మొదట్లో నాటుకోళ్లు, సైకిళ్లు దొంగిలించిన ఆ చేతులు.. జల్సాలకు డబ్బు సరిపోకపోయేసరికి ఏకంగా బైక్ చోరీలకు స్కెచ్ వేశాయి. మార్కెట్‌లో డిమాండ్ ఉన్న పల్సర్ బైక్‌లనే టార్గెట్ చేస్తూ మిర్యాలగూడ, హుజూర్ నగర్, ఏపీలోని దాచేపల్లి ప్రాంతాల్లో హల్చల్ చేస్తున్న ముగ్గురు సభ్యుల ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు.