిచిపోవడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. కొందరు అక్రమార్కులు బ్లాక్ మార్కెట్‌లో అధిక ధరలకు ఇంధనాన్ని విక్రయిస్తూ కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని సరఫరాను క్రమబద్ధీకరించాలని ప్రజలు కోరుతున్నారు.